ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుండి తానేం మాట్లాడుతున్నారో కూడా కేసీయార్ కు అర్ధమవుతున్నట్లు లేదు. ప్రముఖ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎన్డీయేలో చేరాలని అనుకున్నమాట నిజమే అని అంగీకరించారు. అలాగే కేటీయార్ ముఖ్యమంత్రిని చేయాలని అనుకుని నరేంద్రమోడీ ఆశీర్వాదం అడిగిన మాట కూడా నిజమే అని అంగీకరించారు. కేసీయార్ ఇంటర్వ్యూ ఇపుడు ఎన్నికల సమయంలో సంచలనంగా మారింది.
కేసీయార్ ఇంటర్వ్యూ 27వ తేదీ మ్యాగజైన్లో ఉంది. ఆమధ్య నరేంద్రమోడీ తెలంగాణా పర్యటనలో మాట్లాడుతు కేసీయార్ ఎన్డీయేలో చేరుతానంటే తాను కుదరదని తేల్చి చెప్పినట్లు చెప్పారు. అలాగే కేటీయార్ ను సీఎం చేయాలని అనుకుంటున్నానని తన బ్లెస్సింగ్స్ అడిగితే కుదరదని చెప్పినట్లు మోడీ చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. దాంతో కాంగ్రెస్ నేతలు మోడీ, కేసీయార్ ఒకటే అని పెద్దఎత్తున గోల మొదలుపెట్టారు. ఇద్దరు ఒకటి కాకపోతే కేసీయార్ ఎన్డీయేలో చేరుతానని అడగటం, కేటీయార్ కు మోడీ ఆశీస్సులు దేనికని నిలదీశారు.
దాంతో కాంగ్రెస్ ఆరోపణలతో పాటు మోడీ వ్యాఖ్యలపై కేసీయార్ మాట్లాడలేదు కానీ కేటీయార్ విరుచుకుపడ్డారు. ఎన్డీయేలో చేరుతానని కేసీయార్ ఎన్నడూ అడగలేదని, తనను సీఎం చేయాలని కేసీయార్ అనుకుంటే మోడీ ఆశీస్సులు దేనికని ఎద్దేవా చేశారు. ఎంఎల్ఏల బలముంటే సరిపోతుంది కదాని లాజిక్ కూడా మాట్లాడారు. మోడీ వ్యాఖ్యల్లో, కేటీయార్ ఎదురుదాడిలో ఏది కరెక్టో జనాలకు తెలీదు. అయితే పోలింగ్ మరో పదిరోజులుండగా కేసీయార్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ చెప్పిందే నిజమని, కేటీయార్ అబద్ధం చెప్పారని అర్ధమైపోతోంది.
ఇంటర్వ్యూలో కేసీయార్ అంగీకరించిన విషయాలన్నీ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు బలమిచ్చేట్లుగానే ఉన్నాయి. ఇది ఒకరకంగా సేమ్ సైడ్ గోల్ వేసుకున్నట్లుగానే ఉంది. మ్యాగజైన్లోని వివరాలను కాంగ్రెస్ అడ్వాంటేజ్ తీసుకుని కేసీయార్+మోడీ ఒకటే అన్న ఆరోపణల మోతాదును పెంచితే బీఆర్ఎస్ కు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరీ ఇంటర్వ్యూను కాంగ్రెస్ నేతలు ఏ మేరకు అడ్వాంటేజ్ తీసుకుంటారో చూడాలి.
This post was last modified on November 19, 2023 3:44 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…