Political News

విపక్ష నేతలను కుక్కలతో పోల్చిన కేసీఆర్

ప్రతిపక్ష నేతలపై సీఎం కేసీఆర్ మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. జనగామ వచ్చి కుక్కలు మొరిగిపోయాయని బిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి బాధపడుతున్నారని కాంగ్రెస్ నేతలనుద్దేశించి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుక్కలు మొరుగుతూనే ఉంటాయని, విపక్ష నేతలనుద్దేశించి కేసీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కు పిండం పెడతానంటున్నారని, కానీ ఎవరికి పిండం పెట్టాలో ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. ఉద్యమం సమయంలో బచ్చన్నపేటలో నీటి ఎద్దడి చూసి ఏడ్చానని, ఈరోజు బచ్చన్నపేటలో చెరువులో నీళ్లు ఉంటున్నాయని, ప్రతి ఇంటికి నీరు అందించామని చెప్పుకొచ్చారు.

రైతుబంధు వృథా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని, కాంగ్రెస్ గెలిస్తే రైతులకు 3 గంటల విద్యుత్ ఇస్తారని కేసీఆర్ అన్నారు. 5 ఏళ్లలో కాంగ్రెస్ ఎన్నో సినిమాలు చూయించిందని, ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చే హామీలను నమ్ముతామా అని ప్రజలను ప్రశ్నించారు. అభ్యర్థుల గుణగణాలు, పార్టీ చూసి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే స్థితి కల్పించింది కాంగ్రెస్ అని, ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని దుయ్యబట్టారు. మళ్లీ దళారుల రాజ్యం తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు.

పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే క్రమంగా రైతుబంధును 16 వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. తెలంగాణను ముంచిన పార్టీ కాంగ్రెస్ అని తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బిఆర్ఎస్ అని చెప్పారు. 2004లో తమ పార్టీతో పొత్తు వల్లే కాంగ్రెస్, ఢిల్లీ, తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. అయినా, 2004లో ప్రత్యేక తెలంగాణ ఇవ్వలేదని అందుకే మరోసారి ఉద్యమం చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పారు. కేసీఆర్ చచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ సాధించానని చెప్పుకొచ్చారు. అంతకుముందు కాంగ్రెస్ పాలనను, ఈ పదేళ్ల బీఆర్ఎస్ పాలనను పోల్చి చూసుకోవాలని కేసీఆర్ అన్నారు. జనగామ నియోజకవర్గం చేర్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పై వ్యాఖ్యలు చేశారు.

This post was last modified on November 18, 2023 10:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

యూరిక్ యాసిడ్ సమస్యలకు జీలకర్రతో ఇలా చెక్ పెట్టండి..

ప్రస్తుతం మనలో చాలామంది తెలిసో తెలియకో ఇబ్బంది పడే సమస్యలలో యూరిక్ యాసిడ్ పెరుగుదల కూడా ఒకటి. చలికాలంలో ఈ…

1 hour ago

అల్లు అర్జున్ కు మరోసారి లీగల్ నోటీసులు!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…

10 hours ago

అవసరమైతే విదేశీ డాక్టర్లతో రేవతి కుమారుడు శ్రీతేజ్ కు వైద్యం!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…

10 hours ago

కరోనా వేళ ప్రభాస్‌తో డైరెక్టర్ శంకర్ చర్చలు!

తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…

11 hours ago

పార్ట్ 2 మంత్రం పని చేయలేనట్టేనా…?

విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…

13 hours ago

వైల్డ్ ఫైర్ ఎఫెక్ట్ : ఆంధ్ర వైపు సంక్రాంతి సినిమాల చూపు!

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…

13 hours ago