Political News

బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇచ్చేద్దాం: అమిత్‌షా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ చేస్తున్న ప్ర‌చారానికి బూస్ట్ ఇస్తూ.. ఆ పార్టీ అగ్ర‌నేత‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తాజాగా రాష్ట్రంలో ప‌ర్య‌టించారు. గద్వాల నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. కేసీఆర్ ప్ర‌భుత్వం పై నిప్పులు చెరిగారు. బీఆర్ ఎస్‌కు వీఆర్ ఎస్ ఇచ్చే స‌మ‌యం వ‌చ్చేసింద‌ని.. దీనికి అంద‌రూ రెడీ కావాల‌ని.. ఈ నెల 30న జ‌రిగే ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్‌కు వ్య‌తిరేకంగా ఓటేసి.. ఆ పార్టీకి రిటైర్మెంట్ ప్ర‌క‌టించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

“కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదు. గుర్రం గడ్డ వంతెన, గట్టు‌లిఫ్ట్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయలే దు. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశం కేసీఆర్ కేంద్రం దృష్టికి తీసుకు రాలేదు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తక్షణమే అమలు చేస్తాం. 52 శాతం బీసీ ఓటర్లు 130 కులాలున్న బీసీలను కేసీఆర్ ప్రభుత్వం విస్మరిస్తోంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తాం. ఎస్సీని ముఖ్య‌మంత్రిని చేస్తామ‌న్న కేసీఆర్‌.. ఆ మాట‌నుఎందుకు త‌ప్పారో .. తెలంగాణ స‌మాజం త‌మ ఓటు ద్వారా నిల‌దీయాలి” అని అమిత్ షా అన్నారు.

జోగులాంబ శక్తి పీఠం కోసం మోడీ సర్కార్ 70 కోట్లు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం ఆ నిధులను ఖర్చు చేయలేదని అమిత్ షా బీసీలకు బడ్జెట్‌లో బీజేపీ ప్రభుత్వం 3,300 కేటాయిస్తే.. కేసీఆర్ 77 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అన్నారు. “టీఎస్పీఎస్సీ పరీక్షల రద్దు, పేపర్ లీక్‌లతో నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారు. ప్రవళ్లిక ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణం. బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే రెండున్నర లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. సెప్టెంబ‌రు 17ను తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతాం. ముస్లింల‌కు మతపర రిజర్వేషన్లు రద్దు చేస్తాం” అని వ్యాఖ్యానించారు.

2-3-4 జీలు..

2జీ కేసీఆర్ – కేటీఆర్‌, 3జీ ఓవైసీ మూడు తరాలు, 4జీ గాంధీ 4 తరాలు దేశాన్ని, రాష్ట్రాన్ని ఎలాయని అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు విముక్తి కల్పించాల‌ని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అవినీతి మయంగా మారిందని, కాంగ్రెస్ పార్టీ అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని 70ఏళ్లు‌ నాన్చిందని విమ‌ర్శించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ప్రజలందరికీ అయోధ్య దర్శనం ఉచితంగా కల్పిస్తామ‌ని అమిత్ షా స్పష్టం చేశారు. కాగా, ఇదే హామీని ఇటీవ‌ల మ‌ధ్య‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ ఆయ‌న చెప్పారు.

This post was last modified on November 18, 2023 6:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి కష్టపడి ఓడిన చెన్నై… పంజాబ్ పవర్ఫుల్ గేమ్

ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…

29 minutes ago

విజ‌య్‌ని డీగ్రేడ్ చేసేలా పొలిటిక‌ల్ మూవీ?

ఎన్నిక‌లు స‌మీపిస్తున్నపుడు కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల‌కు ఎలివేష‌న్లు ఇస్తూ సినిమాలు వ‌స్తుంటాయి. అలాగే కొంద‌రు నేత‌ల‌ను టార్గెట్ చేస్తూ మూవీస్…

42 minutes ago

రాజ‌ధానిపై చంద్ర‌బాబు ముందు చూపు… ఇవే కీల‌కం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై సీఎం చంద్ర‌బాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజ‌ధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.…

44 minutes ago

రేసు గుర్రం కొంచెం తొందరపడిందేమో

ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళ – తెలంగాణ మధ్య నిప్పు రాజుకుంది

కేర‌ళ రాష్ట్రంలో జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో  కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫు స్టార్ క్యాంపెయిన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…

2 hours ago

రొటీన్ ‘లీడర్’తో ఏం సాధించారు

2022 లెజెండ్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన తమిళ వ్యాపారవేత్త శరవణన్ ని మూవీ లవర్స్ అంత ఈజీగా మర్చిపోలేరు.…

3 hours ago