తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేస్తున్న ప్రచారానికి బూస్ట్ ఇస్తూ.. ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్షా తాజాగా రాష్ట్రంలో పర్యటించారు. గద్వాల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. బీఆర్ ఎస్కు వీఆర్ ఎస్ ఇచ్చే సమయం వచ్చేసిందని.. దీనికి అందరూ రెడీ కావాలని.. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో బీఆర్ ఎస్కు వ్యతిరేకంగా ఓటేసి.. ఆ పార్టీకి రిటైర్మెంట్ ప్రకటించాలని ఆయన పిలుపునిచ్చారు.
“కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదు. గుర్రం గడ్డ వంతెన, గట్టులిఫ్ట్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయలే దు. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశం కేసీఆర్ కేంద్రం దృష్టికి తీసుకు రాలేదు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తక్షణమే అమలు చేస్తాం. 52 శాతం బీసీ ఓటర్లు 130 కులాలున్న బీసీలను కేసీఆర్ ప్రభుత్వం విస్మరిస్తోంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తాం. ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తామన్న కేసీఆర్.. ఆ మాటనుఎందుకు తప్పారో .. తెలంగాణ సమాజం తమ ఓటు ద్వారా నిలదీయాలి” అని అమిత్ షా అన్నారు.
జోగులాంబ శక్తి పీఠం కోసం మోడీ సర్కార్ 70 కోట్లు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం ఆ నిధులను ఖర్చు చేయలేదని అమిత్ షా బీసీలకు బడ్జెట్లో బీజేపీ ప్రభుత్వం 3,300 కేటాయిస్తే.. కేసీఆర్ 77 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అన్నారు. “టీఎస్పీఎస్సీ పరీక్షల రద్దు, పేపర్ లీక్లతో నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారు. ప్రవళ్లిక ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణం. బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే రెండున్నర లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతాం. ముస్లింలకు మతపర రిజర్వేషన్లు రద్దు చేస్తాం” అని వ్యాఖ్యానించారు.
2-3-4 జీలు..
2జీ కేసీఆర్ – కేటీఆర్, 3జీ ఓవైసీ మూడు తరాలు, 4జీ గాంధీ 4 తరాలు దేశాన్ని, రాష్ట్రాన్ని ఎలాయని అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణలో బీఆర్ఎస్కు విముక్తి కల్పించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అవినీతి మయంగా మారిందని, కాంగ్రెస్ పార్టీ అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని 70ఏళ్లు నాన్చిందని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ప్రజలందరికీ అయోధ్య దర్శనం ఉచితంగా కల్పిస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. కాగా, ఇదే హామీని ఇటీవల మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ఆయన చెప్పారు.
This post was last modified on November 18, 2023 6:44 pm
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…