తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేస్తున్న ప్రచారానికి బూస్ట్ ఇస్తూ.. ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్షా తాజాగా రాష్ట్రంలో పర్యటించారు. గద్వాల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. బీఆర్ ఎస్కు వీఆర్ ఎస్ ఇచ్చే సమయం వచ్చేసిందని.. దీనికి అందరూ రెడీ కావాలని.. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో బీఆర్ ఎస్కు వ్యతిరేకంగా ఓటేసి.. ఆ పార్టీకి రిటైర్మెంట్ ప్రకటించాలని ఆయన పిలుపునిచ్చారు.
“కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదు. గుర్రం గడ్డ వంతెన, గట్టులిఫ్ట్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయలే దు. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశం కేసీఆర్ కేంద్రం దృష్టికి తీసుకు రాలేదు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తక్షణమే అమలు చేస్తాం. 52 శాతం బీసీ ఓటర్లు 130 కులాలున్న బీసీలను కేసీఆర్ ప్రభుత్వం విస్మరిస్తోంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తాం. ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తామన్న కేసీఆర్.. ఆ మాటనుఎందుకు తప్పారో .. తెలంగాణ సమాజం తమ ఓటు ద్వారా నిలదీయాలి” అని అమిత్ షా అన్నారు.
జోగులాంబ శక్తి పీఠం కోసం మోడీ సర్కార్ 70 కోట్లు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం ఆ నిధులను ఖర్చు చేయలేదని అమిత్ షా బీసీలకు బడ్జెట్లో బీజేపీ ప్రభుత్వం 3,300 కేటాయిస్తే.. కేసీఆర్ 77 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అన్నారు. “టీఎస్పీఎస్సీ పరీక్షల రద్దు, పేపర్ లీక్లతో నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారు. ప్రవళ్లిక ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణం. బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే రెండున్నర లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతాం. ముస్లింలకు మతపర రిజర్వేషన్లు రద్దు చేస్తాం” అని వ్యాఖ్యానించారు.
2-3-4 జీలు..
2జీ కేసీఆర్ – కేటీఆర్, 3జీ ఓవైసీ మూడు తరాలు, 4జీ గాంధీ 4 తరాలు దేశాన్ని, రాష్ట్రాన్ని ఎలాయని అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణలో బీఆర్ఎస్కు విముక్తి కల్పించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అవినీతి మయంగా మారిందని, కాంగ్రెస్ పార్టీ అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని 70ఏళ్లు నాన్చిందని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ప్రజలందరికీ అయోధ్య దర్శనం ఉచితంగా కల్పిస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. కాగా, ఇదే హామీని ఇటీవల మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ఆయన చెప్పారు.
This post was last modified on November 18, 2023 6:44 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…