ఎన్నికలకు ఇక ఉన్నది 11 రోజులే కావటంతో అభ్యర్ధుల ప్రచారం ముమ్మరం చేశారు. 10వ తేదీవరకు నామినేషన్లకు సరిపోయింది. 15వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ కూడా అయిపోయింది. దాంతో పోటీలో ఉన్న అభ్యర్ధులు ఎవరన్నది ఫైనల్ అయిపోయింది. దాంతో ఒక్కసారిగా అభ్యర్ధులందరు ఒక్కసారిగా ప్రచారంలో వేడిని పెంచేశారు. ఎప్పుడైతే అభ్యర్ధులు ప్రచారంలో వేడిని పెంచారో అప్పుడే కూలీలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది.
పొలిటికల్ కూలీలకు డిమాండ్ ఎందుకు పెరిగిపోయిందంటే పార్టీలకు వాస్తవంగా మద్దతుదారులు తగ్గిపోతున్నారు కాబట్టే. ఒకపుడు పార్టీలకు బలమైన క్యాడర్ ఉండేది. పార్టీ సిద్ధాంతాలని, లేదా నేతలకు బలమైన మద్దతుదారులు చివరివరకు ఉండేవారు. కానీ ఇఫుడు పార్టీల్లో సిద్ధాంతాలన్నది ఎక్కడా కనబడటంలేదు. ఉన్నదంతా అధికారంపైన వ్యామోహం మాత్రమే. అందుకనే నేతలను బట్టే క్యాడర్ కూడా అలాగే మారిపోయారు. అందుకనే ర్యాలీలు, రోడ్డుషోల్లో పాల్గొనేందుకు పార్టీ కమిటెడ్ క్యాడర్ తక్కువైపోయారు. ఇక్కడే పెయిడ్ కూలీల అవసరం మొదలైంది.
ఇపుడు ఏ పార్టీ అభ్యర్ధి ప్రచారంలో చూసినా ఎక్కువగా పెయిడ్ కూలీలు అంటే పొలిటికల్ కూలీల సంఖ్యే ఎక్కువగా కనబడుతోంది. విచిత్రం ఏమిటంటే ఏ పార్టీలో చూసినా పొలిటికల్ కూలీలు దాదాపు ఒకటిగానే ఉంటున్నారు. ఉదయం ఒకపార్టీకి మధ్యాహ్నం మరో పార్టీకి రాత్రి మీటింగులకు కూడా వీళ్ళే ఎక్కువగా కనబడతున్నారు. వీళ్ళల్లో ఒక్కొక్కళ్ళకు రోజుకు 700 రూపాయలు, బిర్యానీ, క్వార్టర్ మందు ఇస్తున్నాయి పార్టీలు. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ర్యాలీలు, రోడ్డుషోలు, బహిరంగసభలు పెరిగిపోతున్నాయి కాబట్టి వీళ్ళకు డిమాండ్ బాగా పెరిగిపోతోంది.
పొలిటికల్ కూలీల్లో ఎక్కువగా పొలాల్లో పనిచేసే కూలీలు, భవన నిర్మాణ కూలీలే ఎక్కువగా ఉంటున్నారు. పొలాల్లో పనిచేసినా, భవన నిర్మాణంలో పనిచేసినా ఇక్కడ వస్తున్నకూలీ అంత రావటంలేదు. అందుకనే ఎక్కువగా ఎలక్షన్స్ లో బిజీ అయిపోయారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాకు సరిహద్దుల్లో ఉన్న మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో జరిగే ఎన్నికల్లోనే వీళ్ళ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటోందని సమాచారం.
ఈమధ్య షాదనగర్లో ఒక అభ్యర్ధి ప్రచారంలో పొలిటికల్ కూలీలను తలా రు. 400కి మాట్లాడుకున్నారట. అయితే అదే సమయంలో మరో అభ్యర్ధి బహిరంగసభ నిర్వహణలో జనాలు కావాల్సొచ్చిందట. దాంతో ఓ మూడొందలు ఎక్కవ ఇస్తానని కబురుచేయగానే ఈ పొలిటికల్ కూలీలంతా బహిరంగసభకు వెళ్ళిపోయారని టాక్. దీంతోనే వీళ్ళకి ఎంత డిమాండ్ పెరిగిపోతోందో అర్ధమవుతోంది.
This post was last modified on November 18, 2023 4:03 pm
తెలుగులో పెద్ద స్టార్ల సినిమాలను పక్కన పెడితే.. ప్రేక్షకులు తన చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేలా చేసే…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై దాదాపు 500 కోట్ల రూపాయల ప్రజాధనం వ్యయంతో విలాసవంతంగా నిర్మించిన ప్యాలెస్ను ఏం చేయాలన్న…
కేరళం ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీనియర్…
అన్ని రసాల్లోకి హాస్య రసం పండించడం చాలా కష్టమంటారు. అందులో అతిశయోక్తి ఏమీ కాదు. నవ్వించడం అన్నది అత్యంత కష్టమైన…
ఒకప్పుడు ఒక పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. చివరి దాకా దానికి కట్టుబడే ఉండేవారు. చెప్పిన డేటుకే…
దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…