ఎన్నికలకు ఇక ఉన్నది 11 రోజులే కావటంతో అభ్యర్ధుల ప్రచారం ముమ్మరం చేశారు. 10వ తేదీవరకు నామినేషన్లకు సరిపోయింది. 15వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ కూడా అయిపోయింది. దాంతో పోటీలో ఉన్న అభ్యర్ధులు ఎవరన్నది ఫైనల్ అయిపోయింది. దాంతో ఒక్కసారిగా అభ్యర్ధులందరు ఒక్కసారిగా ప్రచారంలో వేడిని పెంచేశారు. ఎప్పుడైతే అభ్యర్ధులు ప్రచారంలో వేడిని పెంచారో అప్పుడే కూలీలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది.
పొలిటికల్ కూలీలకు డిమాండ్ ఎందుకు పెరిగిపోయిందంటే పార్టీలకు వాస్తవంగా మద్దతుదారులు తగ్గిపోతున్నారు కాబట్టే. ఒకపుడు పార్టీలకు బలమైన క్యాడర్ ఉండేది. పార్టీ సిద్ధాంతాలని, లేదా నేతలకు బలమైన మద్దతుదారులు చివరివరకు ఉండేవారు. కానీ ఇఫుడు పార్టీల్లో సిద్ధాంతాలన్నది ఎక్కడా కనబడటంలేదు. ఉన్నదంతా అధికారంపైన వ్యామోహం మాత్రమే. అందుకనే నేతలను బట్టే క్యాడర్ కూడా అలాగే మారిపోయారు. అందుకనే ర్యాలీలు, రోడ్డుషోల్లో పాల్గొనేందుకు పార్టీ కమిటెడ్ క్యాడర్ తక్కువైపోయారు. ఇక్కడే పెయిడ్ కూలీల అవసరం మొదలైంది.
ఇపుడు ఏ పార్టీ అభ్యర్ధి ప్రచారంలో చూసినా ఎక్కువగా పెయిడ్ కూలీలు అంటే పొలిటికల్ కూలీల సంఖ్యే ఎక్కువగా కనబడుతోంది. విచిత్రం ఏమిటంటే ఏ పార్టీలో చూసినా పొలిటికల్ కూలీలు దాదాపు ఒకటిగానే ఉంటున్నారు. ఉదయం ఒకపార్టీకి మధ్యాహ్నం మరో పార్టీకి రాత్రి మీటింగులకు కూడా వీళ్ళే ఎక్కువగా కనబడతున్నారు. వీళ్ళల్లో ఒక్కొక్కళ్ళకు రోజుకు 700 రూపాయలు, బిర్యానీ, క్వార్టర్ మందు ఇస్తున్నాయి పార్టీలు. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ర్యాలీలు, రోడ్డుషోలు, బహిరంగసభలు పెరిగిపోతున్నాయి కాబట్టి వీళ్ళకు డిమాండ్ బాగా పెరిగిపోతోంది.
పొలిటికల్ కూలీల్లో ఎక్కువగా పొలాల్లో పనిచేసే కూలీలు, భవన నిర్మాణ కూలీలే ఎక్కువగా ఉంటున్నారు. పొలాల్లో పనిచేసినా, భవన నిర్మాణంలో పనిచేసినా ఇక్కడ వస్తున్నకూలీ అంత రావటంలేదు. అందుకనే ఎక్కువగా ఎలక్షన్స్ లో బిజీ అయిపోయారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాకు సరిహద్దుల్లో ఉన్న మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో జరిగే ఎన్నికల్లోనే వీళ్ళ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటోందని సమాచారం.
ఈమధ్య షాదనగర్లో ఒక అభ్యర్ధి ప్రచారంలో పొలిటికల్ కూలీలను తలా రు. 400కి మాట్లాడుకున్నారట. అయితే అదే సమయంలో మరో అభ్యర్ధి బహిరంగసభ నిర్వహణలో జనాలు కావాల్సొచ్చిందట. దాంతో ఓ మూడొందలు ఎక్కవ ఇస్తానని కబురుచేయగానే ఈ పొలిటికల్ కూలీలంతా బహిరంగసభకు వెళ్ళిపోయారని టాక్. దీంతోనే వీళ్ళకి ఎంత డిమాండ్ పెరిగిపోతోందో అర్ధమవుతోంది.
This post was last modified on November 18, 2023 4:03 pm
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిపోయారు. బెంగాల్ ను పదిహేనేళ్లుగా పాలిస్తూ…
గత ఏడాది సింగల్ సక్సెస్ తో ట్రాక్ లో పడిన శ్రీవిష్ణుకి అతి తక్కువ గ్యాప్ లో మూడు వరస…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…
దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…
సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…