తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తలపడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రకరకాల సెంటిమెంట్లను తెరమీదికి తెస్తున్నారు. కొందరు తెలంగాణ ఇచ్చింది తామేనని తమకు ఓటేయాలని కోరుతున్నారు. మరికొందరు సోనియమ్మ గ్యారెంటీలు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇంకొందరు.. కర్ణాటకలో కాంగ్రెస్ పాలనను చూపిస్తున్నారు. మొత్తానికి ఈ సెంటిమెంట్లు ఓ రేంజ్లో పారిస్తున్నారు. ఏం చేసినా.. ఓటరు దేవుడి అనుగ్రహం కోసమే కదా!
ఈ పరంపరలో కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ రేవంత్రెడ్డి సరికొత్త సెంటిమెంటు అస్త్రాన్ని ప్రయోగించారు. అదే డిసెంబరు-9. తనకు డిసెంబరు-9 సెంటిమెంటు అంటూ.. రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. వచ్చే నెల డిసెంబరు – 9న అద్భుతం జరగడబోతోందని.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని చెప్పారు. డిసెంబరు 3 న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో డిసెంబరు-9న కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు.
దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలను కూడా రేవంత్ వెల్లడించారు. “గత ఏడాది సెప్టెంబరు 17న తెలంగాణ కాంగ్రెస్ చీఫ్గా నా నియామకం జరిగింది. నేను డిసెంబరు 9న పగ్గాలు చేపట్టాను. కాలం కలిసి వచ్చింది. కాంగ్రెస్ పుంజుకుంది. నేతల మధ్య వివాదాలు తగ్గాయి. కలిసి పోరాటం చేస్తున్నారు. ఇక, 2009, డిసెంబరు 9న చిదంబరం(అప్పటి కేంద్ర మంత్రి) తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారు. ఇది సాకారమైంది. ఇక, మా అధినేత్రి సోనియా గాంధీ పుట్టిన రోజు డిసెంబరు -9. కాంగ్రెస్ పార్టీలో నేను చేరిన తర్వాత.. తొలిసారి గాంధీ భవన్లో అడుగు పెట్టింది కూడా డిసెంబరు-9నే. కాబట్టి.. ఈ సెంటిమెంట్ మళ్లీ రిపీట్ అవుతుంది. డిసెంబరు-9 కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది” అని రేవంత్ చెప్పారు.
This post was last modified on November 17, 2023 3:41 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…