టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి ఏపీకి రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కు 2014లో ముఖ్యమంత్రి అయ్యారు. అయితే.. ఈ మూడు సార్లు బాబు ఎలా ముఖ్యమంత్రి అయ్యారో.. తాజాగా ఏపీ సీఎం, వైసీపీఅధినేత జగన్ వివరించారు. ముఖ్యంగా రెండోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి కారణాలు వెల్లడించారు. తాజాగా సీఎం జగన్ ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అసైన్డ్ భూములకు పట్టాలిచ్చే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. రాజకీయ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు 1996లో తొలిసారి తన మామ నుంచి అధికారం లాక్కొని ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. అప్పట్లో ప్రజలు ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా గెలిపించలేదని.. ఎన్టీఆర్ను ముఖ్యమంత్రిగా గెలిపించారని తెలిపారు. అయితే.. మధ్యలో పార్టీలో జోక్యం చేసుకుని చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. ఇక, రెండోసారి అనూహ్యంగా చంద్రబాబు సీఎం అయ్యారని తెలిపారు.
2000 సంవత్సరంలో వచ్చిన ఎన్నికల్లో చంద్రబాబు కార్గిల్ యుద్ధం వెనుక తన పాత్ర ఉందని.. దేశాన్ని కూడా నడిపించగల సత్తా తనకుందని ప్రచారం చేయించుకుని ముఖ్యమంత్రి అయ్యారని జగన్ వ్యాఖ్యానించారు. ఇక, 2014లో ప్రజలకు ఇంద్రలోకాన్ని చూపించి మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. అయితే.. ఆయన చూపించిన ఇంద్రలోకం ఎఫెక్ట్ 2019లో గూబగుయ్యిమనేలా చేసిందని విమర్శించారు.
చంద్రబాబు హయాంలో పేదలు ఆయనకు కనిపించలేదని జగన్ విమర్శలు గుప్పించారు. ప్రజలను మోసం చేశారని అన్నారు. ఈ మోసాలను ప్రజలు గమనించాలని జగన్ పిలుపునిచ్చారు. తన పాలనలో ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో మేలు జరిగిందని.. ఇలా జరిగిందని అనుకుంటేనే తనను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
This post was last modified on November 17, 2023 1:51 pm
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…