Political News

కాంగ్రెస్ కూల్ : రెబల్స్ దారికొచ్చినట్లే ?

కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ దారికొచ్చినట్లేనా ? గ్రౌండ్ లెవల్లో వ్యవహారం చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే వివిధ నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి నామినేషన్లు వేసిన కొందరు తిరుగుబాటు అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకున్నారు సరే మరి అభ్యర్ధుల గెలుపుకు చిత్తశుద్దితో పనిచేస్తారా ? అన్నదే ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా తయారైంది. నామినేషన్లను ఉపసంహరించుకున్న సీనియర్ నేతలు సుమారు 12 మందున్నారు.

సూర్యాపేటలో రెబల్ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన పటేల్ రమేష్ రెడ్డి తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. ఏఐసీసీ తరపున రోహిత్ చౌదరి, మల్లురవి తదితరులు వెళ్ళి బుజ్జగించారు. దాంతో దామోదర్ రెడ్డి గెలుపుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. బాన్సువాడలో కాసుల బాలరాజు కూడా నామినేషన్ వేశారు. అయితే పార్టీలోని పెద్దల చర్చలతో నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. అలాగే జుక్కల్ లో గంగారామ్, వరంగల్ వెస్ట్ లో జంగా రాఘవరెడ్డి, డోర్నకల్ లో నెహ్రూనాయక్, ఇంబ్రహింపట్నంలో దండెం రామిరెడ్డి కూడా నామినేషన్ను ఉపసంహరించుకున్నారు.

అయితే ఆదిలాబాద్ నుండి సంజీవరెడ్డి మాత్రం నామినేషన్ ఉపసంహరించుకోలేదు. నామినేషన్ ఉపసంహరించుకున్న రమేష్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా టికెట్ ఖాయమైందని అంటున్నారు. అలాగే అద్దంకి దయాకర్ కు వరంగల్ ఎంపీ టికెట్ హామీ దక్కిందని చెబుతున్నారు. అధిష్టానం మాట మీద నామినేషన్లు ఉపసంహరించుకున్న వాళ్ళకి జిల్లాల పార్టీ అధ్యక్షులుగాను, నామినేటెడ్ పోస్టులు, ఎంఎల్సీలను హామీ ఇచ్చారు. మరికొందరికి ఎంపీ టికెట్లు కూడా హామీలిచ్చారు.

మొత్తంమీద 24 మంది తిరుగుబాటు అభ్యర్ధులుగా నామినేషన్లు వేస్తే ఇందులో 12 మంది ఉపసంహరించుకున్నారు. మిగిలిన వాళ్ళకి ఉపసంహరణలకు అవకాశం దాటిపోయిన కారణంగా అభ్యర్ధులకు మద్దతుగా పనిచేయాలని పార్టీ నేతలు అడుగుతున్నారు. ఈ నేపధ్యంలోనే బుజ్జగింపుల పర్వం జరుగుతోంది. అధిష్టానం తరపున తెలంగాణా ఇన్చార్జి మాణిక్ రావు థాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తదితరులు రెబల్స్ తో మాట్లాడుతున్నారు. కొందరేమో నామినేషన్లను ఉపసంహరించుకున్నారు, మరికొందరేమో పోటీలోనే ఉన్నారు. మొత్తంమీద వీళ్ళంతా అభ్యర్ధుల గెలుపుకు ఎంతవరకు సహకరిస్తారో చూడాలి.

This post was last modified on November 17, 2023 9:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పొట్ట తగ్గటానికి ఈ పండ్లు తింటే చాలు

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…

28 minutes ago

ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మంత్రులు

ఏపీ మంత్రి వ‌ర్గంలో సీఎం చంద్ర‌బాబు గీస్తున్న ల‌క్ష్మ‌ణ రేఖ‌ల‌కు.. ఆయ‌న ఆదేశాల‌కు కూడా.. పెద్ద‌గా రెస్పాన్స్ ఉండ‌డం లేద‌ని…

41 minutes ago

గాయకుడి విమర్శ…రెహమాన్ చెంపపెట్టు సమాధానం

సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…

2 hours ago

‘వక్ఫ్’పై విచారణ.. కేంద్రానికి ‘సుప్రీం’ ప్రశ్న

యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…

3 hours ago

దర్శకుడి ఆవేదనలో న్యాయముంది కానీ

నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…

3 hours ago

ఇక్కడ 13 వేల కోట్ల స్కాం.. అక్కడ ఆమ్మాయికి దొరికేశాడు

భారత్ నుంచి పరారైపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి సంబంధించి రోజుకో కొత్త తరహా వింతలు, విశేషాలు వెలుగు…

3 hours ago