కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ దారికొచ్చినట్లేనా ? గ్రౌండ్ లెవల్లో వ్యవహారం చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే వివిధ నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి నామినేషన్లు వేసిన కొందరు తిరుగుబాటు అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకున్నారు సరే మరి అభ్యర్ధుల గెలుపుకు చిత్తశుద్దితో పనిచేస్తారా ? అన్నదే ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా తయారైంది. నామినేషన్లను ఉపసంహరించుకున్న సీనియర్ నేతలు సుమారు 12 మందున్నారు.
సూర్యాపేటలో రెబల్ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన పటేల్ రమేష్ రెడ్డి తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. ఏఐసీసీ తరపున రోహిత్ చౌదరి, మల్లురవి తదితరులు వెళ్ళి బుజ్జగించారు. దాంతో దామోదర్ రెడ్డి గెలుపుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. బాన్సువాడలో కాసుల బాలరాజు కూడా నామినేషన్ వేశారు. అయితే పార్టీలోని పెద్దల చర్చలతో నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. అలాగే జుక్కల్ లో గంగారామ్, వరంగల్ వెస్ట్ లో జంగా రాఘవరెడ్డి, డోర్నకల్ లో నెహ్రూనాయక్, ఇంబ్రహింపట్నంలో దండెం రామిరెడ్డి కూడా నామినేషన్ను ఉపసంహరించుకున్నారు.
అయితే ఆదిలాబాద్ నుండి సంజీవరెడ్డి మాత్రం నామినేషన్ ఉపసంహరించుకోలేదు. నామినేషన్ ఉపసంహరించుకున్న రమేష్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా టికెట్ ఖాయమైందని అంటున్నారు. అలాగే అద్దంకి దయాకర్ కు వరంగల్ ఎంపీ టికెట్ హామీ దక్కిందని చెబుతున్నారు. అధిష్టానం మాట మీద నామినేషన్లు ఉపసంహరించుకున్న వాళ్ళకి జిల్లాల పార్టీ అధ్యక్షులుగాను, నామినేటెడ్ పోస్టులు, ఎంఎల్సీలను హామీ ఇచ్చారు. మరికొందరికి ఎంపీ టికెట్లు కూడా హామీలిచ్చారు.
మొత్తంమీద 24 మంది తిరుగుబాటు అభ్యర్ధులుగా నామినేషన్లు వేస్తే ఇందులో 12 మంది ఉపసంహరించుకున్నారు. మిగిలిన వాళ్ళకి ఉపసంహరణలకు అవకాశం దాటిపోయిన కారణంగా అభ్యర్ధులకు మద్దతుగా పనిచేయాలని పార్టీ నేతలు అడుగుతున్నారు. ఈ నేపధ్యంలోనే బుజ్జగింపుల పర్వం జరుగుతోంది. అధిష్టానం తరపున తెలంగాణా ఇన్చార్జి మాణిక్ రావు థాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తదితరులు రెబల్స్ తో మాట్లాడుతున్నారు. కొందరేమో నామినేషన్లను ఉపసంహరించుకున్నారు, మరికొందరేమో పోటీలోనే ఉన్నారు. మొత్తంమీద వీళ్ళంతా అభ్యర్ధుల గెలుపుకు ఎంతవరకు సహకరిస్తారో చూడాలి.
This post was last modified on November 17, 2023 9:44 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…