తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ తన ఎన్నికల హామీని ప్రకటించింది. కేసీఆర్ సర్కారుపై తీవ్రంగా విరుచుకుపడుతూ.. ప్రభుత్వ లోపాల్ని తరచూ తెర మీదకు తీసుకొచ్చే ఆ పార్టీ.. తమ ఎన్నికల హామీలకు సంబంధించిన వివరాల్ని తాజాగా వెల్లడించింది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను చూస్తే.. కేసీఆర్ సర్కారు అమలు చేసే పథకాల్ని కంటిన్యూ చేయటంతో పాటు.. మరిన్నిఆకర్షణీయమైన హామీల్నిఇచ్చేందుకు వీలుగా ప్రకటన చేసిందని చెప్పాలి.
నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్ల పుట్టినంతనే బంగారు తల్లి పథకంలో భాగంగా ఆర్థిక సాయం.. యువతుల పెళ్లికి రూ.లక్ష ఆర్థిక సాయమే కాదు పదిగ్రాముల బంగారాన్ని ఇవ్వనున్నట్లుగా పేర్కొంది. అంతేకాదు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్.. అధికారంలోకి వచ్చిన ఆర్నెల్ల లోపే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల ఖాళీల్ని భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అంతేకాదు.. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ముఖ్యమంత్రి ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండరన్న విమర్శ తీవ్రంగా ఎదుర్కొంటునన నేపథ్యంలో ఎన్నికల హామీల్లోనే సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ ఏర్పాటు చేస్తామన్న మాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ తో పాటు.. పలు ప్రజాకర్షక పథకాల్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఇప్పటికే ఆరు ఆకర్షణీయమైన గ్యారెంటీ పథకాల్ని అమలు చేస్తామని చెబుతున్న కాంగ్రెస్.. అంతకు మించి మరిన్ని హామీల్ని తీసుకువచ్చింది. తమ ఎన్నికల మేనిఫెస్టోను అధికారికంగా విడుదల చేయనప్పటికీ.. దానిలోని అంశాలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఎన్నికల మేనిఫెస్టోలోని ముఖ్యాంశాల్ని చూస్తే..
మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…