తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ తన ఎన్నికల హామీని ప్రకటించింది. కేసీఆర్ సర్కారుపై తీవ్రంగా విరుచుకుపడుతూ.. ప్రభుత్వ లోపాల్ని తరచూ తెర మీదకు తీసుకొచ్చే ఆ పార్టీ.. తమ ఎన్నికల హామీలకు సంబంధించిన వివరాల్ని తాజాగా వెల్లడించింది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను చూస్తే.. కేసీఆర్ సర్కారు అమలు చేసే పథకాల్ని కంటిన్యూ చేయటంతో పాటు.. మరిన్నిఆకర్షణీయమైన హామీల్నిఇచ్చేందుకు వీలుగా ప్రకటన చేసిందని చెప్పాలి.
నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్ల పుట్టినంతనే బంగారు తల్లి పథకంలో భాగంగా ఆర్థిక సాయం.. యువతుల పెళ్లికి రూ.లక్ష ఆర్థిక సాయమే కాదు పదిగ్రాముల బంగారాన్ని ఇవ్వనున్నట్లుగా పేర్కొంది. అంతేకాదు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్.. అధికారంలోకి వచ్చిన ఆర్నెల్ల లోపే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల ఖాళీల్ని భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అంతేకాదు.. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ముఖ్యమంత్రి ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండరన్న విమర్శ తీవ్రంగా ఎదుర్కొంటునన నేపథ్యంలో ఎన్నికల హామీల్లోనే సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ ఏర్పాటు చేస్తామన్న మాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ తో పాటు.. పలు ప్రజాకర్షక పథకాల్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఇప్పటికే ఆరు ఆకర్షణీయమైన గ్యారెంటీ పథకాల్ని అమలు చేస్తామని చెబుతున్న కాంగ్రెస్.. అంతకు మించి మరిన్ని హామీల్ని తీసుకువచ్చింది. తమ ఎన్నికల మేనిఫెస్టోను అధికారికంగా విడుదల చేయనప్పటికీ.. దానిలోని అంశాలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఎన్నికల మేనిఫెస్టోలోని ముఖ్యాంశాల్ని చూస్తే..
This post was last modified on November 17, 2023 10:11 am
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కౌంట్డౌన్ దగ్గరపడుతోంది. మరొక్క రోజు గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ…
లోక్సభలో ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, ఏపీ ప్రయోజనాల గురించి ప్రశ్నించిన నేతగా టీడీపీ ఎంపీ…
రెబల్ స్టార్, దివంగత కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి అనూహ్యంగా ఎన్నికల ప్రచారం చివరి రోజు రాజకీయ ప్రచారం…
సంక్రాంతి, దసరా సెలవులు వచ్చాయి అంటే మొదట మీడియాలో వినిపించే పేరు పంతంగి. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి…
"మీ శ్రేయోభిలాషి.." అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన మరుక్షణం…
ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యేందుకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. కానీ.. ఇంతలోనే ఏపీలో ఏదో జరుగుతోందనే…