తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ తన ఎన్నికల హామీని ప్రకటించింది. కేసీఆర్ సర్కారుపై తీవ్రంగా విరుచుకుపడుతూ.. ప్రభుత్వ లోపాల్ని తరచూ తెర మీదకు తీసుకొచ్చే ఆ పార్టీ.. తమ ఎన్నికల హామీలకు సంబంధించిన వివరాల్ని తాజాగా వెల్లడించింది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను చూస్తే.. కేసీఆర్ సర్కారు అమలు చేసే పథకాల్ని కంటిన్యూ చేయటంతో పాటు.. మరిన్నిఆకర్షణీయమైన హామీల్నిఇచ్చేందుకు వీలుగా ప్రకటన చేసిందని చెప్పాలి.
నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్ల పుట్టినంతనే బంగారు తల్లి పథకంలో భాగంగా ఆర్థిక సాయం.. యువతుల పెళ్లికి రూ.లక్ష ఆర్థిక సాయమే కాదు పదిగ్రాముల బంగారాన్ని ఇవ్వనున్నట్లుగా పేర్కొంది. అంతేకాదు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్.. అధికారంలోకి వచ్చిన ఆర్నెల్ల లోపే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల ఖాళీల్ని భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అంతేకాదు.. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ముఖ్యమంత్రి ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండరన్న విమర్శ తీవ్రంగా ఎదుర్కొంటునన నేపథ్యంలో ఎన్నికల హామీల్లోనే సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ ఏర్పాటు చేస్తామన్న మాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ తో పాటు.. పలు ప్రజాకర్షక పథకాల్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఇప్పటికే ఆరు ఆకర్షణీయమైన గ్యారెంటీ పథకాల్ని అమలు చేస్తామని చెబుతున్న కాంగ్రెస్.. అంతకు మించి మరిన్ని హామీల్ని తీసుకువచ్చింది. తమ ఎన్నికల మేనిఫెస్టోను అధికారికంగా విడుదల చేయనప్పటికీ.. దానిలోని అంశాలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఎన్నికల మేనిఫెస్టోలోని ముఖ్యాంశాల్ని చూస్తే..
This post was last modified on November 17, 2023 10:11 am
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…