అయిదేళ్ల పాటు ఎమ్మెల్యే అని పిలిపించుకోవడానికి, పదవిలో కొనసాగేందుకు ఆరాటపడుతున్న నాయకులు ఇప్పుడు ఎన్నికల్లో విజయం కోసం కష్టపడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నాయకులు కష్టపడే సమయం ఇదే. మరోవైపు ఓటర్లు, ప్రజలు తమ డిమాండ్లను నెరవేర్చుకునే సమయం కూడా ఇదే. ఎందుకంటే ఈ సమయంలో ఓట్ల కోసం ఏది అడిగినా నో అని చెప్పకుండా నాయకులు చేస్తుంటారు. ఇప్పుడదే బాటలో నగరాల్లోని అపార్ట్ మెంట్ ఓటర్లు సాగుతూ.. తమ డిమాండ్లను బయట పెడుతున్నారు. వీటిని తీర్చలేక నేతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిసింది.
ఓ వైపు సభలు, ర్యాలీలతో బయట ప్రచారం నిర్వహిస్తున్న అభ్యర్థులు.. అపార్ట్ మెంట్, గేటెడ్ కమ్యూనిటీ ప్రజలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆయా అపార్ట్ మెంట్, గేటెడ్ కమ్యూనిటీ ప్రతినిధులతో చర్చిస్తూ.. ఆయా అపార్ట్ మెంట్లలోని ఓట్లు మొత్తం తమకే దక్కేలా చేసుకోవడంపై ఫోకస్ పెడుతున్నారని తెలిసింది. అయితే ఇదే అదనుగా అపార్ట్ మెంట్ ప్రతినిధులు తమ పనులు చక్కబెట్టుకుంటున్నారని టాక్. అపార్ట్ మెంట్లో సదుపాయాలు, సౌకర్యాల కల్పన కోసం ఖర్చులు భరించాలని అభ్యర్థులకు చెబుతున్నట్లు తెలిసింది.
ఒక అపార్ట్ మెంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మరో దాంట్లో సోలార్ పవర్ కోసం అయ్యే ఖర్చు భరించాలని ఇలా అపార్ట్ మెంట్ ప్రతినిధులు అభ్యర్థులను డిమాండ్ చేస్తున్నారని తెలిసింది. ఈ ఖర్చు భరించేందుకు ఆయా నేతలు ముందుకు వొస్తున్నా వీళ్లలో మరో అనుమానం నెలకొంది. తీరా పని పూర్తయ్యాక ఆ అపార్ట్ మెంట్ లోని అందరూ తమకే ఓటు వేస్తారనే గ్యారెంటీ ఏముందని అనుకుంటున్నారు. అందుకే అపార్ట్ మెంట్ వాసుల ఓట్ల కోసం ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులో ఉన్నారని తెలిసింది.
This post was last modified on November 16, 2023 7:35 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…