అయిదేళ్ల పాటు ఎమ్మెల్యే అని పిలిపించుకోవడానికి, పదవిలో కొనసాగేందుకు ఆరాటపడుతున్న నాయకులు ఇప్పుడు ఎన్నికల్లో విజయం కోసం కష్టపడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నాయకులు కష్టపడే సమయం ఇదే. మరోవైపు ఓటర్లు, ప్రజలు తమ డిమాండ్లను నెరవేర్చుకునే సమయం కూడా ఇదే. ఎందుకంటే ఈ సమయంలో ఓట్ల కోసం ఏది అడిగినా నో అని చెప్పకుండా నాయకులు చేస్తుంటారు. ఇప్పుడదే బాటలో నగరాల్లోని అపార్ట్ మెంట్ ఓటర్లు సాగుతూ.. తమ డిమాండ్లను బయట పెడుతున్నారు. వీటిని తీర్చలేక నేతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిసింది.
ఓ వైపు సభలు, ర్యాలీలతో బయట ప్రచారం నిర్వహిస్తున్న అభ్యర్థులు.. అపార్ట్ మెంట్, గేటెడ్ కమ్యూనిటీ ప్రజలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆయా అపార్ట్ మెంట్, గేటెడ్ కమ్యూనిటీ ప్రతినిధులతో చర్చిస్తూ.. ఆయా అపార్ట్ మెంట్లలోని ఓట్లు మొత్తం తమకే దక్కేలా చేసుకోవడంపై ఫోకస్ పెడుతున్నారని తెలిసింది. అయితే ఇదే అదనుగా అపార్ట్ మెంట్ ప్రతినిధులు తమ పనులు చక్కబెట్టుకుంటున్నారని టాక్. అపార్ట్ మెంట్లో సదుపాయాలు, సౌకర్యాల కల్పన కోసం ఖర్చులు భరించాలని అభ్యర్థులకు చెబుతున్నట్లు తెలిసింది.
ఒక అపార్ట్ మెంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మరో దాంట్లో సోలార్ పవర్ కోసం అయ్యే ఖర్చు భరించాలని ఇలా అపార్ట్ మెంట్ ప్రతినిధులు అభ్యర్థులను డిమాండ్ చేస్తున్నారని తెలిసింది. ఈ ఖర్చు భరించేందుకు ఆయా నేతలు ముందుకు వొస్తున్నా వీళ్లలో మరో అనుమానం నెలకొంది. తీరా పని పూర్తయ్యాక ఆ అపార్ట్ మెంట్ లోని అందరూ తమకే ఓటు వేస్తారనే గ్యారెంటీ ఏముందని అనుకుంటున్నారు. అందుకే అపార్ట్ మెంట్ వాసుల ఓట్ల కోసం ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులో ఉన్నారని తెలిసింది.
This post was last modified on November 16, 2023 7:35 pm
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…