Political News

ఒకే పేరు.. అభ్యర్థులు వేరు

ఎన్నికల్లో విజయం కోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా అభ్యర్థులు సాగుతున్నారు. అన్ని పార్టీల నాయకులు విజయం కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఎన్నికల్లో తమ గెలుపునకు అడ్డు వచ్చే సమస్యలను పరిష్కరించుకుంటూ సాగుతున్నారు. అయితే నామినేషన్ల ఉప సంహరణ ముగిసి, అభ్యర్థుల లెక్క తేలడంతో కొంతమంది అభ్యర్థులకు ఇప్పుడు మరో తలనొప్పి మొదలైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే పేరుతో ఉన్న అభ్యర్థులు ఒకే స్థానంలో పోటీ చేస్తుండటమే అందుకు కారణం.

ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్ఠి, సిట్టింగ్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మరోసారి ఎన్నికల సమరానికి సై అంటున్నారు. అయితే ఎమ్.గోపాల్ పేరుతోనే ఉన్న మరో అభ్యర్థి ఏఐహెచ్ సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. సనత్ నగర్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ అదే పేరుతో ఉన్న ఉప్పలపాటి శ్రీనివాస్ యుగ తులసి పార్టీ నుంచి నిలబడ్డారు. ఇక గోషామహల్ లో నందకిషోర్ వ్యాస్ బీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అక్కడ శుభం వ్యాస్, సందీప్ వ్యాస్ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి సిద్ధమయ్యారు.

మహేశ్వరంలో బీఆర్ఎస్ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పోటీగా మద్ది సబిత ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. నిర్మల్ లో అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి పోటీగా మంతెన ఇంద్రకరణ్ రెడ్డి, మహబూబ్ నగర్లో శ్రీనివాస్ గౌడ్కు పోటీగా కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్ రెడ్డి బరిలో నిలిచారు. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పరిస్థితి ఉంది. అయితే తమ అభ్యర్థికి ఓట్లు పడకుండా చేసేందుకు ఇలా అదే పేరుతో ఉన్న వ్యక్తులను స్వతంత్రులుగా పోటీ చేసేలా ప్రత్యర్థి పార్టీలు కుట్ర పన్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అంతే కాకుండా ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది.

This post was last modified on November 17, 2023 9:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

4 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

6 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

6 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

7 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

7 hours ago