తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. స్వతంత్రులు, రెబల్స్ బెడద జోరుగా ఉంది. 2018 ఎన్నికల్లో 119 స్థానాలకు 1057 మంది పోటీ చేయగా.. ఇప్పుడు ఈ సంఖ్య రెట్టింపైంది. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు విడుదల చేసిన జాబితా ప్రకారం.. నామినేషన్ల పర్వం ముగిసేనాటికి(ఈ నెల 15, బుధవారం) మొత్తం 2290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. చాలా చోట్ల పదుల సంఖ్యలో నామినేషన్లను వెనక్కి తీసుకున్నా..గత ఎన్నికలతో పోల్చుకుంటే పోటీ చేసేవారు ఎక్కువగా ఉన్నారని సంఘం తెలిపింది.
ఎక్కడెక్కడ ఎంత మంది అనేది చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా బుధవారం 608 మంది అభ్యర్థులు ఒకే రోజు నామినేషన్లు ఉపసంహరించుకున్నారని అధికారులు తెలిపారు. అయినప్పటికీ.. చాలా నియోజకవర్గాల్లో పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు.
మెజారిటీపై దెబ్బ!
ఈ పరిణామం కీలక పార్టీలైన బీఆర్ ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను కలవరానికి గురిచేస్తోంది. పోటీలో రెబల్స్, రైతులు, స్వతంత్ర అభ్యర్థులు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువత కూడా ఉన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఓట్ల చీలిక ఖాయమని ఒక అంచనాకు వచ్చారు. దీంతో మెజారిటీ తగ్గుముఖం పడుతుందని అభ్యర్థులు కలవరపడుతుండడం గమనార్హం.
This post was last modified on November 16, 2023 2:27 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…