తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. స్వతంత్రులు, రెబల్స్ బెడద జోరుగా ఉంది. 2018 ఎన్నికల్లో 119 స్థానాలకు 1057 మంది పోటీ చేయగా.. ఇప్పుడు ఈ సంఖ్య రెట్టింపైంది. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు విడుదల చేసిన జాబితా ప్రకారం.. నామినేషన్ల పర్వం ముగిసేనాటికి(ఈ నెల 15, బుధవారం) మొత్తం 2290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. చాలా చోట్ల పదుల సంఖ్యలో నామినేషన్లను వెనక్కి తీసుకున్నా..గత ఎన్నికలతో పోల్చుకుంటే పోటీ చేసేవారు ఎక్కువగా ఉన్నారని సంఘం తెలిపింది.
ఎక్కడెక్కడ ఎంత మంది అనేది చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా బుధవారం 608 మంది అభ్యర్థులు ఒకే రోజు నామినేషన్లు ఉపసంహరించుకున్నారని అధికారులు తెలిపారు. అయినప్పటికీ.. చాలా నియోజకవర్గాల్లో పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు.
మెజారిటీపై దెబ్బ!
ఈ పరిణామం కీలక పార్టీలైన బీఆర్ ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను కలవరానికి గురిచేస్తోంది. పోటీలో రెబల్స్, రైతులు, స్వతంత్ర అభ్యర్థులు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువత కూడా ఉన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఓట్ల చీలిక ఖాయమని ఒక అంచనాకు వచ్చారు. దీంతో మెజారిటీ తగ్గుముఖం పడుతుందని అభ్యర్థులు కలవరపడుతుండడం గమనార్హం.
This post was last modified on November 16, 2023 2:27 pm
ఎనర్జినే ఇంటి పేరుగా మార్చుకున్న రామ్ కు గత ఏడాది ఆంధ్రకింగ్ తాలూకా ఊహించని షాక్ ఇచ్చింది. కంటెంట్ బాగానే…
రేపు విడుదల కావాల్సిన కేరళ స్టోరీ 2 హఠాత్తుగా వాయిదా పడింది. పలువురు పిటీషనర్లు వేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న…
విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ పూర్తి చేసుకుని కొత్త కాంబో కోసం ఎదురు చూస్తున్న టైంలో దర్శకుడు పూరి జగన్నాథ్…
చిన్న సినిమాలకు రిలీజ్కు ఒక రోజు ముందే పెయిడ్ ప్రిమియర్స్ వేయడం కొన్నేళ్లుగా ట్రెండుగా మారింది. ఆ షోల నుంచి…
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులు ఆందోళనకు…
కరోనా తర్వాత మొదలైన ఓటీటీ విప్లవం వల్ల మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో ఆదరణ పెరిగిందో తెలిసిందే. ఎప్పట్నుంచో…