తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. స్వతంత్రులు, రెబల్స్ బెడద జోరుగా ఉంది. 2018 ఎన్నికల్లో 119 స్థానాలకు 1057 మంది పోటీ చేయగా.. ఇప్పుడు ఈ సంఖ్య రెట్టింపైంది. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు విడుదల చేసిన జాబితా ప్రకారం.. నామినేషన్ల పర్వం ముగిసేనాటికి(ఈ నెల 15, బుధవారం) మొత్తం 2290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. చాలా చోట్ల పదుల సంఖ్యలో నామినేషన్లను వెనక్కి తీసుకున్నా..గత ఎన్నికలతో పోల్చుకుంటే పోటీ చేసేవారు ఎక్కువగా ఉన్నారని సంఘం తెలిపింది.
ఎక్కడెక్కడ ఎంత మంది అనేది చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా బుధవారం 608 మంది అభ్యర్థులు ఒకే రోజు నామినేషన్లు ఉపసంహరించుకున్నారని అధికారులు తెలిపారు. అయినప్పటికీ.. చాలా నియోజకవర్గాల్లో పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు.
మెజారిటీపై దెబ్బ!
ఈ పరిణామం కీలక పార్టీలైన బీఆర్ ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను కలవరానికి గురిచేస్తోంది. పోటీలో రెబల్స్, రైతులు, స్వతంత్ర అభ్యర్థులు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువత కూడా ఉన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఓట్ల చీలిక ఖాయమని ఒక అంచనాకు వచ్చారు. దీంతో మెజారిటీ తగ్గుముఖం పడుతుందని అభ్యర్థులు కలవరపడుతుండడం గమనార్హం.
This post was last modified on November 16, 2023 2:27 pm
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…