తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ఖరారై నెల రోజులు కావస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఎప్పట్లాగే ఈ రెండు పార్టీల మద్దతుదారులు వాదోపవాదాలు, గొడవలతో గడిపేస్తున్నారు కానీ.. గ్రౌండ్ లెవెల్లో కొంత సమన్వయంతోనే సాగిపోతున్నారు ఇరు పార్టీల కార్యకర్తలు. రెండు పార్టీల మధ్య వివిధ నియోజకవర్గాల్లో సమన్వయ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల పిఠాపురంలో జరిగిన ఈ కార్యక్రమం కొంత రసాభాసగా జరిగింది కానీ.. తాజాగా హిందూపురంలో మాత్రం టీడీపీ, జనసేన సమన్వయ సమావేశం ఎంతో కలివిడిగా, ఆహ్లాదభరిత వాతావరణం మధ్య జరిగింది.
ఈ కార్యక్రమానికి హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ హాజరు కావడం విశేషం. ఆయన ఇరు పార్టీల మధ్య సోదర భావం నెలకొనేలా వ్యవహరించారు. ఆయన ప్రసంగం కూడా అందుకు తగ్గట్లే సాగింది.
ఈ కార్యక్రమానికి బాలయ్య టీడీపీతో పాటు జనసేన కండువా కూడా వేసుకుని హాజరు కావడం విశేషం. పవన్ కళ్యాణ్ బొమ్మ ఉన్న జనసేన కండువానే అందులో బాగా హైలైట్ అయింది. తన ప్రసంగం చివర్లో బాలయ్య పవన్కు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు జై జనసేన అంటూ నినాదం కూడా చేయడం విశేషం.
“బ్రదర్ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ.. ఈ యజ్ఞంలో ఒక సమిధ కావడానికి ఆయనంతట ఆయన సిద్ధంగా ఉన్నందుకు.. ఆయన అనుచరగణం.. ఎవరైతే ఉన్నారో అందరూ జనసైనికులు అందరూ అయితేనేమి వాళ్లు ఒక మాట మీద నిలబడి ఇలా మాకు ముందుకు వెళ్తూ, ఉద్యమిస్తూ ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించుకోవడానికి జరిగిన ఈ కలయిక నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా.. జై తెలుగుదేశం.. జై జనసేన” అంటూ బాలయ్య తన ప్రసంగాన్ని ముగించారు. సోషల్ మీడియాలో సంబంధిత ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ…
మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం…
విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…
అమెరికానుంచి తరచుగా భారత్కు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. వలస విధానానికి సంబంధించి, హెచ్-1బీ వీసాలకు సంబంధించి కూడా భారత్కు అమెరికా…
ఓ పరామర్శ అయినా, ఓ సాయం అయినా, ఓ ఓదార్పు అయినా, ఓ కేసు అయినా, ఓ పథకం అయినా……
ఇప్పుడు ప్రపంచంలో నంబర్ వన్ డైౌరెక్టర్ ఎవరు అని పోల్ పెడితే.. తిరుగులేని ఆధిక్యంతో క్రిస్టోఫర్ నోలనే గెలుస్తాడు అనడంలో…