తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ఖరారై నెల రోజులు కావస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఎప్పట్లాగే ఈ రెండు పార్టీల మద్దతుదారులు వాదోపవాదాలు, గొడవలతో గడిపేస్తున్నారు కానీ.. గ్రౌండ్ లెవెల్లో కొంత సమన్వయంతోనే సాగిపోతున్నారు ఇరు పార్టీల కార్యకర్తలు. రెండు పార్టీల మధ్య వివిధ నియోజకవర్గాల్లో సమన్వయ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల పిఠాపురంలో జరిగిన ఈ కార్యక్రమం కొంత రసాభాసగా జరిగింది కానీ.. తాజాగా హిందూపురంలో మాత్రం టీడీపీ, జనసేన సమన్వయ సమావేశం ఎంతో కలివిడిగా, ఆహ్లాదభరిత వాతావరణం మధ్య జరిగింది.
ఈ కార్యక్రమానికి హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ హాజరు కావడం విశేషం. ఆయన ఇరు పార్టీల మధ్య సోదర భావం నెలకొనేలా వ్యవహరించారు. ఆయన ప్రసంగం కూడా అందుకు తగ్గట్లే సాగింది.
ఈ కార్యక్రమానికి బాలయ్య టీడీపీతో పాటు జనసేన కండువా కూడా వేసుకుని హాజరు కావడం విశేషం. పవన్ కళ్యాణ్ బొమ్మ ఉన్న జనసేన కండువానే అందులో బాగా హైలైట్ అయింది. తన ప్రసంగం చివర్లో బాలయ్య పవన్కు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు జై జనసేన అంటూ నినాదం కూడా చేయడం విశేషం.
“బ్రదర్ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ.. ఈ యజ్ఞంలో ఒక సమిధ కావడానికి ఆయనంతట ఆయన సిద్ధంగా ఉన్నందుకు.. ఆయన అనుచరగణం.. ఎవరైతే ఉన్నారో అందరూ జనసైనికులు అందరూ అయితేనేమి వాళ్లు ఒక మాట మీద నిలబడి ఇలా మాకు ముందుకు వెళ్తూ, ఉద్యమిస్తూ ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించుకోవడానికి జరిగిన ఈ కలయిక నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా.. జై తెలుగుదేశం.. జై జనసేన” అంటూ బాలయ్య తన ప్రసంగాన్ని ముగించారు. సోషల్ మీడియాలో సంబంధిత ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
This post was last modified on November 16, 2023 2:34 pm
ఏపీలో కూటమి ప్రభుత్వం చేసే ఖర్చులు, తీసుకునే నిర్ణయాలను సమీక్షించి.. నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేకంగా మూడు కమిటీలు ఉంటాయి. ఇది…
ఏపీలో కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించి.. ఏడు మాసాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ఫీడ్ బ్యాక్ ఏంటి?…
పాతికేళ్ల క్రితం 2001 సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చిన శ్రియ టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ ఆడిపాడింది. చిరంజీవి, బాలకృష్ణతో మొదలుపెట్టి ప్రభాస్,…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్.. లండన్ నుంచి ఇలా వచ్చారో లేదో.. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు,…
జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ ని కలుసుకోవడానికి త్వరలోనే ఒక వేడుక ఏర్పాటు చేస్తానని, అప్పటిదాకా ఓపిగ్గా ఎదురు చూడమని…
బెంగళూరులో ఇటీవల అరెస్టైన ఓ దొంగ కథ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 37 ఏళ్ల పంచాక్షరి స్వామి అనే…