అదేంటి? అనుకుంటున్నారా? నిజమే. ఎన్నికల వేళ.. టికెట్ దక్కలేదని అలిగి కొందరు నాయకులు బీఆర్ ఎస్ నుంచి బయటకు వచ్చారు. ఆ వెంటనే కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆ పార్టీ టికెట్ సొంతం చేసుకున్నారు. మొత్తానికి టికెట్ అయితే దక్కింది. ప్రచారం కూడా ప్రారంభించారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ.. ఎటొచ్చీ ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థి బీఆర్ ఎస్ అభ్యర్థులను టార్గెట్ చేసుకుని కామెంట్లు చేయలేకపోతున్నారట.
అంతేకాదు.. బీఆర్ ఎస్ నాయకులు కాంగ్రెస్ విధానాలను ఎండగడుతుంటే.. కాంగ్రెస్ తరఫున బీఆర్ ఎస్ రెబల్గా ఉన్న వారు పోటీ చేస్తున్న స్థానాల్లో బీఆర్ ఎస్ను పన్నెత్తు మాట అనలేక పోతున్నారట. అంతేకా దు.. సీఎం కేసీఆర్, కేటీఆర్లను అస్సలే ఏమీ అనే పరిస్థితి లేకుండా పోయిందని వారి వారి అనుచరులే చెబుతున్నారు. దీంతో ఎన్నికలలో ప్రచారం నిమిత్తం రెడీ చేసుకుంటున్న స్క్రిప్టుల్లో బీఆర్ ఎస్పై విమర్శ లు లేవు. కేసీఆర్టార్గెట్ లేదు. కేటీఆర్ను ఒక్క మాట కూడా అనడం లేదు.
దీంతో కొందరు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం చప్పగా సాగుతోందని సర్వేలు చెబుతున్నాయి. దీనికి కారణా లు ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఒకటి గతంలో బీఆర్ ఎస్లో ఉండగా కొందరు నాయకులు కాంట్రాక్టులు పొందారు. అదేవిధంగా కేసీఆర్ నుంచి ఆర్తిక సాయం కూడా పొందారు. వారివారికి స్థానిక సంస్తల్లోనూ పదవులు ఇప్పించుకున్నారు. ఇక, కుటుంబాలకు కూడా సాయం చేయించుకున్నారు. కొందరు సొంత ఇళ్ల కోసం స్థలాలు తీసుకున్నారు.
మొత్తంగా బీఆర్ ఎస్లో ఉండగా.. కొన్ని లబ్ధిలు పొందారు. ఈ పరిణామం ఇప్పుడు వీరికి మొహమాటంగా మారింది. దీంతో పన్నెత్తు విమర్శ చేయడానికి మనసు రావడం లేదట. దీనిలో మరో కోణం కూడా ఉంద ని చెబుతున్నారు. రేపు ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే.. తమను బీఆర్ ఎస్ అధినేత టార్గెట్ చేయొచ్చనే జంకు కూడా ఈ నాయకుల్లో కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. అందుకే ఎన్నికల ప్రచారంలో నేరుగా టార్గెట్ చేయలేక సతమతం అవుతున్నారని అంటున్నారు.
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…