అదేంటి? అనుకుంటున్నారా? నిజమే. ఎన్నికల వేళ.. టికెట్ దక్కలేదని అలిగి కొందరు నాయకులు బీఆర్ ఎస్ నుంచి బయటకు వచ్చారు. ఆ వెంటనే కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆ పార్టీ టికెట్ సొంతం చేసుకున్నారు. మొత్తానికి టికెట్ అయితే దక్కింది. ప్రచారం కూడా ప్రారంభించారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ.. ఎటొచ్చీ ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థి బీఆర్ ఎస్ అభ్యర్థులను టార్గెట్ చేసుకుని కామెంట్లు చేయలేకపోతున్నారట.
అంతేకాదు.. బీఆర్ ఎస్ నాయకులు కాంగ్రెస్ విధానాలను ఎండగడుతుంటే.. కాంగ్రెస్ తరఫున బీఆర్ ఎస్ రెబల్గా ఉన్న వారు పోటీ చేస్తున్న స్థానాల్లో బీఆర్ ఎస్ను పన్నెత్తు మాట అనలేక పోతున్నారట. అంతేకా దు.. సీఎం కేసీఆర్, కేటీఆర్లను అస్సలే ఏమీ అనే పరిస్థితి లేకుండా పోయిందని వారి వారి అనుచరులే చెబుతున్నారు. దీంతో ఎన్నికలలో ప్రచారం నిమిత్తం రెడీ చేసుకుంటున్న స్క్రిప్టుల్లో బీఆర్ ఎస్పై విమర్శ లు లేవు. కేసీఆర్టార్గెట్ లేదు. కేటీఆర్ను ఒక్క మాట కూడా అనడం లేదు.
దీంతో కొందరు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం చప్పగా సాగుతోందని సర్వేలు చెబుతున్నాయి. దీనికి కారణా లు ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఒకటి గతంలో బీఆర్ ఎస్లో ఉండగా కొందరు నాయకులు కాంట్రాక్టులు పొందారు. అదేవిధంగా కేసీఆర్ నుంచి ఆర్తిక సాయం కూడా పొందారు. వారివారికి స్థానిక సంస్తల్లోనూ పదవులు ఇప్పించుకున్నారు. ఇక, కుటుంబాలకు కూడా సాయం చేయించుకున్నారు. కొందరు సొంత ఇళ్ల కోసం స్థలాలు తీసుకున్నారు.
మొత్తంగా బీఆర్ ఎస్లో ఉండగా.. కొన్ని లబ్ధిలు పొందారు. ఈ పరిణామం ఇప్పుడు వీరికి మొహమాటంగా మారింది. దీంతో పన్నెత్తు విమర్శ చేయడానికి మనసు రావడం లేదట. దీనిలో మరో కోణం కూడా ఉంద ని చెబుతున్నారు. రేపు ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే.. తమను బీఆర్ ఎస్ అధినేత టార్గెట్ చేయొచ్చనే జంకు కూడా ఈ నాయకుల్లో కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. అందుకే ఎన్నికల ప్రచారంలో నేరుగా టార్గెట్ చేయలేక సతమతం అవుతున్నారని అంటున్నారు.
This post was last modified on November 16, 2023 1:41 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…