Political News

కేసీయార్లో అయోమయం పెరిగిపోతోందా ?

కేసీయార్లో అయోమయం పెరిగిపోతున్నట్లుంది. ఎన్నికల బహిరంగసభల్లో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్ధమవుతున్నట్లు లేదు. నిజామాబాద్, మెదక్, బోధ్ బహిరంగసభల్లో మాట్లాడుతు జాతీయ పార్టీలకు కాలం చెల్లిందన్నారు. భవిష్యత్తంతా ప్రాంతీయపార్టీలదే అని బల్లగుద్ది మరీ చెప్పారు. తొందరలో జరగబోతున్న లోక్ సభ ఎన్నికల తర్వాత జోష్ అంతా ప్రాంతీయపార్టీలదే అని పదేపదే చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇదే నిజమైతే మరి కేసీయార్ జాతీయపార్టీని ఎందుకు పెట్టినట్లు ?

ప్రాంతీయపార్టీగా ఉన్న టీఆర్ఎస్ ను కేసీయార్ జాతీయపార్టీ బీఆర్ఎస్ గా మార్చిన విషయం తెలిసిందే. జాతీయపార్టీలు కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ ను ఏర్పాటుచేసినట్లు అప్పట్లో కేసీయార్ చెప్పుకున్నారు. అసలు సిసలు రాజకీయం అంటే ఏమిటో దేశానికి తాను బీఆర్ఎస్ ద్వారానే చూపిస్తానని అప్పట్లో పదేపదే చెప్పారు. మహారాష్ట్ర, ఒడిస్సా, కర్నాటక, ఉత్తరప్రదేశ్ లో చాలాసార్లు పర్యటించారు. చాలా రోజులు ఢిల్లీలోనే మకాం వేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన రైతుసంఘాల నేతలతో సమావేశమయ్యారు.

జాతీయ పార్టీ బీఆర్ఎస్ తో జాతీయ రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొస్తానని చాలా మాటలు చెప్పారు. మహారాష్ట్రలో అయితే పదేపదే పర్యటించారు. చివరకు తెలంగాణాను కూడా వదిలేసి మహారాష్ట్రలో చాలా ప్రాంతాలు తిరిగారు. బహిరంగసభలు కూడా నిర్వహించారు. బీఆర్ఎస్ నేతలకు కూడా అందుబాటులో ఉండని కేసీయార్ మహారాష్ట్ర నేతలతో మాత్రం రెగ్యులర్ టచ్ లో ఉండేవారు. కేసీయార్ వైఖరి చూసిన వాళ్ళు అప్పట్లో చాలా ఆశ్చర్యపోయారు.

సీన్ కట్ చేస్తే అప్పట్లో కేసీయార్ చేసిన పనులకు, మాట్లాడిన మాటలకు ఇపుడు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. జాతీయ పార్టీలు ఎత్తిపోయాయని, భవిష్యత్తంతా ప్రాంతీయ పార్టీలదే అని కేసీయార్ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. భవిష్యత్తంతా ప్రాంతీయపార్టీలదే అన్నది నిజమే అయితే మరి కేసీయార్ జాతీయపార్టీ ఎందుకు పెట్టారనే చర్చ జనాల్లో పెరిగిపోతోంది. ఇలాంటి పరస్పర విరుద్ధమైన ప్రకటనలు, వాదాలతోనే కేసీయార్ జనాల్లో బాగా పలుచనైపోతున్నారు. ఓడిపోతే హ్యాపీగా రెస్టు తీసుకుంటానని చెప్పిన మాటనే జనాలు చర్చించుకుంటున్నారు. ఇంతలోనే జాతీయ పార్టీలకు కాలం చెల్లిందని చెప్పటం మరో విచిత్రం.

This post was last modified on November 16, 2023 1:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`పీపీపీ`కి కేంద్రం అండ‌… బాబుకు భ‌రోసా… !

ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…

12 minutes ago

మిథున్ రెడ్డి ఆస్తులు ఎలా పెరిగాయ్.. హాట్ టాపిక్..!

వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…

50 minutes ago

లేడీ డైరెక్టర్ వేసిన డేరింగ్ స్టెప్

టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…

4 hours ago

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…

5 hours ago

రవితేజ వారి ‘మంచు’ పంచ్ చూశారా?

ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…

5 hours ago

సినిమా వాయిదా… 60 కోట్ల రీఫండ్

అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…

5 hours ago