ponguleti srinivas reddy
మరికొద్ది రోజుల్లో తెలంగాణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచార జోరు పెంచారు అన్ని పార్టీల నేతలు. ఈ క్రమంలోనే ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పొంగులేటిపై ఐటీ సోదాలు జరిగిన నేపథ్యంలో ఓ మీడియా చానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న పొంగులేటి…కేసీఆర్, కేటీఆర్ ల పై షాకింగ్ కామెంట్లు చేశారు. త్వరలో తాను సీఎం అవుతానని, అప్పటివరకు ఓపిక పట్టాలని కేటీఆర్ చెబితేనే ఇన్నాళ్లు పార్టీలో ఉన్నానని పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇన్నాళ్లు తాను బీఆర్ఎస్ లో ఉండడానికి కేటీఆరే కారణం అని పొంగులేటి చెప్పారు. నాన్న అంతే ఉంటాడులేన్నా, నేను 2 నెలల్లో సీఎం అవుతా..3 నెలల్లో సీఎం అవుతా…6 నెలల్లో సీఎం అవుతా..నేనే కదన్నా…నీకు ఆన్సర్ చేసేది..అని కేసీఆర్ తనకు నచ్చజెబుతూ వచ్చాడని అన్నారు. ఇంకా కాస్త ఓపిక పట్టు అన్నా అని నచ్చజెప్పాడని పొంగులేటి చెప్పారు. ఓ ఫైన్ మార్నింగ్ చేతులెత్తేశాడని, ఆ తర్వాత తాను బీఆర్ఎస్ లో ఉపయోగం లేదు కాబట్టి పార్టీ మారానని చెప్పారు. ఎప్పుడూ ఏ మనిషిని కలిసేందుకు, కలిసి సమస్య వినే ప్రయత్నం, దానిని పరిష్కరించే ప్రయత్నం కేసీఆర్ చేయలేదని ఆరోపించారు.
ఒక రాజకీయ నాయకుడిగా తన దగ్గరకు కూడా చాలామంది చాలా సమస్యలు చెప్పుకునేందుకు వస్తారని, అన్ని సమస్యలు పరిష్కరించడం ఎవరి వల్లా కాదని అన్నారు. అయితే, సమస్య వినే ఓపిక, సమస్య చెప్పుకునే వారికి కనీస గౌరవం కూడా ఉండకపోవడం బాధాకరమని చెప్పారు. కేటీఆర్ తర్వాతి సీఎం అంటూ జరుగుతున్న ప్రచారానికి పొంగులేటి వ్యాఖ్యలు ఊతమిచ్చాయి.
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…
విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…