Political News

అమ్మ‌కు అన్నం పెట్టలేనోడు… చంద్ర‌బాబుపై జ‌గ‌న్

టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై ఏపీ సీఎం జ‌గ‌న్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప‌ల్నాడు జిల్లా మాచ‌ర్ల‌లో వ‌రిక‌పూడి శెల ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి శంకుస్థాప‌న చేసిన అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. త‌మ ప్ర‌భుత్వం అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్య‌క్తి ఈ ప్రాజెక్టుకు క‌నీసం అనుమ‌తులు కూడా తీసుకురాలేక‌పోయార‌ని చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. తాము అన్ని అనుమ‌తులు తీసుకున్నాకే .. వ‌రిక‌పూడిశెల‌కు శంకుస్థాప‌న చేశామ‌ని, ఈ నెల 6నే కేంద్ర అట‌వీ శాఖ అనుమ‌తులు ఇచ్చింద‌ని జ‌గ‌న్ చెప్పారు.

ఇదే వేదిక‌పై సీఎం జ‌గ‌న్ రాజ‌కీయ విమ‌ర్శ‌లు గుప్పించారు. అమ్మ‌కు అన్నం పెట్ట‌లేనోడు.. పిన్న‌మ్మ‌కు బంగారు గాజులు చేయిస్తాన‌న్న‌ట్టు చంద్ర‌బాబు వ్య‌వ‌హారం ఉంద‌ని సీఎం జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. పేద‌లు మ‌హిళ‌ల కోసంఒక్క ప‌థ‌కం పెట్టిన చ‌రిత్ర కూడా చంద్ర‌బాబుకు లేద‌న్నారు. మ‌రోసారి అధికారం ఇవ్వాల ని చంద్ర‌బాబు కోరుతున్నార‌ని..ప్ర‌జ‌లు ఆలోచించాల‌ని జ‌గ‌న్ అన్నారు. ఎస్సీల్లో ఎవ‌రైనా పుట్టాల‌నుకుంటారా? అని చంద్ర‌బాబు అన్నార‌ని జ‌గ‌న్ గుర్తు చేశారు.

బీసీల తోక‌లు క‌ట్ చేస్తాన‌ని అహంకార పూరితంగా చంద్ర‌బాబు మాట్లాడార‌ని జ‌గ‌న్‌ అన్నారు. పేద‌లు, మ‌హిళ‌ల కోసం ఒక్క ప‌థ‌క‌మైనా ప్ర‌వేశ‌పెట్టారా? అని ప్ర‌శ్నించారు. “కూతురిని ఇచ్చిన మామ‌కు వెన్నుపోటు పొడిచిన వాడు.. పేద‌ల‌కు వెన్నుపోటు పొడ‌వ‌కుండా ఉంటాడా?” అని జ‌గ‌న్ అన్నారు. చంద్ర‌బాబు అధికారంలో ఉండి ఉంటే ఆర్టీసీ, విద్యుత్‌ల‌ను ప్రైవేటు ప‌రం చేసేవార‌ని, ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌ను కూడా తీసేసేవార‌ని విమ‌ర్శించారు. క‌ష్ట‌కాలంలోనూ తాము సంక్షేమాన్ని ఆప‌లేద‌ని సీఎం జ‌గ‌న్ చెప్పారు.

చంద్ర‌బాబు త‌న బినామీల భూముల ధ‌ర‌లు పెంచుకునేందుకే అమ‌రావ‌తి రాజ‌ధానిని ఎంచుకున్నారని జ‌గ‌న్ విమ‌ర్శించారు. మూడు ప్రాంతాల‌కు స‌మ‌న్యాయం చేయాల‌ని చంద్ర‌బాబు ఎప్పుడైనా ఆలోచించారా? అని ప్ర‌శ్నించారు. “చంద్ర‌బాబు మోసాల పాల‌న‌ను చూశాం. రేపు ఎన్నిక‌ల్లో కేజీ బంగారం, బెంజ్‌కారు కూడా ఇస్తామ‌ని హామీ ఇస్తారు” అని వ్యంగ్యాస్త్రాలు రువ్వారు.

This post was last modified on November 15, 2023 4:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago