Political News

టెన్షన్ పెరిగిపోతోందా ?

కేసీయార్లో టెన్షన్ పెరిగిపోతోందట. కారణం ఏమిటంటే నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం ఆఖరు రోజు కావటమే. కేసీయార్ పోటీచేస్తున్న గజ్వేలు, కామారెడ్డిలో పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్న అనేకమందితో పాటు వ్యక్తిగతంగా కేసీయార్ ను వ్యతిరేకిస్తున్న వాళ్ళు చాలామంది నామినేషన్లు వేశారు. వీరితో నామినేషన్లను ఉపసంహరించుకునేట్లుగా నచ్చచెబుతున్నా సాధ్యంకావటంలేదు. నామినేషన్ల స్క్రూటిని తర్వాత గజ్వేలులో 86 మంది, కామారెడ్డిలో 58 మంది పోటీలో ఉన్నారు.

ఇంతమంది పోటీలో ఉంటే అధికారపార్టీకి ఒకరకంగా దెబ్బనే చెప్పాలి. ఎలాగంటే పోటీలో ఉన్నవారికి వాళ్ళ వర్గాలు ఓట్లు వేసుకుంటే కేసీయార్ మెజారిటి బాగా తగ్గిపోతుంది. అసలు రెండింటిలో ఎక్కడో ఒకచోట కేసీయార్ ఓడిపోతారా అనే ప్రచారం కూడా బాగా పెరిగిపోతోంది. ప్రచారం జరుగుతున్నట్లు ఓడకపోవచ్చు కానీ గెలుపు అంత వీజీకాదని మాత్రం అర్ధమైపోతోంది. గజ్వేలులో 2018లో కేసీయార్ కు 58 వేల మెజారిటి వచ్చింది. మరీసారి అంత వస్తుందా అంటే రాకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కేసీయార్ మీద పోటీచేస్తున్న వాళ్ళల్లో ఈటల రాజేందర్ కీలకం.

కేసీయార్ ఓటమే టార్గెట్ గా ఈటల బీజేపీ అభ్యర్ధిగా రంగంలోకి దిగారు. ఇక్కడ ఈటల సామాజికవర్గం ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయట. ఆ ఓట్లన్నీ ఈటలకు పడితే కేసీయార్ కు కష్టాలు తప్పవనే చెప్పాలి. దీనికితోడు కేసీయార్ ప్రభుత్వం వల్ల నష్టపోయిన వర్గాల్లోని వాళ్ళే పోటీలో ఉన్నారు. కాబట్టి ఆ వర్గాల ఓట్లు ఆ అభ్యర్ధులకు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇదే సమయంలో కామారెడ్డిలో కూడా ఇదే పరిస్ధితి కనబడుతోంది. ఇక్కడ కేసీయార్ కు గట్టి ప్రత్యర్ధిగా కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి రంగంలో ఉన్నారు. ఇక్కడా ప్రభుత్వంలో నష్టపోయిన వాళ్ళు, ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న రైతులు , ముస్లిం మైనారిటిలు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి కామారెడ్డిలో కూడా కేసీయార్ గెలుపు అంత ఈజీ కాదని అర్ధమైపోతోంది. ఒకవేళ ఏదైనా ఊహించనిది జరిగి కేసీయార్ ఓడిపోయే పరిస్ధితి ఉంటే మాత్రం బీఆర్ఎస్ అధికారంలోకి రావటం కష్టమనే అనుకోవాలి. మరి ఏమి జరుగుతుందో చూడాలి.

This post was last modified on November 15, 2023 1:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

4 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

5 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

6 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

6 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

6 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

7 hours ago