కేసీయార్లో టెన్షన్ పెరిగిపోతోందట. కారణం ఏమిటంటే నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం ఆఖరు రోజు కావటమే. కేసీయార్ పోటీచేస్తున్న గజ్వేలు, కామారెడ్డిలో పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్న అనేకమందితో పాటు వ్యక్తిగతంగా కేసీయార్ ను వ్యతిరేకిస్తున్న వాళ్ళు చాలామంది నామినేషన్లు వేశారు. వీరితో నామినేషన్లను ఉపసంహరించుకునేట్లుగా నచ్చచెబుతున్నా సాధ్యంకావటంలేదు. నామినేషన్ల స్క్రూటిని తర్వాత గజ్వేలులో 86 మంది, కామారెడ్డిలో 58 మంది పోటీలో ఉన్నారు.
ఇంతమంది పోటీలో ఉంటే అధికారపార్టీకి ఒకరకంగా దెబ్బనే చెప్పాలి. ఎలాగంటే పోటీలో ఉన్నవారికి వాళ్ళ వర్గాలు ఓట్లు వేసుకుంటే కేసీయార్ మెజారిటి బాగా తగ్గిపోతుంది. అసలు రెండింటిలో ఎక్కడో ఒకచోట కేసీయార్ ఓడిపోతారా అనే ప్రచారం కూడా బాగా పెరిగిపోతోంది. ప్రచారం జరుగుతున్నట్లు ఓడకపోవచ్చు కానీ గెలుపు అంత వీజీకాదని మాత్రం అర్ధమైపోతోంది. గజ్వేలులో 2018లో కేసీయార్ కు 58 వేల మెజారిటి వచ్చింది. మరీసారి అంత వస్తుందా అంటే రాకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కేసీయార్ మీద పోటీచేస్తున్న వాళ్ళల్లో ఈటల రాజేందర్ కీలకం.
కేసీయార్ ఓటమే టార్గెట్ గా ఈటల బీజేపీ అభ్యర్ధిగా రంగంలోకి దిగారు. ఇక్కడ ఈటల సామాజికవర్గం ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయట. ఆ ఓట్లన్నీ ఈటలకు పడితే కేసీయార్ కు కష్టాలు తప్పవనే చెప్పాలి. దీనికితోడు కేసీయార్ ప్రభుత్వం వల్ల నష్టపోయిన వర్గాల్లోని వాళ్ళే పోటీలో ఉన్నారు. కాబట్టి ఆ వర్గాల ఓట్లు ఆ అభ్యర్ధులకు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇదే సమయంలో కామారెడ్డిలో కూడా ఇదే పరిస్ధితి కనబడుతోంది. ఇక్కడ కేసీయార్ కు గట్టి ప్రత్యర్ధిగా కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి రంగంలో ఉన్నారు. ఇక్కడా ప్రభుత్వంలో నష్టపోయిన వాళ్ళు, ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న రైతులు , ముస్లిం మైనారిటిలు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి కామారెడ్డిలో కూడా కేసీయార్ గెలుపు అంత ఈజీ కాదని అర్ధమైపోతోంది. ఒకవేళ ఏదైనా ఊహించనిది జరిగి కేసీయార్ ఓడిపోయే పరిస్ధితి ఉంటే మాత్రం బీఆర్ఎస్ అధికారంలోకి రావటం కష్టమనే అనుకోవాలి. మరి ఏమి జరుగుతుందో చూడాలి.
This post was last modified on November 15, 2023 1:35 pm
పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్…
కొడాలి నాని. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. వైసీపీ హయాంలో ప్రత్యర్థులు ఆయనకు “బూతుల మంత్రి” అనే…
డిజిటల్ యుగానికి అనుగుణంగా ప్రభుత్వం ఆన్లైన్ రైతు బజార్ను ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్ట్గా విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ రైతు బజార్…
సాధారణంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశాలు మూసివున్న గదుల్లో, గోప్యంగా సాగుతుంటాయి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న కలెక్టర్ల…
అడివి శేష్ తెరమీద కనిపించి రెండేళ్లు గడిచిపోయాయి. ఆ మధ్య నాని హిట్ 3 ది థర్డ్ కేస్ లో…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025’ (వ్యాపార సంస్కర్త-2025)కు ఆయన ఎంపికయ్యారు.…