Political News

టెన్షన్ పెరిగిపోతోందా ?

కేసీయార్లో టెన్షన్ పెరిగిపోతోందట. కారణం ఏమిటంటే నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం ఆఖరు రోజు కావటమే. కేసీయార్ పోటీచేస్తున్న గజ్వేలు, కామారెడ్డిలో పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్న అనేకమందితో పాటు వ్యక్తిగతంగా కేసీయార్ ను వ్యతిరేకిస్తున్న వాళ్ళు చాలామంది నామినేషన్లు వేశారు. వీరితో నామినేషన్లను ఉపసంహరించుకునేట్లుగా నచ్చచెబుతున్నా సాధ్యంకావటంలేదు. నామినేషన్ల స్క్రూటిని తర్వాత గజ్వేలులో 86 మంది, కామారెడ్డిలో 58 మంది పోటీలో ఉన్నారు.

ఇంతమంది పోటీలో ఉంటే అధికారపార్టీకి ఒకరకంగా దెబ్బనే చెప్పాలి. ఎలాగంటే పోటీలో ఉన్నవారికి వాళ్ళ వర్గాలు ఓట్లు వేసుకుంటే కేసీయార్ మెజారిటి బాగా తగ్గిపోతుంది. అసలు రెండింటిలో ఎక్కడో ఒకచోట కేసీయార్ ఓడిపోతారా అనే ప్రచారం కూడా బాగా పెరిగిపోతోంది. ప్రచారం జరుగుతున్నట్లు ఓడకపోవచ్చు కానీ గెలుపు అంత వీజీకాదని మాత్రం అర్ధమైపోతోంది. గజ్వేలులో 2018లో కేసీయార్ కు 58 వేల మెజారిటి వచ్చింది. మరీసారి అంత వస్తుందా అంటే రాకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కేసీయార్ మీద పోటీచేస్తున్న వాళ్ళల్లో ఈటల రాజేందర్ కీలకం.

కేసీయార్ ఓటమే టార్గెట్ గా ఈటల బీజేపీ అభ్యర్ధిగా రంగంలోకి దిగారు. ఇక్కడ ఈటల సామాజికవర్గం ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయట. ఆ ఓట్లన్నీ ఈటలకు పడితే కేసీయార్ కు కష్టాలు తప్పవనే చెప్పాలి. దీనికితోడు కేసీయార్ ప్రభుత్వం వల్ల నష్టపోయిన వర్గాల్లోని వాళ్ళే పోటీలో ఉన్నారు. కాబట్టి ఆ వర్గాల ఓట్లు ఆ అభ్యర్ధులకు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇదే సమయంలో కామారెడ్డిలో కూడా ఇదే పరిస్ధితి కనబడుతోంది. ఇక్కడ కేసీయార్ కు గట్టి ప్రత్యర్ధిగా కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి రంగంలో ఉన్నారు. ఇక్కడా ప్రభుత్వంలో నష్టపోయిన వాళ్ళు, ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న రైతులు , ముస్లిం మైనారిటిలు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి కామారెడ్డిలో కూడా కేసీయార్ గెలుపు అంత ఈజీ కాదని అర్ధమైపోతోంది. ఒకవేళ ఏదైనా ఊహించనిది జరిగి కేసీయార్ ఓడిపోయే పరిస్ధితి ఉంటే మాత్రం బీఆర్ఎస్ అధికారంలోకి రావటం కష్టమనే అనుకోవాలి. మరి ఏమి జరుగుతుందో చూడాలి.

This post was last modified on November 15, 2023 1:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

2 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

2 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

4 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

6 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

7 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

7 hours ago