టీడీపీ నాయకుడు, కడప జిల్లా పులివెందుల పార్టీ ఇంచార్జ్ బీటెక్ రవి(రవీంద్రారెడ్డి)ని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పులివెందుల మేజిస్ట్రేట్ ముందు ఆయనను హాజరు పరిచారు. అయితే.. దీనికి ముందు భారీ హైడ్రామా చోటు చేసుకుంది. బీటెక్ రవిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ.. కొందరు మీడియాకు ఉప్పందించారు. దీంతో మీడియాలో బీటెక్ రవి కిడ్నాప్ అంటూ.. భారీ ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి. కడప నుంచి పులివెందుల వస్తుండగా బీటెక్ రవిని 20 మంది ఆగంతకులు ఎత్తుకెళ్లారని వార్తలు వచ్చాయి.
దీంతో ఈ విషయం తెలుసుకున్న రవి సతీమణి భయాందోళనకు గురై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే రవికి సంబంధించిన ఎలాంటి సమాచారం తమకు తెలియదని పోలీసులు చేతులెత్తేశారని టీడీపీ నాయకులు కూడా వ్యాఖ్యానించారు. దీంతో రవిని తీసుకెళ్లిందెవరు..? అసలేం జరిగింది..? అనేది తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. రాజకీయంగా ఆయన శత్రువులే కిడ్నాప్ పనిచేశారా..? లేకుంటే అధికార పార్టీ నేతలు ఈ చర్యకు పాల్పడ్డారా..? అనేది కొద్దిసేపు చర్చనీయాంశంగా మారింది.
అయితే.. ఈ విషయం ఇలా జరుగుతున్న క్రమంలోనే మరోవైపు.. బీటెక్ రవిని పులివెందుల పోలీసులే దారి కాచి అరెస్టు చేశారని తెలిసింది. అయితే.. పోలీసులు అరెస్టు చేశారంటే.. టీడీపీ నేతల నుంచి నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉండడంతో ఆయన అరెస్టును కొన్ని గంటల పాటు నిలిపి ఉంచారు. ఇంతలోనే ఆయన కిడ్నాప్ అయ్యారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇదిలావుంటే.. పోలీసులు రవిపై సెక్షన్ 333(ఐపీసీ) కింద అరెస్టు చేసినట్టు చెప్పారు. అనంతరం ఆయనను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.
ఏంటి కేసు?
గతంలో టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభానికి ముందు నారా లోకేష్ కడప పర్యటనకు వచ్చారు. లోకేష్ పర్యటనలో కడప విమానాశ్రయం వద్ద ఆందోళన చేశారని.. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని రవిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఆయనను అరెస్టు చేసి ఉంటారని టీడీపీ నాయకులు భావిస్తున్నారు.
లోకేష్ రియాక్షన్
పుట్టిన ఊరు, గెలిచిన నియోజకవర్గం పులివెందుల వెళ్లాల్సి వచ్చినా సీఎం జగన్ గజ గజా వణుకుతున్నారని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. పరదాలు, బారికేడ్లు, ముందస్తు అరెస్టులు, దుకాణాల మూసివేత, చెట్ల నరికివేత లాంటివి.. చేసినా ఓట్లేసిన జనాన్ని చూడాలంటే జగన్ రెడ్డికి భయమని విమర్శించారు. సొంత నియోజకవర్గ ప్రజల్ని ఎదుర్కోలేని పిరికి పంద జగన్ అని ఆక్షేపించారు. తన ఎన్నికల ప్రత్యర్థి(పులివెందుల) బీటెక్ రవిని చూసినా భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.
This post was last modified on November 15, 2023 6:34 am
కరోనా తర్వాత మొదలైన ఓటీటీ విప్లవం వల్ల మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో ఆదరణ పెరిగిందో తెలిసిందే. ఎప్పట్నుంచో…
రేపు విష్ణు విన్యాసం విడుదల కానుంది. కొత్త రిలీజులు ఇంకేం ఉన్నాయనేది పక్కనపెడితే జనాల దృష్టిలో అంతో ఇంతో ఫోకస్…
బేబి షామిలి.. 90వ దశకంతో తెలుగు, తమిళ సినిమాలు చూసిన వాళ్లు అంత సులువుగా మరిచిపోలేని పేరిది. అంజలి, జగదేక…
థియేటర్ ఆక్యుపెన్సీలు తగ్గిపోవడానికి కారణం ఓటిటికి తక్కువ గ్యాప్ ఉండటమే అన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్న వాదన. ఎలాగూ నాలుగు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ?…