తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో విజయం దక్కించుకుని మూడోసారి కూడా అధికారం చేజిక్కిం చుకోవాలని భావిస్తున్న అధికార పార్టీ బీఆర్ ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సీఎం కేసీఆర్ కుటుంబానికే చెందిన తనయుడు, తనయ, మేనల్లుడు.. సహా ఇతర నేతలు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. ప్రజలను తమవైపు మళ్లిస్తున్నారు. ఈ క్రమంలో మీడియా ముందు కనిపిస్తున్నది కేవలం కేసీఆర్(బహిరంగ సభల్లో), కేటీఆర్, హరీష్రావు
వీరిలోనూ కేసీఆర్ కేవలం జిల్లాల్లో సుడిగాలి పర్యటనలుచేస్తున్నారు. రోజుకు రెండు నుంచి మూడు జిల్లాల్లో ఆయన పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాలను కవర్ చేసిన కేసీఆర్.. ఎన్నికలకు 10 రోజుల ముందు నుంచి మరింత దూకుడు పెంచాలని నిర్ణయించారు. రెండు మూడురోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టనున్నారని తెలిసింది. ఇక, కేటీఆర్ ఒక వైపుజిల్లాల పర్యటనలు చేస్తూ.. బహిరంగ సభల్లో ప్రసంగిస్తూనే.. మరో వైపు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
ఇక, హరీష్రావు కూడా.. మీడియాలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇదే సమయంలో జిల్లా స్థాయి లో కుల, మత సంఘాలను ఏకం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో పైకి కనిపించని నాయకురాలు కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత. ఎన్నికల ప్రచారం ప్రారంభమై.. చాలా రోజులు అయినా. కవిత ఎక్కడా మీడియాకు చిక్కడం లేదు. కనీసం ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం లేదు. దీంతో ఆమె ఊసు ఎక్కడా వినిపించడం లేదు.
కానీ, కవిత చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మండల స్థాయిలో ఆమె పర్యటిస్తున్నారు. ప్రధాన మీడియాకు దూరంగా నేరుగా ప్రజలను కలుసుకుంటున్నారు. అభ్యర్థుల పక్షాన ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ.. మహిళలకు బొట్టు పెట్టి మరీ ఓటు వేయాలని.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కవిత కోరుతున్నారు.
ఇలా.. ఆమె ప్రధాన మీడియా ముందుకు రాకపోవడానికి.. లిక్కర్ స్కాంలో తన పేరు ఉండడమే కారణమని అంటున్నారు పరిశీలకులు. బయటకు వచ్చి నేరుగా విమర్శలు గుప్పిస్తే.. ప్రతిపక్ష నాయకులు.. ఆమెను లిక్కర్ స్కాం పేరుతో టార్గెట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే వారికి ఛాన్స్ ఇవ్వరాదనే ఉద్దేశంతో కవిత చాలా తెలివిగా అండర్ కరెంట్ పాలిటిక్స్ చేస్తున్నారని అంటున్నారు.
This post was last modified on November 15, 2023 9:36 am
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…