Political News

పల్నాడువాసుల కల నెరవేర్చనున్న జగన్

దశాబ్దాలుగా పల్నాడు ప్రాంతం వెనుకబాటుకు గురవుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఫ్యాక్షన్ ప్రాంతంగా పేరున్న పల్నాడు ఆ తర్వాత ఆ మచ్చను చెరిపేసుకుంది. కానీ, కరువు కోరల నుంచి మాత్రం బయటపడలేదు. ముఖ్యంగా తాగు, సాగు నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే ఎగువ పల్నాడు ప్రాంతం ఇంకా వెనుకబడే ఉంది. నాగార్జునసాగర్ డ్యాం ద్వారా వచ్చే నీటితో దిగువ పల్నాడులో నీటి ఎద్దడి తగ్గింది. దీంతో, ఎగువ పల్నాడు ప్రాంతంలో నీటి ఎద్దడి లేకుండా చేసేందుకు 70 ఏళ్ల క్రితం వరికపూడిసెల ప్రాజెక్టును ప్రతిపాదించారు.

అయితే, గత 7 దశాబ్దాలుగా ఎన్నో ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపనలు చేసి శిలా ఫలకాలు వేశాయి. కానీ, ప్రాజెక్టుకు కావాల్సిన పర్యావరణ, అటవీశాఖ అనుమతులు తేవడంలో మాత్రం విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం జగన్ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులను కేంద్రం నుంచి తెచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ నెల 15వ తారీకున వరికిపూడిసెల ప్రాజెక్టుకు జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా మాచర్ల పట్టణంలోని రాయవరం జంక్షన్ లో భారీ బహిరంగ సభలో జగన్ పాల్గొనబోతున్నారు.

మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలంలో ఉన్న గంగలకుంట గ్రామం వద్ద వరికిపూడిసెల లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని జగన్ ప్రారంభించనున్నారు. 350 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు పనులను ఆయన ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 250 క్యూసెక్కుల నీటిని వెల్దుర్తి ప్రజల దాహార్తిని తీర్చేందుకు విడుదల చేయాలని సంకల్పించారు. దాంతోపాటు 25 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. అందుకోసం పంపు హౌస్ నిర్మాణం కూడా చేపట్టనున్నారు. సీఎం జగన్ చొరవతో అటవీ శాఖ, పర్యావరణ అనుమతులు లభించాయని, ఈ ప్రాజెక్టుకు ఎటువంటి అడ్డంకులు లేవని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.

70 ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించి అక్కడ ఎన్నో ప్రభుత్వాలు శంకుస్థాపన కూడా చేశాయి. కానీ, అనుమతులు సాధించడంలో మాత్రం విఫలమయ్యాయి. కాగా, ఈ నెల 15వ తేదీ ఉదయం 9 గంటల 45 నిమిషాలకు తాడేపల్లి నుంచి జగన్ బయలుదేరి మాచర్లకు చేరుకోనున్నారు. శంకుస్థాపన, బహిరంగ సభ ముగించుకొని మాచర్ల నుంచి తాడేపల్లికి జగన్ తిరుగు ప్రయాణం కానున్నారు. జగన్ పర్యటన సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

This post was last modified on November 14, 2023 9:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago