Political News

పల్నాడువాసుల కల నెరవేర్చనున్న జగన్

దశాబ్దాలుగా పల్నాడు ప్రాంతం వెనుకబాటుకు గురవుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఫ్యాక్షన్ ప్రాంతంగా పేరున్న పల్నాడు ఆ తర్వాత ఆ మచ్చను చెరిపేసుకుంది. కానీ, కరువు కోరల నుంచి మాత్రం బయటపడలేదు. ముఖ్యంగా తాగు, సాగు నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే ఎగువ పల్నాడు ప్రాంతం ఇంకా వెనుకబడే ఉంది. నాగార్జునసాగర్ డ్యాం ద్వారా వచ్చే నీటితో దిగువ పల్నాడులో నీటి ఎద్దడి తగ్గింది. దీంతో, ఎగువ పల్నాడు ప్రాంతంలో నీటి ఎద్దడి లేకుండా చేసేందుకు 70 ఏళ్ల క్రితం వరికపూడిసెల ప్రాజెక్టును ప్రతిపాదించారు.

అయితే, గత 7 దశాబ్దాలుగా ఎన్నో ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపనలు చేసి శిలా ఫలకాలు వేశాయి. కానీ, ప్రాజెక్టుకు కావాల్సిన పర్యావరణ, అటవీశాఖ అనుమతులు తేవడంలో మాత్రం విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం జగన్ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులను కేంద్రం నుంచి తెచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ నెల 15వ తారీకున వరికిపూడిసెల ప్రాజెక్టుకు జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా మాచర్ల పట్టణంలోని రాయవరం జంక్షన్ లో భారీ బహిరంగ సభలో జగన్ పాల్గొనబోతున్నారు.

మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలంలో ఉన్న గంగలకుంట గ్రామం వద్ద వరికిపూడిసెల లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని జగన్ ప్రారంభించనున్నారు. 350 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు పనులను ఆయన ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 250 క్యూసెక్కుల నీటిని వెల్దుర్తి ప్రజల దాహార్తిని తీర్చేందుకు విడుదల చేయాలని సంకల్పించారు. దాంతోపాటు 25 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. అందుకోసం పంపు హౌస్ నిర్మాణం కూడా చేపట్టనున్నారు. సీఎం జగన్ చొరవతో అటవీ శాఖ, పర్యావరణ అనుమతులు లభించాయని, ఈ ప్రాజెక్టుకు ఎటువంటి అడ్డంకులు లేవని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.

70 ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించి అక్కడ ఎన్నో ప్రభుత్వాలు శంకుస్థాపన కూడా చేశాయి. కానీ, అనుమతులు సాధించడంలో మాత్రం విఫలమయ్యాయి. కాగా, ఈ నెల 15వ తేదీ ఉదయం 9 గంటల 45 నిమిషాలకు తాడేపల్లి నుంచి జగన్ బయలుదేరి మాచర్లకు చేరుకోనున్నారు. శంకుస్థాపన, బహిరంగ సభ ముగించుకొని మాచర్ల నుంచి తాడేపల్లికి జగన్ తిరుగు ప్రయాణం కానున్నారు. జగన్ పర్యటన సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

This post was last modified on November 14, 2023 9:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాక్టర్ నుంచి టెర్రరిస్ట్.. అసలు ఎవరీ తహావుర్ రాణా?

2008 నవంబర్ 26న జరిగిన ముంబై ఉగ్రదాడి భారత దేశ చరిత్రలో మరిచిపోలేని దారుణం. ఆ దాడిలో 170 మందికిపైగా…

10 minutes ago

అమెరికాలో భారత సంతతి సీఈఓ అరెస్ట్‌… వ్యభిచార గృహాల కేసులో సంచలనం!

అమెరికాలో భారత సంతతికి చెందిన ప్రముఖ సీఈఓ అనురాగ్ బాజ్‌పాయ్ అరెస్టయ్యారు. బోస్టన్‌ సమీపంలో ఉన్న వ్యభిచార గృహాల వ్యవహారంలో…

54 minutes ago

ఎక్కి తొక్కిన ఘనటకు తోపుదుర్తే కారణమట!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జరిపిన పర్యటన…

2 hours ago

వీరమల్లు చుట్టూ సమస్యల సైన్యం

ఒకపక్క విడుదల తేదీ మే 9 ముంచుకొస్తోంది. రిలీజ్ కౌంట్ డౌన్ నెల నుంచి 29 రోజులకు తగ్గిపోయింది. ఇంకోవైపు…

2 hours ago

ఐటీ అంటే చంద్ర‌బాబు.. యంగ్ ఇండియా అంటే నేను : రేవంత్ రెడ్డి

ముఖ్య‌మంత్రుల 'బ్రాండ్స్‌'పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌తి ముఖ్య‌మంత్రికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుంద‌న్నారు. "రెండు…

3 hours ago

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ అరెస్టు!

బీఆర్ఎస్ నాయ‌కుడు, బోధ‌న్ నియోజ‌క‌వర్గం మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ అరెస్ట‌య్యారు. రెండేళ్ల కింద‌ట జ‌రిగిన ఘ‌ట‌న‌లో త‌న కుమారుడిని స‌ద‌రు…

4 hours ago