కేసీయార్ పాలన పై కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన యాడ్స్ తో బీఆర్ఎస్ కు బాగా మండుతున్నట్లే ఉంది. కాంగ్రెస్ యాడ్స్ ను నిలిపేయాలని కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసిందంటేనే బీఆర్ఎస్ కు ఎంతగా మండుతోందో అర్ధమవుతోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ జారీ చేసిన ప్రకటనల్లో కొన్నింటిపై కాంగ్రెస్ కూడా అభ్యంతరాలు వ్యక్తచేసింది. మొత్తంమీద రెండుపార్టీలు పరస్పరం జారీచేసుకున్న యాడ్స్ ను నిలిపేయాలని కేంద్ర ఎన్నికలకమీషనర్ కు ఫిర్యాదులు చేసుకోవటమే హైలైట్ గా నిలిచింది.
ఇంతకీ విషయం ఏమిటంటే కేసీయార్ పోలికలతో ఎవరినో ప్రధానంగా ఉంచి కాంగ్రెస్ కొన్ని యాడ్స్ తయారుచేసింది. సుమారు ఐదారు యాడ్స్ జనాల్లో బాగా వైరల్ అయ్యాయి. కేసీయార్ పోలికలున్న వ్యక్తి జనాలతో మాట్లాడటం, జనాలు సదరు వ్యక్తి హామీలను తిరస్కరించటం, కారుకు పంక్చర్ చేయటం, కారును మద్దతుదారులతో కేసీయార్ పోలిన వ్యక్తి తోసుకుంటూ వెళ్ళటం లాంటివి యాడ్స్ లో కనబడుతున్నాయి. కాంగ్రెస్ విడుదల చేసిన ఈ యాడ్స్ కాస్త వెరైటీగా ఉండటంతో జనాల్లో బాగా చర్చలు జరుగుతున్నాయి.
అసలే కేసీయార్ పాలనపై మండిపోతున్న జనాలను ఈ యాడ్స్ బాగా ఆకర్షించాయి. దాంతో సోషల్ మీడియాలో ఈ యాడ్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. జనాల్లో ట్రెండ్ అవుతున్న కేసీయార్ యాంటీ యాడ్స్ ను చూసి బీఆర్ఎస్ లో కలవరం మొదలైనట్లే ఉంది. యాడ్స్ కారణంగా జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతే పార్టీకి ఎక్కడ నష్టం జరుగుతుందో అనే భయం కూడా పెరిగిపోయినట్లుంది. అందుకనే కాంగ్రెస్ జారీచేసిన యాడ్స్ ను వెంటనే నిలిపేయాలని అభ్యంతరాలు వ్యక్తంచేసింది.
ఇదే విధమైన అభ్యంతరాలను కాంగ్రెస్ కూడా వ్యక్తం చేసింది. అయితే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఇచ్చిన యాడ్స్ పెద్దగా జనాల్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే గడచిన పదేళ్ళుగా కాంగ్రెస్ ప్రతిపక్షంలోనే ఉండటంతో పార్టీని టార్గెట్ చేసేందుకు బీఆర్ఎస్ కు ఏమీలేదు. అందుకనే ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలనను, కాంగ్రెస్ ఇచ్చిన సిక్స్ గ్యారెంటీ హామీలను విమర్శిస్తు బీఆర్ఎస్ యాడ్స్ ఉన్నాయి. అయితే సిక్స్ గ్యాంరెటీస్ ఇప్పటికే జనాల్లో పాజిటివ్ గా వెళ్ళిపోయాయి. మరి యాడ్స్ ప్రభావం జనాల్లో ఎంతుంటుందో చూడాల్సిందే.
This post was last modified on November 14, 2023 7:18 pm
ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను…
ఎప్పుడూ ట్విట్టర్ లో, బయట హడావిడి చేసే ఎలన్ మస్క్ ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఆయనకి ఆయనగా…
తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…
ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…
నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని…
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…