బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తెలంగాణ ఎన్నికల్లో హ్యాట్రిక్ పై కన్నేశారు. ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. కానీ ఎన్నికల తేదీ దగ్గరపడుతున్నా కొద్దీ కేసీఆర్ లో ఆందోళన పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గెలుపుపై సందేహాలు పెరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా తమ దారికి కాంగ్రెస్ అడ్డు వస్తుందనే కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కేసీఆర్ భయపడుతున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. అందుకే రేవంత్ ను కట్టడి చేయడంపై కేసీఆర్ ఫోకస్ పెట్టారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ పై ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా రేవంత్ పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఎన్నికల్లో హింసను ప్రేరేపించేలా, కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులకు ఉసిగొల్పేలా రేవంత్ వ్యాఖ్యలు ఉంటున్నాయని బీఆర్ఎస్ పేర్కొంది. రేవంత్ ను స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారంలో పాల్గొనకుండా కట్టడి చేయాలని, తెలంగాణను హింసాత్మకంగా మార్చడానికి కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని బీఆర్ఎస్ తెలిపింది. గత నెల 30న దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్త కత్తితో దాడి చేశారని, ఈ నెల 11న అచ్చంపేట బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ అభ్యర్థి వంశీ క్రిష్ణ దాడి చేసి గాయపర్చారని బీఆర్ఎస్ ఆ ఫిర్యాదులో పేర్కొంది.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తనదైన దూకుడుతో దూసుకెళ్తోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు. వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునేలా రేవంత్ వ్యూహాలు అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ కు సానుకూలంగా ఏర్పడుతున్న పరిస్థితులను ఓట్లుగా మార్చుకునేందుకు రేవంత్ సాగుతున్నారు. ఆ దిశగా బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతను భుజాలకెత్తుకున్నారు. ప్రచారంలో జోరు ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ కు కొరకరాని కొయ్యగా మారారు. దీంతో రేవంత్ కు అడ్డుకట్ట వేసేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.
This post was last modified on November 14, 2023 7:57 pm
ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…
అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…
మన నిర్మాతలు ఈ మధ్య బౌండరీలు దాటేసి, వేరే ఇండస్ట్రీల సూపర్ స్టార్లతో సినిమాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్…
జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…
చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్…
ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…