తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఇప్పటికే బీఆర్ ఎస్ పై సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ప్రచారాన్నిముమ్మరం చేసింది. మరోవైపు.. బీజేపీకి బీఆర్ ఎస్ బీ టీం అంటూ ప్రచారం కూడా చేస్తోంది. అందుకే తమప్రచారాల్లో ఎక్కడా బీజేపీని కానీ, ప్రధాని నరేంద్ర మోడీని కానీ బీఆర్ ఎస్ నేతలు విమర్శించడం లేదని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక, ఎంఐఎం, బీఆర్ ఎస్లను బీజేపీ అగ్రనేతలే ఆడిస్తున్నారంటూ..ఇటీవల పెద్ద ఎత్తున కటౌట్లు పెట్టి మరీ ఎన్నికల ప్రచారంలో వేడి రగిలించారు. ఇదిలావుంటే.. తాజాగా కాంగ్రెస్ నేతలు మరో సంచలన విషయాన్ని కూడా బయట పెట్టారు. బీజేపీ అగ్రనేత, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సీఎం కేసీఆర్ తనయ కవిత దిగిన సెల్ఫీలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే.. ఇవి ఎప్పుడు దిగారనేది మాత్రం తెలియాల్సి ఉంది.
కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ఈ సెల్ఫీ ఫొటోలను విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చింది. దీనిలో ప్రధాని నరేంద్రమోడీకి పక్కనే కవిత నిలబడిఉన్నారు. అదేవిధంగా పలువురు బీఆర్ ఎస్ నాయకులు కూడా ఈ ఫొటోలో కనిపిస్తున్నారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టిన కాంగ్రెస్ నాయకులు.. ఇది కదా బంధమంటే అని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంరంభానికి ముందు నుంచి బీజేపీకి-బీఆర్ ఎస్కు మధ్య బంధం ఉందనే ప్రచారం చేస్తున్న కాంగ్రెస్కు ఇప్పుడు సెల్ఫీలు అందివచ్చిన వరంగా మారాయని అంటున్నారు పరిశీలకులు. మరి వీటిపై బీఆర్ ఎస్ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on November 14, 2023 7:19 pm
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…