తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఇప్పటికే బీఆర్ ఎస్ పై సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ప్రచారాన్నిముమ్మరం చేసింది. మరోవైపు.. బీజేపీకి బీఆర్ ఎస్ బీ టీం అంటూ ప్రచారం కూడా చేస్తోంది. అందుకే తమప్రచారాల్లో ఎక్కడా బీజేపీని కానీ, ప్రధాని నరేంద్ర మోడీని కానీ బీఆర్ ఎస్ నేతలు విమర్శించడం లేదని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక, ఎంఐఎం, బీఆర్ ఎస్లను బీజేపీ అగ్రనేతలే ఆడిస్తున్నారంటూ..ఇటీవల పెద్ద ఎత్తున కటౌట్లు పెట్టి మరీ ఎన్నికల ప్రచారంలో వేడి రగిలించారు. ఇదిలావుంటే.. తాజాగా కాంగ్రెస్ నేతలు మరో సంచలన విషయాన్ని కూడా బయట పెట్టారు. బీజేపీ అగ్రనేత, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సీఎం కేసీఆర్ తనయ కవిత దిగిన సెల్ఫీలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే.. ఇవి ఎప్పుడు దిగారనేది మాత్రం తెలియాల్సి ఉంది.
కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ఈ సెల్ఫీ ఫొటోలను విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చింది. దీనిలో ప్రధాని నరేంద్రమోడీకి పక్కనే కవిత నిలబడిఉన్నారు. అదేవిధంగా పలువురు బీఆర్ ఎస్ నాయకులు కూడా ఈ ఫొటోలో కనిపిస్తున్నారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టిన కాంగ్రెస్ నాయకులు.. ఇది కదా బంధమంటే అని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంరంభానికి ముందు నుంచి బీజేపీకి-బీఆర్ ఎస్కు మధ్య బంధం ఉందనే ప్రచారం చేస్తున్న కాంగ్రెస్కు ఇప్పుడు సెల్ఫీలు అందివచ్చిన వరంగా మారాయని అంటున్నారు పరిశీలకులు. మరి వీటిపై బీఆర్ ఎస్ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 3 స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది థియేటర్లలో మిస్…
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ…
మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం…
విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…
అమెరికానుంచి తరచుగా భారత్కు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. వలస విధానానికి సంబంధించి, హెచ్-1బీ వీసాలకు సంబంధించి కూడా భారత్కు అమెరికా…
ఓ పరామర్శ అయినా, ఓ సాయం అయినా, ఓ ఓదార్పు అయినా, ఓ కేసు అయినా, ఓ పథకం అయినా……