తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఇప్పటికే బీఆర్ ఎస్ పై సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ప్రచారాన్నిముమ్మరం చేసింది. మరోవైపు.. బీజేపీకి బీఆర్ ఎస్ బీ టీం అంటూ ప్రచారం కూడా చేస్తోంది. అందుకే తమప్రచారాల్లో ఎక్కడా బీజేపీని కానీ, ప్రధాని నరేంద్ర మోడీని కానీ బీఆర్ ఎస్ నేతలు విమర్శించడం లేదని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక, ఎంఐఎం, బీఆర్ ఎస్లను బీజేపీ అగ్రనేతలే ఆడిస్తున్నారంటూ..ఇటీవల పెద్ద ఎత్తున కటౌట్లు పెట్టి మరీ ఎన్నికల ప్రచారంలో వేడి రగిలించారు. ఇదిలావుంటే.. తాజాగా కాంగ్రెస్ నేతలు మరో సంచలన విషయాన్ని కూడా బయట పెట్టారు. బీజేపీ అగ్రనేత, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సీఎం కేసీఆర్ తనయ కవిత దిగిన సెల్ఫీలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే.. ఇవి ఎప్పుడు దిగారనేది మాత్రం తెలియాల్సి ఉంది.
కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ఈ సెల్ఫీ ఫొటోలను విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చింది. దీనిలో ప్రధాని నరేంద్రమోడీకి పక్కనే కవిత నిలబడిఉన్నారు. అదేవిధంగా పలువురు బీఆర్ ఎస్ నాయకులు కూడా ఈ ఫొటోలో కనిపిస్తున్నారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టిన కాంగ్రెస్ నాయకులు.. ఇది కదా బంధమంటే అని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంరంభానికి ముందు నుంచి బీజేపీకి-బీఆర్ ఎస్కు మధ్య బంధం ఉందనే ప్రచారం చేస్తున్న కాంగ్రెస్కు ఇప్పుడు సెల్ఫీలు అందివచ్చిన వరంగా మారాయని అంటున్నారు పరిశీలకులు. మరి వీటిపై బీఆర్ ఎస్ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on November 14, 2023 7:19 pm
కరోనా తర్వాత మొదలైన ఓటీటీ విప్లవం వల్ల మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో ఆదరణ పెరిగిందో తెలిసిందే. ఎప్పట్నుంచో…
రేపు విష్ణు విన్యాసం విడుదల కానుంది. కొత్త రిలీజులు ఇంకేం ఉన్నాయనేది పక్కనపెడితే జనాల దృష్టిలో అంతో ఇంతో ఫోకస్…
బేబి షామిలి.. 90వ దశకంతో తెలుగు, తమిళ సినిమాలు చూసిన వాళ్లు అంత సులువుగా మరిచిపోలేని పేరిది. అంజలి, జగదేక…
థియేటర్ ఆక్యుపెన్సీలు తగ్గిపోవడానికి కారణం ఓటిటికి తక్కువ గ్యాప్ ఉండటమే అన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్న వాదన. ఎలాగూ నాలుగు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ?…