ఇపుడీ విషయమే అధికార బీఆర్ఎస్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రచారానికి వెళుతున్న అభ్యర్ధులను కొన్ని నియోజకవర్గాల్లో తమ గ్రామాల్లోకి రావద్దని జనాలు అడ్డుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్ధులు అడుగుపెట్టవద్దని పోస్టర్లు, హోర్డింగులు కూడా పెట్టేస్తున్నారు. ఓట్లడగటానికి కాదు కదా చివరకు ర్యాలీలు, రోడ్డుషోలకు కూడా జనాలు ఒప్పుకోవటం లేదు. ఒకవైపు కేసీఆర్ బహిరంగ సభల పేరుతో రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. 18 రోజుల్లో 43 నియోజకవర్గాల్లో మొదటి విడత ప్రచారం చేశారు.
ఇంకోవైపు అభ్యర్ధులకు, నియోజకవర్గాల ఇన్చార్జిలకు, ద్వితీయ శ్రేణి నేతలకు సమన్వయం కుదరటంలేదు. నేతల మధ్య విభేదాలను సర్దుబాటు చేయాలని మంత్రులు కేటీయార్, హరీష్ రావులు ప్రయత్నిస్తున్నా సాధ్యంకావటంలేదు. కామారెడ్డి నేతల్లోని విభేదాలపై స్వయంగా కేసీయారే మండిపోయారంటే పరిస్ధితి ఎలాగుందో అర్ధమవుతోంది. స్వయంగా కేసీయార్ పోటీచేస్తున్నా కామారెడ్డి నేతలు ఏకతాటిపైకి రాలేదంటే అర్ధమేంటి ? ఇలాంటి అనేక ఘటనలతోనే జనాల ఆగ్రహం అసలు ఎవరిపైన అన్న విషయమే అర్ధంకావటంలేదు.
జనాగ్రహమంతా కేసీయార్ పైన లేకపోతే మంత్రులపైనా అదీ కాదంటే అభ్యర్ధులపైనా అన్న విషయంలోనే క్లారిటి రావటంలేదు. కాంగ్రెస్ నేతలేమో కేసీయార్+అభ్యర్ధులపైన జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని పదేపదే చెబుతున్నారు. బహిరంగసభల్లో కేసీయార్ మాట్లాడుతున్నారన్నమాటే కానీ స్వచ్చంధంగా జనాల్లో స్పందన ఆశించినంత కనబడటంలేదని సమాచారం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వాగ్ధాటితో, బహిరంగసభలకు హాజరవుతున్న జనాల స్పందనతో పోల్చితే కేసీయార్ సభలు తేలిపోతున్నాయి. ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టడమే బీఆర్ఎస్ ఓడిపోతే హ్యాపీగా రెస్టు తీసుకుంటానని కేసీయార్ చెప్పటంతోనే రాంగ్ రూట్లో మొదలైంది.
తర్వాత ఇదే విషయాన్ని రెండు మూడు చోట్ల కేటీయార్ కూడా చెప్పారు. హరీష్ రావు మాట్లాడుతు ప్రభుత్వంలో తప్పులుంటే అధికారంలోకి రాగానే సరిచేసుకుంటామని చెప్పటం బాగా నెగిటివ్ అయ్యింది. తప్పులుంటే సరిచేసుకుంటామని ఇపుడు చెప్పటం ఏమిటి ? పదేళ్ళుగా అధికారంలో ఉన్నది బీఆర్ఎస్సే కదాని జనాలు ఆశ్చర్యపోతున్నారు. అంటే వీళ్ళ మాటల్లోనే అర్ధమైపోతోంది ఓటమి భయం. జనాల్లో కనబడుతున్న వ్యతిరేకతకు తోడు వీళ్ళ భయం మాటలే పార్టీని దెబ్బ తీస్తుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చివరకు జనాల తీర్పు ఎలాగుంటుందో చూడాలి.
This post was last modified on November 15, 2023 8:14 pm
ఎనర్జినే ఇంటి పేరుగా మార్చుకున్న రామ్ కు గత ఏడాది ఆంధ్రకింగ్ తాలూకా ఊహించని షాక్ ఇచ్చింది. కంటెంట్ బాగానే…
రేపు విడుదల కావాల్సిన కేరళ స్టోరీ 2 హఠాత్తుగా వాయిదా పడింది. పలువురు పిటీషనర్లు వేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న…
విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ పూర్తి చేసుకుని కొత్త కాంబో కోసం ఎదురు చూస్తున్న టైంలో దర్శకుడు పూరి జగన్నాథ్…
చిన్న సినిమాలకు రిలీజ్కు ఒక రోజు ముందే పెయిడ్ ప్రిమియర్స్ వేయడం కొన్నేళ్లుగా ట్రెండుగా మారింది. ఆ షోల నుంచి…
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులు ఆందోళనకు…
కరోనా తర్వాత మొదలైన ఓటీటీ విప్లవం వల్ల మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో ఆదరణ పెరిగిందో తెలిసిందే. ఎప్పట్నుంచో…