Political News

పురందేశ్వరి పై విరుచుకుపడ్డ బీజేపీ నేత

ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రిపై ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు.. సుదీర్ఘ‌కాలంగా బీజేపీ, ఆర్ ఎస్ ఎస్‌లో ఉన్న నేత ఏవీ సుబ్బారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పురందేశ్వ‌రి అధికారం కోసం ఎంత‌కైనా దిగ‌జార‌తార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. రాష్ట్ర అధ్య‌క్షురాలు అయిన త‌ర్వాత‌.. ఆమె ఎవ‌రినీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించారు. ఇప్ప‌టికి అనేక సార్లు ఆమెను క‌లిసి పార్టీ ప‌రిస్థితిపై చ‌ర్చించాల‌ని అనుకున్నా.. క‌నీసం అప్పాయింట్‌మెంట్ కూడా ఇవ్వ‌లేద‌ని అన్నారు.

నిజానికి బీజేపీ తొలిసారి ఏపీకి మ‌హిళా అధ్య‌క్షురాలిగా పురందేశ్వ‌రిని నియ‌మించిన నేప‌థ్యంలో తామంతా కూడా..ఆమెను ఘ‌నంగా స‌త్క‌రించామ‌న్నారు. కానీ, ఆమె పార్టీ అధ్య‌క్షురాలు అయిన త‌ర్వాత‌.. పూర్తిగా త‌న వైఖ‌రిని మార్చుకున్నార‌ని.. క‌నీసం పార్టీలో మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న దాడుల‌పై కూడా మాట్లాడ‌డం లేద‌న్నారు. అధికారం కోస‌మే పురందేశ్వ‌రి గ‌తంలో ఎన్టీఆర్‌ను వేధించార‌ని.. టీడీపీని లాక్కునే క్ర‌మంలో ఆమె పాత్ర కూడా ఉంద‌ని ఆరోపించారు.

రాష్ట్ర విభ‌జ‌న‌తో కాంగ్రెస్ ఏపీలో అడ్ర‌స్ లేకుండా పోవ‌డంతో ఇక‌, అక్క‌డ అధికారం ద‌క్క‌ద‌ని భావించి.. త‌న భ‌ర్త‌తో క‌లిసి బీజేపీలో చేరార‌ని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంతో గౌర‌వం ఇచ్చి.. ప‌ద‌వి ఇచ్చిన పార్టీని కూడా కేంద్రంలో అధికారంలోకి రాద‌ని తెలిసిన త‌ర్వాత బీజేపీలో చేరార‌ని విమ‌ర్శించారు. పురందేశ్వ‌రి ని తాము ఘ‌నంగా గౌర‌వించామ‌న్నారు. బీజేపీలో కూడా చిన్న‌మ్మ‌.. చిన్న‌మ్మ అంటూ గౌర‌వించామన్నారు. పురందేశ్వ‌రి ఈ విలువ‌ను నిల‌బెట్టుకోలేద‌ని, బీజేపీలో పురందేశ్వ‌రి వ‌చ్చిన తర్వాతే.. మ‌హిళ‌ల‌కు గౌర‌వం లేకుండా పోయింద‌న్నారు.

జాతీయ పార్టీ బీజేపీలో ఉంటూ.. ఆమె త‌న భ‌ర్త‌ను వైసీపీలో ఎమ్మెల్యేగా పోటీ చేయించార‌ని ఏవీ సుబ్బా రెడ్డి అన్నారు. వైసీపీలో ఎమ్మెల్యేగా పోటీచేసిన పురందేశ్వ‌రి భ‌ర్త‌కు ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఆమె స‌హ‌క‌రించార‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on November 14, 2023 3:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

5 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

6 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

7 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

7 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

8 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

9 hours ago