ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు.. సుదీర్ఘకాలంగా బీజేపీ, ఆర్ ఎస్ ఎస్లో ఉన్న నేత ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పురందేశ్వరి అధికారం కోసం ఎంతకైనా దిగజారతారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర అధ్యక్షురాలు అయిన తర్వాత.. ఆమె ఎవరినీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికి అనేక సార్లు ఆమెను కలిసి పార్టీ పరిస్థితిపై చర్చించాలని అనుకున్నా.. కనీసం అప్పాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని అన్నారు.
నిజానికి బీజేపీ తొలిసారి ఏపీకి మహిళా అధ్యక్షురాలిగా పురందేశ్వరిని నియమించిన నేపథ్యంలో తామంతా కూడా..ఆమెను ఘనంగా సత్కరించామన్నారు. కానీ, ఆమె పార్టీ అధ్యక్షురాలు అయిన తర్వాత.. పూర్తిగా తన వైఖరిని మార్చుకున్నారని.. కనీసం పార్టీలో మహిళలపై జరుగుతున్న దాడులపై కూడా మాట్లాడడం లేదన్నారు. అధికారం కోసమే పురందేశ్వరి గతంలో ఎన్టీఆర్ను వేధించారని.. టీడీపీని లాక్కునే క్రమంలో ఆమె పాత్ర కూడా ఉందని ఆరోపించారు.
రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ ఏపీలో అడ్రస్ లేకుండా పోవడంతో ఇక, అక్కడ అధికారం దక్కదని భావించి.. తన భర్తతో కలిసి బీజేపీలో చేరారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంతో గౌరవం ఇచ్చి.. పదవి ఇచ్చిన పార్టీని కూడా కేంద్రంలో అధికారంలోకి రాదని తెలిసిన తర్వాత బీజేపీలో చేరారని విమర్శించారు. పురందేశ్వరి ని తాము ఘనంగా గౌరవించామన్నారు. బీజేపీలో కూడా చిన్నమ్మ.. చిన్నమ్మ అంటూ గౌరవించామన్నారు. పురందేశ్వరి ఈ విలువను నిలబెట్టుకోలేదని, బీజేపీలో పురందేశ్వరి వచ్చిన తర్వాతే.. మహిళలకు గౌరవం లేకుండా పోయిందన్నారు.
జాతీయ పార్టీ బీజేపీలో ఉంటూ.. ఆమె తన భర్తను వైసీపీలో ఎమ్మెల్యేగా పోటీ చేయించారని ఏవీ సుబ్బా రెడ్డి అన్నారు. వైసీపీలో ఎమ్మెల్యేగా పోటీచేసిన పురందేశ్వరి భర్తకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆమె సహకరించారని వ్యాఖ్యానించారు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…