Political News

వైసీపీ పై టీడీపీ ‘సూపర్ సిక్స్’

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు టీడీపీ-జనసేన మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, అశోక్‌బాబు, పట్టాభి హాజరయ్యారు. జనసేన తరఫున వరప్రసాద్‌, ముత్తా శశిధర్‌, శరత్‌ కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఆల్రెడీ ప్రతిపాదించిన 6 అంశాలకు తోడు జనసేన ప్రతిపాదించిన 5 అంశాలను కలిపి 11 అంశాలతో మినీ మేనిఫెస్టోను రూపొందించామని యనమల వెల్లడించారు.

ఈ మినీ మేనిఫెస్టోకు కమిటీ ఆమోదం తెలిపిందని అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా స్టార్టప్ సంస్థల ఏర్పాటుకు రూ. 10లక్షల వరకూ సబ్సిడీ, ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు, అమరావతే రాజధానిగా కొనసాగింపు.. పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం వంటివి మినీ మేనిఫెస్టోలో చేర్చామని చెప్పారు. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన పై ప్రాథమిక చర్చలు జరిగాయని చెప్పారు. టీడీపీ నుంచి సూపర్ సిక్స్ పేరుతో మినీ మేనిఫెస్టోపై ప్రజల్లోకి వెళ్తున్నామని యనమల ప్రకటించారు.

సౌభాగ్య పదం పేరుతో యువత వ్యాపారాలకు ఆర్థిక సాయం అందించే అంశాన్ని జనసేన ప్రతిపాదించిందని, సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్రాభివృద్ధికి వ్యూహ రచన చేస్తామని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లులా ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందని, అసమానతలు తొలిగి ఆర్ధిక వ్యవస్థ బాగుపడేలా ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు.

ఈ సందర్భంగా జనసేన- టీడీపీల మధ్య నియోజకవర్గ స్థాయి సమావేశాలు, ఉమ్మడి కార్యక్రమాల నిర్వహణకు జనసేన తరఫున ఇన్చార్జిలను నియమించారు. ఆ ఇన్చార్జిలను ‘పాయింట్ ఆఫ్ కాంటాక్ట్’ గా పరిగణిస్తారు. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులపాటు టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల శ్రేణులు ఎలా కలిసి పని చేయాలి, ఏం చేయాలి అనే విషయాన్ని నియోజకవర్గ స్థాయి నేతలకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లు వివరించబోతున్నారు. ఇక, ఈ నెల 17 నుంచి నియోజకవర్గ స్థాయిలో ఇంటింటికి వెళ్లే కార్యక్రమం కూడా ఈ ఇన్చార్జిల ఆధ్వర్యంలోనే జరగనుంది.

This post was last modified on November 14, 2023 10:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

5 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

6 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

7 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

7 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

8 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

9 hours ago