బీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజుపై దాడి ఘటన సంచలనం రేపిన తెలిసిందే. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ జరగడంతో ఆ గొడవలో బాలరాజుతోపాటు పలువురు బిఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ అపోలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన బాలరాజు మీడియాతో మాట్లాడారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తన తల్లిదండ్రుల మీద ఒట్టేసి చెబుతున్నానని, కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ, ఆయన అనుచరులు రాళ్లతో తనపై దాడి చేశారని సంచలన ఆరోపణలు చేశారు.
ఆయన మీద, ఆయన అనుచరుల మీద చర్యలు తీసుకోవాలని పోలీసులను బాలరాజు కోరారు. గతంలో తన ఆఫీసు మీద కూడా వంశీకృష్ణ దాడి చేశారని ఆరోపించారు. మొన్న కొత్త ప్రభాకర్ రెడ్డిపై, ఈరోజు తనపై దాడి చేశారని, తెలంగాణలో మునుపెన్నడూ లేని కొత్త ఆనవాయితీని తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుచరులను కూడా బెదిరిస్తున్నారని ఆరోపించారు. అయితే, తన అనుచరులు, కార్యకర్తలు తొందరపడవద్దని, సంయమనం పాటించాలని బాలరాజు విజ్ఞప్తి చేశారు.
ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని, కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజాసేవ కోసం పగ, ప్రతీకారాలు లేకుండా పనిచేస్తున్నానని, ఇది పిరికితనంతో చేసిన దాడి అని బాలరాజు అన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా అంతమొందించే కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
This post was last modified on November 12, 2023 10:00 pm
థియేటర్ ఆక్యుపెన్సీలు తగ్గిపోవడానికి కారణం ఓటిటికి తక్కువ గ్యాప్ ఉండటమే అన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్న వాదన. ఎలాగూ నాలుగు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ?…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…