బీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజుపై దాడి ఘటన సంచలనం రేపిన తెలిసిందే. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ జరగడంతో ఆ గొడవలో బాలరాజుతోపాటు పలువురు బిఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ అపోలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన బాలరాజు మీడియాతో మాట్లాడారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తన తల్లిదండ్రుల మీద ఒట్టేసి చెబుతున్నానని, కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ, ఆయన అనుచరులు రాళ్లతో తనపై దాడి చేశారని సంచలన ఆరోపణలు చేశారు.
ఆయన మీద, ఆయన అనుచరుల మీద చర్యలు తీసుకోవాలని పోలీసులను బాలరాజు కోరారు. గతంలో తన ఆఫీసు మీద కూడా వంశీకృష్ణ దాడి చేశారని ఆరోపించారు. మొన్న కొత్త ప్రభాకర్ రెడ్డిపై, ఈరోజు తనపై దాడి చేశారని, తెలంగాణలో మునుపెన్నడూ లేని కొత్త ఆనవాయితీని తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుచరులను కూడా బెదిరిస్తున్నారని ఆరోపించారు. అయితే, తన అనుచరులు, కార్యకర్తలు తొందరపడవద్దని, సంయమనం పాటించాలని బాలరాజు విజ్ఞప్తి చేశారు.
ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని, కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజాసేవ కోసం పగ, ప్రతీకారాలు లేకుండా పనిచేస్తున్నానని, ఇది పిరికితనంతో చేసిన దాడి అని బాలరాజు అన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా అంతమొందించే కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
This post was last modified on November 12, 2023 10:00 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…