బీఆర్ ఎస్ ఎమ్మెల్యే, నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజవకర్గంఅధికార పార్టీ అభ్యర్థి గువ్వల బాలరాజుపై జరిగిన రాళ్ల దాడి ఘటనను మంత్రి కేటీఆర్ ఖండించారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న బాలరాజును ఆయన పరామర్శించారు. అనంతరం.. మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మేమే మళ్లీ అధికారంలోకి వస్తాం. అప్పుడు మీ అంతు చూస్తాం.. ఇంత కింత తప్పదు అని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీపై ప్రతీకారం తీర్చుకుంటామని కూడా కుండబద్దలు కొట్టారు కేటీఆర్. బాలరాజు కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని చెప్పారు. బీఆర్ఎస్ కు వస్తున్న ప్రజాదరణ ఓర్వలేకే తమపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. “ఉద్యమ కాలంలో ఎన్నో దాడుల్ని తట్టుకుని బాలరాజు నిలబడ్డారు. ఆయన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దు. ప్రజాప్రతినిధులకు సెక్యూరిటీ పెంచాలని డీజీపీని కోరుతాం. అచ్చంపేట కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ తన అనుచరులతో ఆయనపై దాడి చేశారు. ఇంతకింత తీర్చుకుంటాం“ అని కేటీఆర్ మరోసారి హెచ్చరించారు.
రాష్ట్రంలో దాడుల సంస్కృతి మంచిదికాదని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. బాలరాజు సతీమణి అమలను కూడా కించపరిచేలా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చేది మా ప్రభుత్వమే. దాడులకు పాల్పడిన వారిపై రివేంజ్ తీర్చుకుంటాం. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి. దళితబిడ్డపై కాంగ్రెస్ దాడులు చేస్తే.. ఆ పార్టీ అణగారిన వర్గాలకు ఇస్తున్న గౌరవమేంటి? దళితులకు మేం బంధువులగా ఉంటే.. వారు శతృవులుగా వ్యవహరిస్తున్నారు అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
This post was last modified on November 12, 2023 3:55 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…