తెలంగాణలో ఎన్నికల ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతంగా సాగిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల సారథి రేవంత్ రెడ్డే బాగా హైలైట్ అవుతున్నారు. ఓవైపు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ.. మరోవైపు మీడియా చర్చల్లో పాల్గొంటూ చాలా బిజీగా గడుపుతున్నాడు రేవంత్ రెడ్డి. చాలా అగ్రెసివ్గా ఉండే రేవంత్.. ప్రత్యర్థులు తన మీద చేసే విమర్శలపై స్పందించే తీరే వేరుగా ఉంటుంది.
ఈ మధ్య ఒక టీవీ చర్చలో ఓటుకు నోటు కేసు గురించి ప్రస్తావిస్తే.. ఆ కేసు తనకో మెడల్ లాంటిది అని వ్యాఖ్యానించడం రేవంత్కే చెల్లింది. ఇక ఒక ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. కేసీఆర్ను ఉద్దేశించి ఆయన మాట్లాడిన బూతు మాట హాట్ టాపిక్ అయింది. ఇంకో టీవీ చర్చా కార్యక్రమంలో కేటీఆర్ను ‘ఫాల్తు గాడు’ అనేశాడు రేవంత్.
ఈ ఎన్నికల హడావుడి మొదలైన దగ్గర్నుంచి రేవంత్ రెడ్డి ఒక కొత్త పేరు ఖాయం చేశారు ప్రత్యర్థులు. కోట్ల రూపాయలకు టికెట్లు అమ్ముకున్నాడంటూ రేవంత్ను విమర్శిస్తూ ఆయన్ని ‘రేటెంత రెడ్డి’ అని సెటైరిక్గా పిలుస్తున్న సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో ఈ పేరు బాగా పాపులర్ అయింది. ఒక టీవీ చర్చా కార్యక్రమంలో ఇదే విషయం ప్రస్తావించి.. మిమ్మల్ని రేటెంత రెడ్డి అంటున్నారు, దీనిపై మీరేమంటారు అని అడిగితే.. “సంతోష పడతా. నా పేరు పలకక తప్పదు. శత్రువైనా, మిత్రుడైనా ఎవ్వడైనా” అని రేవంత్ అన్నాడు.
రేట్లు ఉన్నందుకే మీ పేరు ‘రేటెంత రెడ్డి’ అయిందా అని దీనికి కొనసాగింపుగా ఒక ప్రశ్న వేస్తే.. “అంత డిమాండ్ ఉన్నదని అర్థం. రాష్ట్రంలో ఏది జరిగినా నా చుట్టూనే తిరగాలి. అప్పుడే నాకు ఆనందం వస్తది. దిష్టి బొమ్మ తగలబెట్టడం అనుకో. ఆరోపణలు చేయడం అనుకో. టికెట్లు ఇవ్వడం అనుకో. టికెట్ వచ్చినోడు నా పేరే చెప్పుకోవాలి. టికెట్ రానోడూ నా పేరే చెప్పుకోవాలి” అని రేవంత్ అన్నాడు.
This post was last modified on November 11, 2023 3:16 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…