Political News

జ‌న‌సేన‌-టీడీపీ పొత్తు… ఏపీ ఓట‌రు తీరు మారుతోంది..!

వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డిగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతామ‌ని ప్ర‌క‌టించిన జ‌న‌సేన‌-టీడీపీల వ్యూహం ఫ‌లించే అవ‌కాశం ఉంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఎందుకంటే.. ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాలు చేసేందుకు మ‌రో పార్టీ లేక‌పోవ‌డం.. రాష్ట్రంలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. దీంతో జ‌న‌సేన‌-టీడీపీల బంధంపైనే ఇప్పుడు చ‌ర్చ సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని అధికారం నుంచి దింపేస్తామ‌నే వాద‌ననుజ‌న‌సేన బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లిన విష‌యం తెలిసిందే.

ముఖ్యంగా ప‌వ‌న్ అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు.. ఈ విష‌యంలో అలెర్ట్‌గానే ఉన్నారు. ఇక‌, టీడీపీ కూడా .. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవాలంటే.. ఖ‌చ్చితంగా జ‌న‌సేన‌తో క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న ద‌రిమిలా.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు విభేదాల‌తో న‌డిచిన రాజ‌కీయాలు ఇప్పుడు స‌ర్దుకుపోతున్నాయి. దీంతో క‌లివిడిగా.. ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా అనంత‌పురం, క‌ర్నూలు వంటి జిల్లాల్లో జ‌న‌సేన అభ్య‌ర్థుల‌ను క‌లుపుకొని పోతున్నారు.

ఇది మంచి సంకేతాల‌ను ఇస్తోంది. ఇక‌, రాష్ట్రంలోని విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ జ‌న‌సేన‌తో క‌లిసి పోటీ చేసేందుకు ఇక్క‌డి నాయ‌కులు కూడా రెడీగానే ఉన్నారు. తాజాగా నిర్వ‌హించిన కొన్ని ఆన్‌లైన్ స‌ర్వేలు ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా క్షేత్ర‌స్థాయిలో అభిమానులు క‌లిసి ప‌నిచేసేందుకు రెడీగా ఉన్నార‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ఇక‌, గ్రామీణ స్థాయిలో మాత్రం.. ఇంకా పొత్తుల విష‌యంపై ఒక అవ‌గాహ‌న ఏర్ప‌డ‌లేదు.

కీల‌క‌మైన గ్రామీణ స్థాయిలో ఓట‌ర్ల‌ను కూడా ఈ రెండు పార్టీలూ క‌దిలించే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేయాల్సిన అస‌వ‌రం ఉంది. లేక‌పోతే.. గ్రామీణ ఓటు బ్యాంకు చీలిపోయే అవ‌కాశం ఉంద‌ని మెజారిటీ నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక‌, పొత్తుతో క‌లిసి వ‌చ్చేందుకు క‌మ్యూనిస్టులు కూడా రెడీగానే ఉన్నారు. అయితే.. వీరు బీజేపీని ప‌క్క‌న పెడుతున్నారు. బీజేపీ లేకుండా ఉంటే.. జ‌న‌సేన‌-టీడీపీ-క‌మ్యూనిస్టులు క‌లిసి పోటీ చేయాల‌నేది వ్యూహం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Satya

Recent Posts

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

53 minutes ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

1 hour ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

2 hours ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

4 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

6 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

12 hours ago