Political News

జ‌న‌సేన‌-టీడీపీ పొత్తు… ఏపీ ఓట‌రు తీరు మారుతోంది..!

వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డిగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతామ‌ని ప్ర‌క‌టించిన జ‌న‌సేన‌-టీడీపీల వ్యూహం ఫ‌లించే అవ‌కాశం ఉంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఎందుకంటే.. ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాలు చేసేందుకు మ‌రో పార్టీ లేక‌పోవ‌డం.. రాష్ట్రంలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. దీంతో జ‌న‌సేన‌-టీడీపీల బంధంపైనే ఇప్పుడు చ‌ర్చ సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని అధికారం నుంచి దింపేస్తామ‌నే వాద‌ననుజ‌న‌సేన బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లిన విష‌యం తెలిసిందే.

ముఖ్యంగా ప‌వ‌న్ అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు.. ఈ విష‌యంలో అలెర్ట్‌గానే ఉన్నారు. ఇక‌, టీడీపీ కూడా .. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవాలంటే.. ఖ‌చ్చితంగా జ‌న‌సేన‌తో క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న ద‌రిమిలా.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు విభేదాల‌తో న‌డిచిన రాజ‌కీయాలు ఇప్పుడు స‌ర్దుకుపోతున్నాయి. దీంతో క‌లివిడిగా.. ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా అనంత‌పురం, క‌ర్నూలు వంటి జిల్లాల్లో జ‌న‌సేన అభ్య‌ర్థుల‌ను క‌లుపుకొని పోతున్నారు.

ఇది మంచి సంకేతాల‌ను ఇస్తోంది. ఇక‌, రాష్ట్రంలోని విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ జ‌న‌సేన‌తో క‌లిసి పోటీ చేసేందుకు ఇక్క‌డి నాయ‌కులు కూడా రెడీగానే ఉన్నారు. తాజాగా నిర్వ‌హించిన కొన్ని ఆన్‌లైన్ స‌ర్వేలు ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా క్షేత్ర‌స్థాయిలో అభిమానులు క‌లిసి ప‌నిచేసేందుకు రెడీగా ఉన్నార‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ఇక‌, గ్రామీణ స్థాయిలో మాత్రం.. ఇంకా పొత్తుల విష‌యంపై ఒక అవ‌గాహ‌న ఏర్ప‌డ‌లేదు.

కీల‌క‌మైన గ్రామీణ స్థాయిలో ఓట‌ర్ల‌ను కూడా ఈ రెండు పార్టీలూ క‌దిలించే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేయాల్సిన అస‌వ‌రం ఉంది. లేక‌పోతే.. గ్రామీణ ఓటు బ్యాంకు చీలిపోయే అవ‌కాశం ఉంద‌ని మెజారిటీ నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక‌, పొత్తుతో క‌లిసి వ‌చ్చేందుకు క‌మ్యూనిస్టులు కూడా రెడీగానే ఉన్నారు. అయితే.. వీరు బీజేపీని ప‌క్క‌న పెడుతున్నారు. బీజేపీ లేకుండా ఉంటే.. జ‌న‌సేన‌-టీడీపీ-క‌మ్యూనిస్టులు క‌లిసి పోటీ చేయాల‌నేది వ్యూహం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on November 11, 2023 1:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

27 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago