Political News

జ‌న‌సేన‌-టీడీపీ పొత్తు… ఏపీ ఓట‌రు తీరు మారుతోంది..!

వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డిగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతామ‌ని ప్ర‌క‌టించిన జ‌న‌సేన‌-టీడీపీల వ్యూహం ఫ‌లించే అవ‌కాశం ఉంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఎందుకంటే.. ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాలు చేసేందుకు మ‌రో పార్టీ లేక‌పోవ‌డం.. రాష్ట్రంలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. దీంతో జ‌న‌సేన‌-టీడీపీల బంధంపైనే ఇప్పుడు చ‌ర్చ సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని అధికారం నుంచి దింపేస్తామ‌నే వాద‌ననుజ‌న‌సేన బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లిన విష‌యం తెలిసిందే.

ముఖ్యంగా ప‌వ‌న్ అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు.. ఈ విష‌యంలో అలెర్ట్‌గానే ఉన్నారు. ఇక‌, టీడీపీ కూడా .. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవాలంటే.. ఖ‌చ్చితంగా జ‌న‌సేన‌తో క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న ద‌రిమిలా.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు విభేదాల‌తో న‌డిచిన రాజ‌కీయాలు ఇప్పుడు స‌ర్దుకుపోతున్నాయి. దీంతో క‌లివిడిగా.. ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా అనంత‌పురం, క‌ర్నూలు వంటి జిల్లాల్లో జ‌న‌సేన అభ్య‌ర్థుల‌ను క‌లుపుకొని పోతున్నారు.

ఇది మంచి సంకేతాల‌ను ఇస్తోంది. ఇక‌, రాష్ట్రంలోని విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ జ‌న‌సేన‌తో క‌లిసి పోటీ చేసేందుకు ఇక్క‌డి నాయ‌కులు కూడా రెడీగానే ఉన్నారు. తాజాగా నిర్వ‌హించిన కొన్ని ఆన్‌లైన్ స‌ర్వేలు ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా క్షేత్ర‌స్థాయిలో అభిమానులు క‌లిసి ప‌నిచేసేందుకు రెడీగా ఉన్నార‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ఇక‌, గ్రామీణ స్థాయిలో మాత్రం.. ఇంకా పొత్తుల విష‌యంపై ఒక అవ‌గాహ‌న ఏర్ప‌డ‌లేదు.

కీల‌క‌మైన గ్రామీణ స్థాయిలో ఓట‌ర్ల‌ను కూడా ఈ రెండు పార్టీలూ క‌దిలించే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేయాల్సిన అస‌వ‌రం ఉంది. లేక‌పోతే.. గ్రామీణ ఓటు బ్యాంకు చీలిపోయే అవ‌కాశం ఉంద‌ని మెజారిటీ నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక‌, పొత్తుతో క‌లిసి వ‌చ్చేందుకు క‌మ్యూనిస్టులు కూడా రెడీగానే ఉన్నారు. అయితే.. వీరు బీజేపీని ప‌క్క‌న పెడుతున్నారు. బీజేపీ లేకుండా ఉంటే.. జ‌న‌సేన‌-టీడీపీ-క‌మ్యూనిస్టులు క‌లిసి పోటీ చేయాల‌నేది వ్యూహం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on November 11, 2023 1:49 pm

Share

Recent Posts

మంగాపురం కుర్రాడికి మంగళవారం పాఠం

సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…

35 minutes ago

అప్పుడు ఒప్పు.. ఇప్పుడు తప్పు.. ఇదేం న్యాయం జగన్?

త్వ‌ర‌లోనే ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు తెర‌దీయ‌నున్నారు. సెప్టెంబ‌రు-అక్టోబ‌రు మ‌ధ్య మునిసిపాలిటీ… న‌వంబ‌రు-డిసెంబ‌రు మ‌ధ్య కార్పోరేష‌న్లు, జ‌న‌వ‌రిలో పంచాయ‌తీ ఎన్నిక‌లు…

38 minutes ago

సెలెక్టర్లకు షమీ కనపడడం లేదా?

శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…

1 hour ago

మార్క్ మామా… మోదీజీకి సారీ చెప్పాల్సిందే

ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్‌బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…

2 hours ago

పైసా ప్రమోషన్ లేకుండా స్పైడర్‌మ్యాన్ బీభత్సం

గత నెల మధ్యలో ‘ది ఒడిస్సీ’ సినిమా రిలీజ్ టైంలో ఎంత హడావుడి నెలకొందో చూశాం. ప్రస్తుతం వరల్డ్ సినిమా…

3 hours ago

క్రేజీ దర్శకుడు హీరో అయితే సౌండ్ లేదేంటి

లోకేష్ కనగరాజ్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఖైదీతో మొదలైన ఇతని ప్రభంజనం విక్రమ్ దాకా ఓ రేంజ్ లో…

3 hours ago