Political News

ధరణి వివాదంలో కేసీయార్ ఇరుక్కున్నారా ?

తెలంగాణా ఎన్నికల్లో పార్టీలు ప్రస్తావిస్తున్న అనేక అంశాల్లో ధరణి పోర్టల్ కూడా ఒకటి. రైతుల వ్యవసాయ భూమితో పాటు మామూలు జనాలకు ఉండే ప్లాట్ల వివరాలు కూడా ధరణి పోర్టల్లో నమోదవుతున్నాయి. ధరణి పోర్టలంతా తప్పుల తడకని కాంగ్రెస్ గోల చేస్తోంది. ఈ పోర్టల్లో లక్షలాది మంది భూయజమానులకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ నేతలు పదేపదే ఆరోపిస్తున్నారు. అందుకనే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని పదేపదే ప్రకటిస్తోంది.

అయితే ధరణిపోర్టల్ భూయజమాలకు అద్భుతమని కేసీయార్, మంత్రులు కేటీయార్, హరీష్ రావులు ఎదురుదాడులు చేస్తున్నారు. భూ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్ సంజీవని మందు లాంటిదని కేసీయార్, కేటీఆర్, హరీష్ పదేపదే చెబుతున్నారు. ధరణిని రద్దుచేస్తామని చెబుతున్న కాంగ్రెస్ కు ఓట్లేస్తారా అని కేసీయార్ నిలదీస్తున్నారు. వీళ్ళ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలాగున్నా తాజాగా ఒక విషయం బయటపడింది. అదేమిటంటే ధరణిపోర్టల్ లో కేసీయార్ భూ వివరాలే తప్పుగా నమోదయ్యాయని. కేసీయార్ కు ఉండాల్సిన దానికన్నా ఒక గుంట భూమి ఎక్కువగా నమోదైంది.

ఈ విషయం అఫిడవిట్లో స్వయంగా కేసీయారే అంగీకరించటం గమనార్హం. లక్షలాది మంది యజమాల భూవివరాలను ఉండాల్సిన దానికన్నా తక్కువ రికార్డు చేస్తున్నపోర్టల్ కేసీయార్ కు మాత్రం ఒక గుంట ఎక్కువగా రికార్డు ఎలా చేసిందని జనాలు నిలదీస్తున్నారు. పైగా ఎక్కువగా నమోదైన ఒక గుంటను తీసేసి వివరాలను ఫ్రెష్ గా నమోదచేయాలని మూడేళ్ళుగా అడుగుతున్నా రికార్డులు సరిచేయలేదని అఫిడవిట్లో కేసీయారే అంగీకరించారు.

పాస్ బుక్ ప్రకారం ఉండాల్సిన 53 ఎకరాల 30 గుంటలకు గాను ధరణిపోర్టల్లో 53 ఎకరాల 31 గుంటలుగా నమోదైనట్లు కేసీయార్ అంగీకరించారు. ముఖ్యమంత్రి భూ వివరాలను తప్పుగా నమోదోచేసిన ధరణి పోర్టల్ ఇక సామాన్య జనాల భూవివరాలను ఇంకెన్ని తప్పులతో రికార్డు చేస్తుందో చూడాలని జనాల్లో చర్చలు మొదలైపోయాయి. నిజానికి పోర్టల్లో భూ వివరాలు తప్పులు దొర్లినట్లు లక్షలాది మంది భూయజమానాలు మొత్తుకుంటున్నా కరెక్షన్లు జరగటంలేదు. ఇపుడు పోర్టల్లో తప్పులు కేసీయార్ అఫిడవిట్లోనే బయటపడ్డాయి. మరి దీనికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఏమని సమాధానం చెబుతారో చూడాలి.

This post was last modified on November 11, 2023 6:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

27 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

3 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago