తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బతగిలింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి కాంగ్రెస్కు గుడ్బై చెప్పారు. గత కొన్నాళ్లుగా పార్టీలో యాక్టివ్ గానే ఉన్నప్పటికీ.. ఆమెకు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆమె అలకబూనారు. ఈ క్రమంలో కీలక నేతలు ఆమెను బుజ్జగిస్తారనే చర్చ సాగింది. కానీ, ఎవరూ పాల్వాయి స్రవంతిని పట్టించుకోలేదు.
దీంతో ఆమె పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకున్నారు. దీనిపై బహిరంగంగానే చర్చకు పెట్టారు. అయినా కూడా కాంగ్రెస్ నేతలు ఆమెను పట్టించుకున్న దాఖలా కనిపించలేదు. ఈ క్రమంలో తాఆజగా కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె రెండు పేజీల మేరకు రిజైన్ లెటర్ రాశారు. పార్టీలో తన తండ్రి ఎప్పటి నుంచి సేవలు అందించారు. తాను పార్టీ కోసం ఎలాకష్టపడిందీ ఆమె వివరించారు. అంతేకాదు.. మునుగోడులో ఉద్దేశ పూర్వకంగా నే కొందరు తనను ఓడించారని ఆమె విమర్శించారు.
కాగా.. తాజాగా ఆమె బీఆర్ ఎస్ కండువా కప్పుకొనేందుకు సిద్ధమయ్యారు. గత ఏడాది జరిగిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో పాల్వాయి స్రవంతి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే.. ఆ ఎన్నికలోఆమె ఓడిపోయారు. ఇదిలావుంటే, మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి.. తిరిగి కాంగ్రెస్లోకి రావడం, ఆ వెంటనే ఆయనకు ఈ సీటును ఖరారు చేయడం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలోనే స్రవంతి కాంగ్రెస్కు గుడ్బై చెప్పడం గమనార్హం.
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…