తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బతగిలింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి కాంగ్రెస్కు గుడ్బై చెప్పారు. గత కొన్నాళ్లుగా పార్టీలో యాక్టివ్ గానే ఉన్నప్పటికీ.. ఆమెకు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆమె అలకబూనారు. ఈ క్రమంలో కీలక నేతలు ఆమెను బుజ్జగిస్తారనే చర్చ సాగింది. కానీ, ఎవరూ పాల్వాయి స్రవంతిని పట్టించుకోలేదు.
దీంతో ఆమె పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకున్నారు. దీనిపై బహిరంగంగానే చర్చకు పెట్టారు. అయినా కూడా కాంగ్రెస్ నేతలు ఆమెను పట్టించుకున్న దాఖలా కనిపించలేదు. ఈ క్రమంలో తాఆజగా కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె రెండు పేజీల మేరకు రిజైన్ లెటర్ రాశారు. పార్టీలో తన తండ్రి ఎప్పటి నుంచి సేవలు అందించారు. తాను పార్టీ కోసం ఎలాకష్టపడిందీ ఆమె వివరించారు. అంతేకాదు.. మునుగోడులో ఉద్దేశ పూర్వకంగా నే కొందరు తనను ఓడించారని ఆమె విమర్శించారు.
కాగా.. తాజాగా ఆమె బీఆర్ ఎస్ కండువా కప్పుకొనేందుకు సిద్ధమయ్యారు. గత ఏడాది జరిగిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో పాల్వాయి స్రవంతి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే.. ఆ ఎన్నికలోఆమె ఓడిపోయారు. ఇదిలావుంటే, మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి.. తిరిగి కాంగ్రెస్లోకి రావడం, ఆ వెంటనే ఆయనకు ఈ సీటును ఖరారు చేయడం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలోనే స్రవంతి కాంగ్రెస్కు గుడ్బై చెప్పడం గమనార్హం.
ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం 1999లో విడుదలైన ది మమ్మీ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా కల్ట్ ఫాలోయింగ్ ఉంది. రెండో భాగంగా…
ఏ బ్యాగ్రౌండ్ లేని ఒక కొత్త కుర్రాడు.. లుక్స్ పరంగా చూస్తే హీరోలా అనిపించడు.. అలాంటోడు తొలి చిత్రంతోనే వంద…
లోక్ సభలో ఒక చారిత్రాత్మక బిల్లుపై ఓటింగ్ జరిగింది. అనూహ్యంగా ఎన్డీఏ ఓటింగ్ లో ఓటమి ఫాలయింది. నియోజకవర్గాల పునర్విభజన,…
టాలీవుడ్ స్టార్ హీరోలు స్టేజ్ ఎక్కితే చాలు, ఇకపై ఏడాదికి రెండు మూడు సినిమాలు పక్కా అని ఫ్యాన్స్కు హామీ…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నోట నుంచి వస్తున్న వ్యాఖ్యలు... తాను వదిలేసి వచ్చిన బీఆర్ఎస్…
డీలిమిటేషన్, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు లోక్ సభలో వీగిపోయిన నేపథ్యంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఆ విశ్లేషణలన్నింటిలో ఒకటి మాత్రం…