తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బతగిలింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి కాంగ్రెస్కు గుడ్బై చెప్పారు. గత కొన్నాళ్లుగా పార్టీలో యాక్టివ్ గానే ఉన్నప్పటికీ.. ఆమెకు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆమె అలకబూనారు. ఈ క్రమంలో కీలక నేతలు ఆమెను బుజ్జగిస్తారనే చర్చ సాగింది. కానీ, ఎవరూ పాల్వాయి స్రవంతిని పట్టించుకోలేదు.
దీంతో ఆమె పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకున్నారు. దీనిపై బహిరంగంగానే చర్చకు పెట్టారు. అయినా కూడా కాంగ్రెస్ నేతలు ఆమెను పట్టించుకున్న దాఖలా కనిపించలేదు. ఈ క్రమంలో తాఆజగా కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె రెండు పేజీల మేరకు రిజైన్ లెటర్ రాశారు. పార్టీలో తన తండ్రి ఎప్పటి నుంచి సేవలు అందించారు. తాను పార్టీ కోసం ఎలాకష్టపడిందీ ఆమె వివరించారు. అంతేకాదు.. మునుగోడులో ఉద్దేశ పూర్వకంగా నే కొందరు తనను ఓడించారని ఆమె విమర్శించారు.
కాగా.. తాజాగా ఆమె బీఆర్ ఎస్ కండువా కప్పుకొనేందుకు సిద్ధమయ్యారు. గత ఏడాది జరిగిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో పాల్వాయి స్రవంతి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే.. ఆ ఎన్నికలోఆమె ఓడిపోయారు. ఇదిలావుంటే, మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి.. తిరిగి కాంగ్రెస్లోకి రావడం, ఆ వెంటనే ఆయనకు ఈ సీటును ఖరారు చేయడం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలోనే స్రవంతి కాంగ్రెస్కు గుడ్బై చెప్పడం గమనార్హం.
కాజల్ అగర్వాల్.. ఒకప్పుడు టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్. సిమ్రన్ తర్వాత ఆ స్థాయిలో ఆధిపత్యం చూపించిన హీరోయిన్ ఆమెనే.…
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ…
ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను…
ఎప్పుడూ ట్విట్టర్ లో, బయట హడావిడి చేసే ఎలన్ మస్క్ ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఆయనకి ఆయనగా…
తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…
ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…