నిర్విరామంగా తెలంగాణా ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న కేసీయార్ మూడురోజులు బ్రేక్ తీసుకున్నారు. ఈ బ్రేక్ ఎందుకంటే వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ప్రచారసరళి ఎలాగుంది, పార్టీ గెలుపు అవకాశాలు ఎంతున్నాయి ? గెలుపుకు అనుసరించాల్సిన వ్యూహాలు ఏమిటనే విషయాలను పార్టీ ముఖ్యులతో చర్చించి సరికొత్త వ్యూహాలు రచించేందుకేనట. రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ పోటీపైన ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఇందుకోసమే శుక్ర, శని, ఆదివారాలు పూర్తిగా ఫాం హౌస్ కే పరిమితమయ్యారు.
పీసీసీ ప్రెసిడెంట్ పోటీ చేస్తున్న కామారెడ్డి, కొడంగల్, బీజేపీ సిట్టింగ్ ఎంఎల్ఏ ఈటల రాజేందర్ పోటీచేస్తున్న గజ్వేల్, హుజూరాబాద్ నియోజకవర్గాలతో పాటు మరికొందరు ప్రత్యర్ధిపార్టీల నేతల నియోజకవర్గాలపై ప్రత్యేకంగా కేసీయార్ దృష్టి పెట్టినట్లు సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్ధిపార్టీల అభ్యర్ధులను ఓడించేందుకు ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే విషయాలను మంత్రులు కేటీయార్, హరీష్ రావు తదితరులతో చర్చించనున్నారు. అక్బోటర్ 15వ తేదీన హుస్నాబాద్ నియోజకవర్గం బహిరంగసభతో కేసీయార్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
గురువారం వరకు మొత్తం 43 బహిరంగసభల్లో పాల్గొన్నారు. దీపావళి పండుగ తర్వాత 13వ తేదీ నుండి 28 వరకు 54 బహిరంగసభలు నిర్వహించబోతున్నారు. సగటున రోజుకు కేసీయార్ 3 నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు బహిరంగసభల మీదే దృష్టిపెట్టిన కేసీయార్ 18వ తేదీన చేర్యాలలో భారీ రోడ్డుషో పై దృష్టిపెట్టారు. ఈ రోడ్డుషో ఫీడ్ బ్యాక్ ఆధారంగా మరిన్ని నియోజకవర్గాల్లో రోడ్డుషోలకు ప్లాన్ చేయాలని నిర్ణయించారు. రేవంత్, ఈటలను వీలైనంత వరకు వాళ్ళు పోటీచేస్తున్న కొడంగల్, గజ్వేల్, కామారెడ్డి, హుజూరాబాద్ నియోజకవర్గాలకే పరిమితం చేసేట్లుగా కేసీయార్ వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఈ వ్యూహాలు రేవంత్ విషయంలో పెద్దగా వర్కవుటయ్యేట్లు కనబడటంలేదు.
ఎందుకంటే పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ తెలంగాణా అంతా విస్తృతంగా పర్యటన చేయక తప్పదు. అందుకనే తాను పోటీచేస్తున్న కొడంగల్, కామారెడ్డిలో ప్రచారం విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ముందుగానే చేసుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్ధుల గెలుపుకు ఇప్పటికే పార్టీపరంగా ప్రతి నియోజకవర్గంలోను ఏర్పాటుచేసిన వార్ రూముల ఫీడ్ బ్యాక్ నే కేసీయార్ ఎక్కువగా నమ్ముతున్నారట. దానికి అనుగుణంగానే చర్యలు తీసుకునే బాధ్యతలను కేటీయార్, హరీష్ రావులకు అప్పగించారు.
This post was last modified on November 11, 2023 1:30 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…