తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి కావొచ్చు.. లేదా బీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిననాటి నుంచి కావొచ్చు.. ఇప్పటి వరకు ఆయన ఏ ఎన్నికల్లో అయినా కేవలం ఒకే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఎంపీగా గతంలో పోటీ చేసినా.. ఎమ్మెల్యేగా పోటీ చేసినా.. ఆయన ఏదో ఒక స్థానాన్ని మాత్రమే ఎంచుకుని అక్కడ నుంచి తలపడుతున్నారు.
కానీ, తెలంగాణ ప్రస్తుత ఎన్నికల్లో గతానికి భిన్నంగా కేసీఆర్ రెండు నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నారు. ఒకటి తను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం కాగా, రెండో తొలిసారి తలపడుతున్న కామారె డ్డి. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ రాజకీయాలు గరంగరంగా సాగుతున్నాయి. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ నుంచి బలమైన నాయకులే.. కేసీఆర్పై తలపడుతుండడం గమనార్హం.
దీంతో కేసీఆర్ రెండు నియోకవర్గాల్లోనూ శక్తికి మించి శ్రమపడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గజ్వేల్లో చేసిన అభివృద్ధిని చెప్పుకొంటున్నారు. 2014 నుంచి ఇక్కడ జరిగిన మంచిని, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ఏకరువు పెడుతున్నారు. ఇక, కామారెడ్డిలో సెంటిమెంటును పండిస్తున్నారు. ఇది తన తల్లి జన్మస్తానమని, దీనితో తనకు పేగు బంధం ఉందని ఆయన చెబుతున్నారు.
అంతేకాదు.. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ గెలుపు కోసం.. ఆయన క్షేత్రస్థాయి నాయకులను ఏకం చేస్తున్నారు. నిరంతరం మానిటరింగ్ కూడా చేస్తున్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ తరఫున రేవంత్ పోటీ చేయడం, గజ్వేల్ నుంచి బీజేపీ ఫైర్ బ్రాండ్ ఈటల రాజేందర్ తలపడుతుండడంతో వారి దూకుడును సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యూహాలకు కేసీఆర్ పదును పెంచుతున్నారు. ఇద్దరూ బలమైన నాయకులు కావడంతోపాటు.. సామాజిక వర్గాల పరంగా కూడా ప్రభావం చూపించే అవకాశం ఉండడంతో కేసీఆర్ ఈ రెండు చోట్లా చెమటోడుస్తున్నారనే చెప్పాలని అంటున్నారు బీఆర్ ఎస్ నాయకులు.
This post was last modified on November 10, 2023 10:29 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…