ప్రశ్నలు వేయటానికి ముడుపులు తీసుకున్న ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు వేయాలని ఎథిక్స్ కమిటి సిఫారసు చేసింది. ఆ సిఫారసుల రిపోర్టు శుక్రవారం లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు అందబోతోంది. ఎథిక్స్ కమిటి ఛైర్మన్, సభ్యులు తమ రిపోర్టుతో స్పీకర్ ను కలవబోతున్నారు. ఇప్పటికే మొయిత్రాకు వ్యతిరేకంగా 500 పేజీల రిపోర్టును తయారైంది. ఎంపీపై అనర్హత వేటు వేయాలని ముందుగా అనుకున్నా తాజాగా బహిష్కరణ వేటు వేయాలని కమిటి 6:4 ఓట్లతో ఆమోదించింది. దాంతో ఎంపీపై బహిష్కరణ విషయంలో ఎథిక్స్ కమిటి చాలా పట్టుదలగా ఉన్న విషయం అర్ధమవుతోంది.
నిజానికి ప్రశ్నలు వేయటానికి ఎంపీలు ముడుపులు తీసుకోవటం అన్నది నైతికత కిందకు మాత్రమే వస్తుంది. తీసుకోవచ్చు లేదా తీసుకోకూడదన్న విషయమై ఎలాంటి చట్టంలేదు. ప్రశ్నలు వేయటానికి ముడుపులు తీసుకున్నట్లు నిర్ధారణ అయితే వెంటనే సదరు ఎంపీపై చర్యలు తీసుకోవాలని ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఎక్కడా లేదు. ఎంతమంది ఎంపీలు ప్రశ్నలు వేయటానికి ముడుపులు తీసుకుంటున్నారో తెలీదు కానీ మొయిత్రా విషయంలో మాత్రం బయటపడింది.
ప్రశ్నలు వేసినందుకు డబ్బులు తీసుకున్నా వస్తురూపంలో తీసుకున్నా ముడుపులు ముడుపులే అనటంలో సందేహంలేదు. కాకపోతే ఇక్కడ మొయిత్రా విషయంలో ఏమి జరుగుతోంది ? ఏమి జరుగుతోందంటే ప్రభుత్వాన్ని గడచిన నాలుగున్నరేళ్ళుగా లోక్ సభలో మొయిత్రా ముప్పుతిప్పలు పెడుతోంది. నరేంద్రమోడీ ప్రభుత్వంపై మహువా ఓ రేంజిలో విరుచుకుపడుతున్నారు. దాంతో మోడీ ప్రభుత్వం, బీజేపీ మొయిత్రాపై బాగా మండిపోతోంది. అయితే ఎంపీని ఏమి చేయలేక మౌనంగా భరిస్తోంది.
సరిగ్గా ఇలాంటి పరిస్ధితుల్లోనే ప్రశ్నలకు ముడుపులు అనే వివాదంలో మొయిత్రా ఇరుక్కున్నారు. పైగా ఎథిక్స్ కమిటి విచారణలో ప్రశ్నలు వేసినందుకు తాను పారిశ్రామికవేత్త హీరానందాని నుండి మేకప్ కిట్ అందుకున్నట్లు అంగీకరించారు. ప్రచారం జరుగుతున్నట్లు తాను డబ్బులు తీసుకోలేదని కేవలం మేకప్ కిట్లు, లిప్ స్టిక్స్ మాత్రమే తీసుకున్నట్లు అంగీకరించారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే మొయిత్రాకు మాత్రమే పరిమితమవ్వాల్సిన ఎంపీ లాగిన్, పాస్ వర్డ్ హీరానందనీ చేతికి వెళ్ళింది. ఆయన దుబాయ్ నుండి పార్లమెంటు పోర్టల్లో అనేక ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలన్నీ ఎంపీనే వేస్తున్నారని అనుకుని పార్లమెంటు సెక్రటేరియట్ కూడా జవాబులిచ్చింది. తర్వాత అర్ధమైంది ఎంపీ వేయటంలేదని. ఇవన్నీ కలిసి ఇపుడు ఎంపీ మెడకు చుట్టుకుంది. చివరకు ఏమవుతుందో చూడాలి.
This post was last modified on November 10, 2023 2:51 pm
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ?…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…