ప్రశ్నలు వేయటానికి ముడుపులు తీసుకున్న ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు వేయాలని ఎథిక్స్ కమిటి సిఫారసు చేసింది. ఆ సిఫారసుల రిపోర్టు శుక్రవారం లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు అందబోతోంది. ఎథిక్స్ కమిటి ఛైర్మన్, సభ్యులు తమ రిపోర్టుతో స్పీకర్ ను కలవబోతున్నారు. ఇప్పటికే మొయిత్రాకు వ్యతిరేకంగా 500 పేజీల రిపోర్టును తయారైంది. ఎంపీపై అనర్హత వేటు వేయాలని ముందుగా అనుకున్నా తాజాగా బహిష్కరణ వేటు వేయాలని కమిటి 6:4 ఓట్లతో ఆమోదించింది. దాంతో ఎంపీపై బహిష్కరణ విషయంలో ఎథిక్స్ కమిటి చాలా పట్టుదలగా ఉన్న విషయం అర్ధమవుతోంది.
నిజానికి ప్రశ్నలు వేయటానికి ఎంపీలు ముడుపులు తీసుకోవటం అన్నది నైతికత కిందకు మాత్రమే వస్తుంది. తీసుకోవచ్చు లేదా తీసుకోకూడదన్న విషయమై ఎలాంటి చట్టంలేదు. ప్రశ్నలు వేయటానికి ముడుపులు తీసుకున్నట్లు నిర్ధారణ అయితే వెంటనే సదరు ఎంపీపై చర్యలు తీసుకోవాలని ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఎక్కడా లేదు. ఎంతమంది ఎంపీలు ప్రశ్నలు వేయటానికి ముడుపులు తీసుకుంటున్నారో తెలీదు కానీ మొయిత్రా విషయంలో మాత్రం బయటపడింది.
ప్రశ్నలు వేసినందుకు డబ్బులు తీసుకున్నా వస్తురూపంలో తీసుకున్నా ముడుపులు ముడుపులే అనటంలో సందేహంలేదు. కాకపోతే ఇక్కడ మొయిత్రా విషయంలో ఏమి జరుగుతోంది ? ఏమి జరుగుతోందంటే ప్రభుత్వాన్ని గడచిన నాలుగున్నరేళ్ళుగా లోక్ సభలో మొయిత్రా ముప్పుతిప్పలు పెడుతోంది. నరేంద్రమోడీ ప్రభుత్వంపై మహువా ఓ రేంజిలో విరుచుకుపడుతున్నారు. దాంతో మోడీ ప్రభుత్వం, బీజేపీ మొయిత్రాపై బాగా మండిపోతోంది. అయితే ఎంపీని ఏమి చేయలేక మౌనంగా భరిస్తోంది.
సరిగ్గా ఇలాంటి పరిస్ధితుల్లోనే ప్రశ్నలకు ముడుపులు అనే వివాదంలో మొయిత్రా ఇరుక్కున్నారు. పైగా ఎథిక్స్ కమిటి విచారణలో ప్రశ్నలు వేసినందుకు తాను పారిశ్రామికవేత్త హీరానందాని నుండి మేకప్ కిట్ అందుకున్నట్లు అంగీకరించారు. ప్రచారం జరుగుతున్నట్లు తాను డబ్బులు తీసుకోలేదని కేవలం మేకప్ కిట్లు, లిప్ స్టిక్స్ మాత్రమే తీసుకున్నట్లు అంగీకరించారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే మొయిత్రాకు మాత్రమే పరిమితమవ్వాల్సిన ఎంపీ లాగిన్, పాస్ వర్డ్ హీరానందనీ చేతికి వెళ్ళింది. ఆయన దుబాయ్ నుండి పార్లమెంటు పోర్టల్లో అనేక ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలన్నీ ఎంపీనే వేస్తున్నారని అనుకుని పార్లమెంటు సెక్రటేరియట్ కూడా జవాబులిచ్చింది. తర్వాత అర్ధమైంది ఎంపీ వేయటంలేదని. ఇవన్నీ కలిసి ఇపుడు ఎంపీ మెడకు చుట్టుకుంది. చివరకు ఏమవుతుందో చూడాలి.
This post was last modified on November 10, 2023 2:51 pm
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సినిమా సినిమాకు తన మార్కెట్ రేంజ్ ను మరో లెవెల్ కు తీసుకు వెళుతున్నాడు.…
బాలయ్య అభిమానులు ఎదురుచూసే కొద్దీ దూరం వెళ్తున్నాడు మోక్షజ్ఞ. ఎప్పుడెప్పుడాని వెయిట్ చేస్తుంటే ఇప్పుడప్పుడే కాదనే తరహాలో ఇస్తున్న సంకేతాలు…
సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు టాలీవుడ్లోనే కాదు, ఇండియన్ సినిమాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. ‘యానిమల్’తో బాక్సాఫీస్ను షేక్ చేసిన…
ఘట్టమనేని మూడో తరం నుంచి వస్తున్న మొదటి వారసుడు జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం టీజర్ ఇటీవలే విడుదలయ్యింది.…
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి కల్ట్ మూవీస్ తో ఒక ప్రత్యేక ముద్ర వేసిన దర్శకుడు తరుణ్…
మూడేళ్ల ముందు పాన్ ఇండియ ా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. అదేమీ బ్యాడ్…