టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో రూ. 341 కోట్ల మేరకు అవినీతి చేశారంటూ.. అరెస్టు చేయడం.. అనంతరం ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచడం తెలిసిందే. అయితే.. దీనికి సంబంధించి బెయిల్ కోరుతూ.. చంద్రబాబు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే రెండు విడతలు విచారణ జరిగింది. తనపై అక్రమ కేసు పెట్టారని చంద్రబాబు తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు.
సీనియర్ రాజకీయ నాయకుడు, పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని గతంలో జరిగిన వాదనల్లో బాబు తరఫున న్యాయ వాది వాదించారు. అదేసమయంలో ఆయన అనారోగ్య సమస్యలను కూడా కోర్టుకు వివరించారు. ఇక, ఈ విషయంలో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించాల్సింది. దీనికి గాను పిటిషన్పై విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.
తాజాగా ఈ పిటిషన్ విచారణకు రాగా.. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించాల్సిన అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి కోర్టుకు హాజరుకాలేదు. అనారోగ్య సమస్యలు తలెత్తడంతో పొన్నవోలు హాజరు కాలేక పోయారని.. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు మరికొంత గడువు కావాలని.. ఆయన తరఫున న్యాయవాది అభ్యర్థించారు. దీంతో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ప్రభుత్వ వాదనల కోసం.. ఈ నెల 15 వరకు విచారణ వాయిదా వేస్తూ.. హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఇదిలావుంటే.. ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో, కంటికి ఆపరేషన్ నిమిత్తం చంద్రబాబు మధ్యంతర బెయిల్పై ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులోనే హైకోర్టు ఆయనకు నాలుగు వారాల పాటు.. మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల చంద్రబాబు కుడి కంటికి శుక్లాల ఆపరేషన్ చేసిన విషయం తెలిసిందే.
This post was last modified on November 10, 2023 1:31 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…