Political News

ఆ 10 కోట్లు ఎవ‌రి ఖాతాలోవి?

ప‌ది కోట్లు.. ప్ర‌భుత్వాల విష‌యంలో ఏమంత పెద్ద ఎమౌంట్ కాక‌పోవ‌చ్చు. కానీ, ఎన్నిక‌ల వేళ ప‌ది ల‌క్ష‌లై నా కూడా రాజ‌కీయంగా ప్ర‌భావం చూపుతుంది. దీంతో సొమ్ముపై ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ నిఘా ఎప్పుడూ ఉంటుం ది. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితే ఏపీలోనూ క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం వైసీపీ ప్ర‌భుత్వం “వై ఏపీ నీడ్స్ జ‌గ‌న్” (ఏపీకి జ‌గ‌నే ఎందుకు కావాలి) అనే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది.

ఈ కార్య‌క్ర‌మం పూర్తిగా వైసీపీకి చెందినదే!. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి సీఎంగా జ‌గ‌న్‌కు ఎందుకు అవ‌కా శం ఇవ్వాలి? ఆయ‌న ఇప్పుడు చేస్తున్న కార్య‌క్ర‌మాలు, అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు, ఏయే కుటుంబాల‌కు ఎంత ల‌బ్ధి చేకూరింది? వంటి వివ‌రాల‌ను ప్ర‌జ‌ల‌కు చేర‌వేసి.. త‌ద్వారా వారిని త‌మ‌వైపు తిప్పుకోవాల‌నే ది ప్ర‌ధాన ఉద్దేశం. అంతేకాదు.. ఉయ్ నీడ్ జ‌గ‌న్‌(జ‌గ‌న్ మాకు అవ‌స‌రం) అని ప్ర‌జ‌ల‌తో అనిపించుకోవా లనే కాన్సెప్టు కూడా ఉంది.

మొత్తంగా ఇది పార్టీ కార్య‌క్ర‌మం. అయితే.. దీనిలో అధికారుల‌ను సీఎం జ‌గ‌న్ ఇన్వాల్వ్ చేశారు. క‌లెక్ట‌ర్ల నుంచి ఉన్న‌తాధికారుల వ‌ర‌కు క్షేత్ర‌స్థాయిలో గ్రామ అధికారుల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మాన్ని ప‌ది రోజుల పాటు నిర్వ‌హించాల‌ని నిర్దేశించారు. మొత్తానికి ఈ కార్య‌క్ర‌మం కూడా ప్రారంభ‌మైంది. అయితే.. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి 24 పేజీల‌తో ముద్రించిన బ్రోచ‌ర్ ఇప్పుడు వివాదానికి దారితీసింది. ఈ బ్రోచ‌ర్ రూపొందించేందుకు ప్ర‌భుత్వం రూ.10 కోట్ల‌పైచిలుకు వ్య‌యం చేసింద‌ని బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.

ఆ వెంట‌నే ఈ విష‌యాన్ని కేంద్రానికి స‌మాచారం కూడా ఇచ్చిన‌ట్టు స‌మాచారం. దీంతో ఎన్నిక‌ల సీజ‌న్ కావ‌డం, వ‌చ్చే ఎన్నిక‌ల్లో మెరుగైన ఫ‌లితం కోసం బీజేపీ కూడా ఎదురు చూస్తున్న నేప‌థ్యంలో లెక్క‌లు తేల్చాలంటూ.. రాష్ట్ర నేత‌లు డిమాండ్ చేశారు. ఈ ప‌రిణామాల‌పై రూ.10 కోట్లు ఎవ‌రి ఖాతాలోవి? అంటూ.. కేంద్రం ఆఘ‌మేఘాల‌పై ఆరా తీయ‌డం ప్రారంభించింది. మ‌రి దీనికి వైసీపీ ఏం చెబుతుందో చూడాలి. ఇప్ప‌టికే కేంద్రం ఇస్తున్న నిధుల‌ను దారిమ‌ళ్లిస్తున్నారని.. మీ పేరు వేసుకుంటున్నార‌ని.. బీజేపీ పెద్ద‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నేప‌థ్యంలో తాజా ప‌రిణామం రాజ‌కీయ వివాదంగా మారింది.

This post was last modified on November 10, 2023 11:24 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

25 minutes ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

2 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

7 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

8 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

8 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

8 hours ago