Political News

వైసీపీలో లీడ‌ర్ల‌కు రెస్ట్‌.. ఇక ప్ర‌చారం డ్యూటీ వాళ్ల‌దే…!

ఏపీ వైసీపీలో ఇదే మాట వినిపిస్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అలుపెర‌గ‌కుండా ప్ర‌జ‌ల మ‌ధ్య ఉన్న నాయ కులు.. ప్ర‌జ‌ల ఇంటింటి చుట్టూ తిరిగిన నాయ‌కులు అనేక మంది ఉన్నారు. కొంద‌రు తూతూ మంత్రంగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన మిగిలిన వారు చాలా మంది మ‌న‌సు పెట్టారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం, మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్ కానీ, వైనాట్ 175 కానీ.. ఇలా అనేక కార్య‌క్ర‌మాలు వైసీపీ ఎమ్మెల్యేలు చేశారు. చేస్తున్నారు.

అయితే.. ఇప్పుడు వారికి కాస్త రెస్ట్ దొరికింద‌నే టాక్ వైసీపీలో వినిపిస్తోంది. ఎందుకంటే.. ఇక‌, వైసీపీ ప్ర‌చార బాధ్య‌త‌ను నాయ‌కులు చూడాల్సిన అవ‌స‌రం లేదు. అధికారులే చూసుకుంటారు. గురువారం నుంచి రాష్ట్రంలో వై జ‌గ‌న్ నీడ్స్ ఏపీ (ఏపీకి జ‌గ‌నే ఎందుకు కావాలి) అనే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మం క్షేత్ర‌స్థాయిలో అన్ని జిల్లాల‌లోనూ జ‌ర‌గ‌నుంది.

ఇక‌, ఈ కార్య‌క్ర‌మానికి.. నాయ‌కుల‌తో సంబంధం లేదు. వారు కూడా పాల్గొన‌రు. ఎక్క‌డిక‌క్క‌డ డిప్యూటీ క‌లెక్ట‌ర్ నుంచి క‌లెక్ట‌ర్ వ‌ర‌కు, త‌హ‌సీల్దార్ నుంచి రెవెన్యూ ఉద్యోగుల వ‌ర‌కు వారే పాల్గొంటారు. ప్ర‌భుత్వం ఏ కుటుంబానికి ఎంత ఖ‌ర్చు చేసింది? ఏ కులానికి, ఏ మతానికి ఈ నాలుగున్న‌రేళ్ల కాలంలో వెచ్చించింది? వ‌చ్చే ఆరు మాసాల కాలంలో ఇంకెత సొమ్ము కేటాయించ‌నుంది? ఒక్క‌క్క కుటుంబానికీ జ‌రిగిన ల‌బ్ధి ఎంత‌? జ‌గ‌న్ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యాలు ఏవి? అనే విష‌యాల‌ను అధికారులు పూస గుచ్చిన‌ట్టు వివ‌రించ‌నున్నారు.

దీంతో ఇప్ప‌టి వ‌రకు అలుపెర‌గ‌కుండా.. ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉన్న ఎమ్మెల్యేలు, ఇంచార్జ్‌ల‌కు ఒకింత రెస్ట్ దొరుకుతుంద‌నే చ‌ర్చ వైసీపీలో ఉంది. నిజానికి ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను నాయ‌కుల క‌న్నా అధికారులు చెబితేనే స‌క్సెస్ అయిన సంద‌ర్భాలు ఒక‌టి రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇది వాస్త‌వానికి గుజ‌రాత్ ఫార్ములా అని అంటారు. అక్క‌డ బీజేపీ ప్ర‌భుత్వం అధికారుల‌ను రంగంలోకి దింపి.. ఇదే చేస్తోంది. ఇప్పుడు కేంద్రంలోని మోడీ కూడా.. సీనియ‌ర్ అధికారుల‌తో పార్టీ కార్య‌క్ర‌మాల‌ను గోప్యంగా నిర్వ‌హిస్తున్నారు. మొత్తానికి ఈ ప‌రిణామంతో వైసీపీ నేత‌ల‌కు విరామం ల‌భిస్తుందా? లేదా? అనేది చూడాలి.

This post was last modified on November 9, 2023 8:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago