Political News

వైసీపీలో లీడ‌ర్ల‌కు రెస్ట్‌.. ఇక ప్ర‌చారం డ్యూటీ వాళ్ల‌దే…!

ఏపీ వైసీపీలో ఇదే మాట వినిపిస్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అలుపెర‌గ‌కుండా ప్ర‌జ‌ల మ‌ధ్య ఉన్న నాయ కులు.. ప్ర‌జ‌ల ఇంటింటి చుట్టూ తిరిగిన నాయ‌కులు అనేక మంది ఉన్నారు. కొంద‌రు తూతూ మంత్రంగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన మిగిలిన వారు చాలా మంది మ‌న‌సు పెట్టారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం, మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్ కానీ, వైనాట్ 175 కానీ.. ఇలా అనేక కార్య‌క్ర‌మాలు వైసీపీ ఎమ్మెల్యేలు చేశారు. చేస్తున్నారు.

అయితే.. ఇప్పుడు వారికి కాస్త రెస్ట్ దొరికింద‌నే టాక్ వైసీపీలో వినిపిస్తోంది. ఎందుకంటే.. ఇక‌, వైసీపీ ప్ర‌చార బాధ్య‌త‌ను నాయ‌కులు చూడాల్సిన అవ‌స‌రం లేదు. అధికారులే చూసుకుంటారు. గురువారం నుంచి రాష్ట్రంలో వై జ‌గ‌న్ నీడ్స్ ఏపీ (ఏపీకి జ‌గ‌నే ఎందుకు కావాలి) అనే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మం క్షేత్ర‌స్థాయిలో అన్ని జిల్లాల‌లోనూ జ‌ర‌గ‌నుంది.

ఇక‌, ఈ కార్య‌క్ర‌మానికి.. నాయ‌కుల‌తో సంబంధం లేదు. వారు కూడా పాల్గొన‌రు. ఎక్క‌డిక‌క్క‌డ డిప్యూటీ క‌లెక్ట‌ర్ నుంచి క‌లెక్ట‌ర్ వ‌ర‌కు, త‌హ‌సీల్దార్ నుంచి రెవెన్యూ ఉద్యోగుల వ‌ర‌కు వారే పాల్గొంటారు. ప్ర‌భుత్వం ఏ కుటుంబానికి ఎంత ఖ‌ర్చు చేసింది? ఏ కులానికి, ఏ మతానికి ఈ నాలుగున్న‌రేళ్ల కాలంలో వెచ్చించింది? వ‌చ్చే ఆరు మాసాల కాలంలో ఇంకెత సొమ్ము కేటాయించ‌నుంది? ఒక్క‌క్క కుటుంబానికీ జ‌రిగిన ల‌బ్ధి ఎంత‌? జ‌గ‌న్ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యాలు ఏవి? అనే విష‌యాల‌ను అధికారులు పూస గుచ్చిన‌ట్టు వివ‌రించ‌నున్నారు.

దీంతో ఇప్ప‌టి వ‌రకు అలుపెర‌గ‌కుండా.. ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉన్న ఎమ్మెల్యేలు, ఇంచార్జ్‌ల‌కు ఒకింత రెస్ట్ దొరుకుతుంద‌నే చ‌ర్చ వైసీపీలో ఉంది. నిజానికి ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను నాయ‌కుల క‌న్నా అధికారులు చెబితేనే స‌క్సెస్ అయిన సంద‌ర్భాలు ఒక‌టి రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇది వాస్త‌వానికి గుజ‌రాత్ ఫార్ములా అని అంటారు. అక్క‌డ బీజేపీ ప్ర‌భుత్వం అధికారుల‌ను రంగంలోకి దింపి.. ఇదే చేస్తోంది. ఇప్పుడు కేంద్రంలోని మోడీ కూడా.. సీనియ‌ర్ అధికారుల‌తో పార్టీ కార్య‌క్ర‌మాల‌ను గోప్యంగా నిర్వ‌హిస్తున్నారు. మొత్తానికి ఈ ప‌రిణామంతో వైసీపీ నేత‌ల‌కు విరామం ల‌భిస్తుందా? లేదా? అనేది చూడాలి.

This post was last modified on November 9, 2023 8:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

53 minutes ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

1 hour ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

3 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

3 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

4 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

5 hours ago