ఏపీ వైసీపీలో ఇదే మాట వినిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు అలుపెరగకుండా ప్రజల మధ్య ఉన్న నాయ కులు.. ప్రజల ఇంటింటి చుట్టూ తిరిగిన నాయకులు అనేక మంది ఉన్నారు. కొందరు తూతూ మంత్రంగా కార్యక్రమాలు నిర్వహించిన మిగిలిన వారు చాలా మంది మనసు పెట్టారు. గడపగడపకు మన ప్రభుత్వం, మా నమ్మకం నువ్వే జగన్ కానీ, వైనాట్ 175 కానీ.. ఇలా అనేక కార్యక్రమాలు వైసీపీ ఎమ్మెల్యేలు చేశారు. చేస్తున్నారు.
అయితే.. ఇప్పుడు వారికి కాస్త రెస్ట్ దొరికిందనే టాక్ వైసీపీలో వినిపిస్తోంది. ఎందుకంటే.. ఇక, వైసీపీ ప్రచార బాధ్యతను నాయకులు చూడాల్సిన అవసరం లేదు. అధికారులే చూసుకుంటారు. గురువారం నుంచి రాష్ట్రంలో వై జగన్ నీడ్స్ ఏపీ (ఏపీకి జగనే ఎందుకు కావాలి) అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో అన్ని జిల్లాలలోనూ జరగనుంది.
ఇక, ఈ కార్యక్రమానికి.. నాయకులతో సంబంధం లేదు. వారు కూడా పాల్గొనరు. ఎక్కడికక్కడ డిప్యూటీ కలెక్టర్ నుంచి కలెక్టర్ వరకు, తహసీల్దార్ నుంచి రెవెన్యూ ఉద్యోగుల వరకు వారే పాల్గొంటారు. ప్రభుత్వం ఏ కుటుంబానికి ఎంత ఖర్చు చేసింది? ఏ కులానికి, ఏ మతానికి ఈ నాలుగున్నరేళ్ల కాలంలో వెచ్చించింది? వచ్చే ఆరు మాసాల కాలంలో ఇంకెత సొమ్ము కేటాయించనుంది? ఒక్కక్క కుటుంబానికీ జరిగిన లబ్ధి ఎంత? జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాలు ఏవి? అనే విషయాలను అధికారులు పూస గుచ్చినట్టు వివరించనున్నారు.
దీంతో ఇప్పటి వరకు అలుపెరగకుండా.. ప్రజల మధ్యే ఉన్న ఎమ్మెల్యేలు, ఇంచార్జ్లకు ఒకింత రెస్ట్ దొరుకుతుందనే చర్చ వైసీపీలో ఉంది. నిజానికి ప్రభుత్వ కార్యక్రమాలను నాయకుల కన్నా అధికారులు చెబితేనే సక్సెస్ అయిన సందర్భాలు ఒకటి రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇది వాస్తవానికి గుజరాత్ ఫార్ములా అని అంటారు. అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారులను రంగంలోకి దింపి.. ఇదే చేస్తోంది. ఇప్పుడు కేంద్రంలోని మోడీ కూడా.. సీనియర్ అధికారులతో పార్టీ కార్యక్రమాలను గోప్యంగా నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఈ పరిణామంతో వైసీపీ నేతలకు విరామం లభిస్తుందా? లేదా? అనేది చూడాలి.
This post was last modified on November 9, 2023 8:24 pm
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…
పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…