Political News

నన్ను జైలుకు పంపింది ఎర్రబెల్లి: రేవంత్ రెడ్డి

తెలంగాణ ఎన్నికలకు మరికొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేస్తున్నారు. అదే సమయంలో బీర్ఎస్ నేతలపై కాంగ్రెస నేతలు ప్రతి విమర్శలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలో తాను జైలుకు వెళ్లడానికి ఎర్రబెల్లి దయాకర రావు కారణమని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. గతంలో శత్రువులతో చేతులు కలిపిన ఎర్రబెల్లి టీడీపీకి నమ్మక ద్రోహం చేశాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో దోచుకున్న సొమ్మును ఎర్రబెల్లి అమెరికాలో పెట్టుబడిగా పెడుతున్నాడని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఎర్రబెల్లికి బొంద పెట్టాలని ఓటర్లను, టీడీపీ కార్యకర్తలకు కూడా తాను పిలుపినిస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు.

బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను అంతా గమనిస్తున్నారని, ఆ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. కాంగ్రెస్ నేతల ఇళ్లలో మాత్రమే ఐటీ దాడులు జరుగుతున్నాయని, తమ పార్టీ నేతలను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు ఎందుకు జరగడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

This post was last modified on November 9, 2023 8:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 minutes ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

3 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

5 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

5 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

5 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

6 hours ago