Political News

నన్ను జైలుకు పంపింది ఎర్రబెల్లి: రేవంత్ రెడ్డి

తెలంగాణ ఎన్నికలకు మరికొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేస్తున్నారు. అదే సమయంలో బీర్ఎస్ నేతలపై కాంగ్రెస నేతలు ప్రతి విమర్శలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలో తాను జైలుకు వెళ్లడానికి ఎర్రబెల్లి దయాకర రావు కారణమని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. గతంలో శత్రువులతో చేతులు కలిపిన ఎర్రబెల్లి టీడీపీకి నమ్మక ద్రోహం చేశాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో దోచుకున్న సొమ్మును ఎర్రబెల్లి అమెరికాలో పెట్టుబడిగా పెడుతున్నాడని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఎర్రబెల్లికి బొంద పెట్టాలని ఓటర్లను, టీడీపీ కార్యకర్తలకు కూడా తాను పిలుపినిస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు.

బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను అంతా గమనిస్తున్నారని, ఆ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. కాంగ్రెస్ నేతల ఇళ్లలో మాత్రమే ఐటీ దాడులు జరుగుతున్నాయని, తమ పార్టీ నేతలను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు ఎందుకు జరగడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

This post was last modified on November 9, 2023 8:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

58 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

4 hours ago