Political News

త‌క్ష‌ణం.. 4 వేల పింఛ‌న్‌.. కాంగ్రెస్ హామీ!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సామాజిక పింఛ‌న్ పెంపుద‌ల ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌చార అస్త్రంగా మారిపోయింది. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌కు ముందే అధికార బీఆర్ ఎస్ పార్టీ దీనిపై ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. తాము అధికారంలో మ‌ళ్లీ వ‌స్తే.. పింఛ‌నును ఏటా రూ.500 చొప్పున పెంచుకుంటూ.. ఐదేళ్లు పూర్త‌య్యేనాటికి రూ.5000 చేస్తామ‌ని బీఆర్ ఎస్ అధినేత ప్ర‌క‌టించారు. అయితే.. దీనిపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఏపీ సీఎం జ‌గ‌న్ ను ఆయ‌న అనుస‌రిస్తున్నార‌నే వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. దీంతో దీని ప్ర‌చారాన్ని త‌గ్గించారు. అయినా.. సైలెంట్‌గా దీనిపై క్షేత్ర‌స్థాయిలో ప్ర‌చారం చేస్తున్నారు.

ఇక‌, ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ కూడా పింఛ‌న్ వ్య‌వ‌హారాన్ని తెర‌మీదికి తెచ్చింది. దీనిపై పూర్తిస్థాయిలో అంత‌ర్గ‌త చ‌ర్చ‌లు పూర్తి చేసిన ద‌రిమిలా.. తాజాగా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పింఛ‌న్‌పై సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. “వారు(బీఆర్ ఎస్‌) మీకు ఏడాదికి ముష్టేస్తామంటున్నారు” అని తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన రేవంత్ తాము.. అధికారంలోకి వ‌చ్చిన త‌క్ష‌ణం సామాజిక పించ‌న్‌ను రూ.4000 అమ‌లు చేసి తొలి మాసం నుంచే అందిస్తామ‌ని చెప్పారు. రాజేంద్రనగర్‌లో కాంగ్రెస్ నిర్వ‌హించిన‌ ప్రజా విజయభేరి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.

తెలంగాణలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని, తాగుడులో తెలంగాణను నంబర్‌ వన్‌ చేశారని రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఎందరికి ఇచ్చారని, కాంగ్రెస్‌ సునామీలో బీఆర్ ఎస్‌ కొట్టుకుపోతుందని రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూ.4 వేలు పెన్షన్‌ ఇస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. తాము తెలంగాణ స‌మాజం బాగు కోరుకుంటున్నామ‌ని.. వారు ఆస్తులు పెంచుకుంటున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. పింఛ‌న్ పెంచే బాధ్య‌త‌ను తాను తీసుకుంటాన‌ని రేవంత్ చెప్పారు.

Satya

Recent Posts

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

48 minutes ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

2 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

4 hours ago

నేను హోమ్ మినిస్టర్ కాకపోవడమే నేరస్తుల అదృష్టం: పవన్

ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…

5 hours ago

సెన్సార్ చిక్కులు చిన్న సినిమాలకేనా

వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…

6 hours ago

పింక్ శారీలో రాశి.. చూపు తిప్పుకోవడం కష్టమే!

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…

7 hours ago