తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక పింఛన్ పెంపుదల ఇప్పుడు ప్రధాన ప్రచార అస్త్రంగా మారిపోయింది. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే అధికార బీఆర్ ఎస్ పార్టీ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తాము అధికారంలో మళ్లీ వస్తే.. పింఛనును ఏటా రూ.500 చొప్పున పెంచుకుంటూ.. ఐదేళ్లు పూర్తయ్యేనాటికి రూ.5000 చేస్తామని బీఆర్ ఎస్ అధినేత ప్రకటించారు. అయితే.. దీనిపై విమర్శలు వచ్చాయి. ఏపీ సీఎం జగన్ ను ఆయన అనుసరిస్తున్నారనే వాదన తెరమీదికి వచ్చింది. దీంతో దీని ప్రచారాన్ని తగ్గించారు. అయినా.. సైలెంట్గా దీనిపై క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు.
ఇక, ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ కూడా పింఛన్ వ్యవహారాన్ని తెరమీదికి తెచ్చింది. దీనిపై పూర్తిస్థాయిలో అంతర్గత చర్చలు పూర్తి చేసిన దరిమిలా.. తాజాగా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పింఛన్పై సంచలన ప్రకటన చేశారు. “వారు(బీఆర్ ఎస్) మీకు ఏడాదికి ముష్టేస్తామంటున్నారు” అని తీవ్ర వ్యాఖ్యలు చేసిన రేవంత్ తాము.. అధికారంలోకి వచ్చిన తక్షణం సామాజిక పించన్ను రూ.4000 అమలు చేసి తొలి మాసం నుంచే అందిస్తామని చెప్పారు. రాజేంద్రనగర్లో కాంగ్రెస్ నిర్వహించిన ప్రజా విజయభేరి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
తెలంగాణలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని, తాగుడులో తెలంగాణను నంబర్ వన్ చేశారని రేవంత్రెడ్డి సీఎం కేసీఆర్పై మండిపడ్డారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎందరికి ఇచ్చారని, కాంగ్రెస్ సునామీలో బీఆర్ ఎస్ కొట్టుకుపోతుందని రేవంత్రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూ.4 వేలు పెన్షన్ ఇస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. తాము తెలంగాణ సమాజం బాగు కోరుకుంటున్నామని.. వారు ఆస్తులు పెంచుకుంటున్నారని దుయ్యబట్టారు. పింఛన్ పెంచే బాధ్యతను తాను తీసుకుంటానని రేవంత్ చెప్పారు.
This post was last modified on November 8, 2023 10:35 pm
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…