తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక పింఛన్ పెంపుదల ఇప్పుడు ప్రధాన ప్రచార అస్త్రంగా మారిపోయింది. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే అధికార బీఆర్ ఎస్ పార్టీ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తాము అధికారంలో మళ్లీ వస్తే.. పింఛనును ఏటా రూ.500 చొప్పున పెంచుకుంటూ.. ఐదేళ్లు పూర్తయ్యేనాటికి రూ.5000 చేస్తామని బీఆర్ ఎస్ అధినేత ప్రకటించారు. అయితే.. దీనిపై విమర్శలు వచ్చాయి. ఏపీ సీఎం జగన్ ను ఆయన అనుసరిస్తున్నారనే వాదన తెరమీదికి వచ్చింది. దీంతో దీని ప్రచారాన్ని తగ్గించారు. అయినా.. సైలెంట్గా దీనిపై క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు.
ఇక, ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ కూడా పింఛన్ వ్యవహారాన్ని తెరమీదికి తెచ్చింది. దీనిపై పూర్తిస్థాయిలో అంతర్గత చర్చలు పూర్తి చేసిన దరిమిలా.. తాజాగా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పింఛన్పై సంచలన ప్రకటన చేశారు. “వారు(బీఆర్ ఎస్) మీకు ఏడాదికి ముష్టేస్తామంటున్నారు” అని తీవ్ర వ్యాఖ్యలు చేసిన రేవంత్ తాము.. అధికారంలోకి వచ్చిన తక్షణం సామాజిక పించన్ను రూ.4000 అమలు చేసి తొలి మాసం నుంచే అందిస్తామని చెప్పారు. రాజేంద్రనగర్లో కాంగ్రెస్ నిర్వహించిన ప్రజా విజయభేరి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
తెలంగాణలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని, తాగుడులో తెలంగాణను నంబర్ వన్ చేశారని రేవంత్రెడ్డి సీఎం కేసీఆర్పై మండిపడ్డారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎందరికి ఇచ్చారని, కాంగ్రెస్ సునామీలో బీఆర్ ఎస్ కొట్టుకుపోతుందని రేవంత్రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూ.4 వేలు పెన్షన్ ఇస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. తాము తెలంగాణ సమాజం బాగు కోరుకుంటున్నామని.. వారు ఆస్తులు పెంచుకుంటున్నారని దుయ్యబట్టారు. పింఛన్ పెంచే బాధ్యతను తాను తీసుకుంటానని రేవంత్ చెప్పారు.
This post was last modified on November 8, 2023 10:35 pm
ఐతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లే ఉంటుంది బాక్సాఫీస్ వ్యవహారం. సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమలు రిలీజయ్యాయి. కానీ తర్వాతి…
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…