Political News

‘నాట్ బిఫోర్ మీ’.. జ‌గ‌న్ కేసులో ఏపీ హైకోర్టు

‘నాట్ బిఫోర్ మీ’- ఈ మాట ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా వినిపిస్తోంది. సుప్రీంకోర్టుల నుంచి హైకోర్టుల వ‌ర‌కు కూడా.. న్యాయ మూర్తులు ప‌లు కేసుల విచార‌ణ నుంచి దూరం జ‌రుగుతున్నారు. గ‌తంలో ఆయా కేసుల‌కు సంబందించిన పిటిష‌న‌ర్ల త‌ర‌ఫున వీరు న్యాయ వాదులుగా వాదించ‌డ‌మో.. లేక గ‌తంలో ఈ కేసుల‌ను న్యాయ‌మూర్తుల‌గా ఉండి విచార‌ణ చేయ‌డ‌మో.. నేప‌థ్యంలో న్యాయ‌మూర్తులు ఇలా నాట్ బిఫోర్ మీ అనే ఫార్ములాను వినియోగిస్తున్నార‌ని న్యాయ వ‌ర్గాలు చెబుతున్నాయి.

తాజాగా ఏపీ హైకోర్టు సీఎం జ‌గ‌న్‌కు సంబంధించిన ఓ కేసులో న్యాయ‌మూర్తి ఇలానే త‌ప్పుకొన్నారు. ఏపీ సీఎం నేతృత్వంలోని రాష్ట్ర ప్ర‌భుత్వం.. జ‌గన్‌కు, ఆయ‌న కుటుంబానికి, బందుగ‌ణానికి ల‌బ్ది చేకూర్చేలా నిర్ణ‌యాలు తీసుకుంద‌ని దీనివ‌ల్ల ప్ర‌జాధ‌నం త‌రిగిపోతోంద‌ని ఆరోపిస్తూ.. వైసీపీ రెబ‌ల్ ఎంపీ క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు హైకోర్టును ఆశ్ర‌యించారు. దీనిని సీబీఐతో విచార‌ణ జ‌రిపించాల‌ని ఆయ‌న కోరారు. ఈ పిటిష‌న్ తాజాగా మంగ‌ళ‌వారం విచార‌ణ‌కు వ‌చ్చింది.

అయితే, ఈ పిటిష‌న్‌ను ప‌రిశీలించిన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ర‌ఘునంద‌న‌రావు.. నాట్ బిఫోర్‌మీ అంటూ.. వైదొలిగారు. ఈ పిటిష‌న్‌ను వేరే బెంచ్‌కు బ‌దిలీ చేసేలా ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి సూచించాల‌ని ఆయ‌న రిజిస్ట్రీని ఆదేశించారు. దీంతో ఈ కేసు విచార‌ణ వేరే బెంచ్‌కు బ‌దిలీ కానుంది. ఇదిలావుంటే, రాష్ట్రంలో ఓట‌ర్ల అవ‌క‌త‌వ‌క‌ల‌కు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖ‌లైన పిటిష‌న్ విచార‌ణ‌లోనూ ఇలానే జ‌రిగింది. ఈ కేసు విచార‌ణ నుంచి సుప్రీం న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా వైదొలిగారు. గ‌తంలో ఈయ‌న ఏపీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ప‌నిచేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 8, 2023 3:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

12 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

42 minutes ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

2 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

3 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago