‘నాట్ బిఫోర్ మీ’- ఈ మాట ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తోంది. సుప్రీంకోర్టుల నుంచి హైకోర్టుల వరకు కూడా.. న్యాయ మూర్తులు పలు కేసుల విచారణ నుంచి దూరం జరుగుతున్నారు. గతంలో ఆయా కేసులకు సంబందించిన పిటిషనర్ల తరఫున వీరు న్యాయ వాదులుగా వాదించడమో.. లేక గతంలో ఈ కేసులను న్యాయమూర్తులగా ఉండి విచారణ చేయడమో.. నేపథ్యంలో న్యాయమూర్తులు ఇలా నాట్ బిఫోర్ మీ అనే ఫార్ములాను వినియోగిస్తున్నారని న్యాయ వర్గాలు చెబుతున్నాయి.
తాజాగా ఏపీ హైకోర్టు సీఎం జగన్కు సంబంధించిన ఓ కేసులో న్యాయమూర్తి ఇలానే తప్పుకొన్నారు. ఏపీ సీఎం నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం.. జగన్కు, ఆయన కుటుంబానికి, బందుగణానికి లబ్ది చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుందని దీనివల్ల ప్రజాధనం తరిగిపోతోందని ఆరోపిస్తూ.. వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. దీనిని సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఈ పిటిషన్ తాజాగా మంగళవారం విచారణకు వచ్చింది.
అయితే, ఈ పిటిషన్ను పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ రఘునందనరావు.. నాట్ బిఫోర్మీ అంటూ.. వైదొలిగారు. ఈ పిటిషన్ను వేరే బెంచ్కు బదిలీ చేసేలా ప్రధాన న్యాయమూర్తికి సూచించాలని ఆయన రిజిస్ట్రీని ఆదేశించారు. దీంతో ఈ కేసు విచారణ వేరే బెంచ్కు బదిలీ కానుంది. ఇదిలావుంటే, రాష్ట్రంలో ఓటర్ల అవకతవకలకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణలోనూ ఇలానే జరిగింది. ఈ కేసు విచారణ నుంచి సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వైదొలిగారు. గతంలో ఈయన ఏపీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం గమనార్హం.
దురంధర్ తర్వాత రామ్ చరణ్ మెచ్చుకున్న బాలీవుడ్ మూవీ ఇటీవలే విడుదలైన బేబి దో డై దో. టైటిల్ విచిత్రంగా…
ఏపీలో యూట్యూబర్ ప్రశ్న రావణ్ వ్యాఖ్యలు, ఆ తర్వాత అతడి అరెస్టులపై పెద్ద రచ్చే కొనసాగుతోంది. తాజాగా ఈ విషయంపై…
పెద్ది థియేటర్ రన్ ముగిసిపోయిన కథ. రేపు అర్ధరాత్రి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఇక…
గత కొన్ని వారాల నుంచి సోషల్ మీడియాని ఊపేస్తున్న మాట ఓజి 2. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ హ్యాండిల్…
టాలీవుడ్లో ఎప్పుడూ ఒక పద్ధతి ప్రకారం, డెడ్ లైన్స్ పెట్టుకుని పని చేసే హీరో నేచురల్ స్టార్ నాని. చెప్పిన డేటుకు సినిమాను…
చేతి కళను మాత్రమే కాదు... ఆ చేతుల వెనుక ఉన్న జీవితాలను కూడా స్పృశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.…