‘నాట్ బిఫోర్ మీ’- ఈ మాట ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తోంది. సుప్రీంకోర్టుల నుంచి హైకోర్టుల వరకు కూడా.. న్యాయ మూర్తులు పలు కేసుల విచారణ నుంచి దూరం జరుగుతున్నారు. గతంలో ఆయా కేసులకు సంబందించిన పిటిషనర్ల తరఫున వీరు న్యాయ వాదులుగా వాదించడమో.. లేక గతంలో ఈ కేసులను న్యాయమూర్తులగా ఉండి విచారణ చేయడమో.. నేపథ్యంలో న్యాయమూర్తులు ఇలా నాట్ బిఫోర్ మీ అనే ఫార్ములాను వినియోగిస్తున్నారని న్యాయ వర్గాలు చెబుతున్నాయి.
తాజాగా ఏపీ హైకోర్టు సీఎం జగన్కు సంబంధించిన ఓ కేసులో న్యాయమూర్తి ఇలానే తప్పుకొన్నారు. ఏపీ సీఎం నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం.. జగన్కు, ఆయన కుటుంబానికి, బందుగణానికి లబ్ది చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుందని దీనివల్ల ప్రజాధనం తరిగిపోతోందని ఆరోపిస్తూ.. వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. దీనిని సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఈ పిటిషన్ తాజాగా మంగళవారం విచారణకు వచ్చింది.
అయితే, ఈ పిటిషన్ను పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ రఘునందనరావు.. నాట్ బిఫోర్మీ అంటూ.. వైదొలిగారు. ఈ పిటిషన్ను వేరే బెంచ్కు బదిలీ చేసేలా ప్రధాన న్యాయమూర్తికి సూచించాలని ఆయన రిజిస్ట్రీని ఆదేశించారు. దీంతో ఈ కేసు విచారణ వేరే బెంచ్కు బదిలీ కానుంది. ఇదిలావుంటే, రాష్ట్రంలో ఓటర్ల అవకతవకలకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణలోనూ ఇలానే జరిగింది. ఈ కేసు విచారణ నుంచి సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వైదొలిగారు. గతంలో ఈయన ఏపీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం గమనార్హం.
This post was last modified on November 8, 2023 3:08 pm
ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేష్ రాథి మరోసారి తన వివాదాస్పద నోట్బుక్ సెలబ్రేషన్తో వార్తల్లోకెక్కాడు.…
ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ కేవలం ఒక్క రోజు గ్యాప్ లో ది ప్యారడైజ్, పెద్దిలు క్లాష్ కానుండటం ట్రేడ్…
పుష్ప 2 ది రూల్ తో ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించిన అల్లు అర్జున్ తర్వాతి సినిమాకు రంగం…
ఒక చిన్న టీజర్ కోసం ఫ్యాన్స్ ఇంతగా ఎదురు చూడటం మెగా ఫ్యాన్స్ కు పెద్ది విషయంలోనే జరిగింది. కొత్త…
పాకిస్థాన్ క్రికెట్ జట్టు వరుస పరాజయాలతో విసిగిపోయింది. తాజాగా న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో 0-3 తేడాతో ఓడిన తర్వాత అభిమానుల…
ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఆశించినంత బాగాలేదు. తొలి మ్యాచ్లో పరుగుల వర్షం కురిపించిన జట్టు, ఆ…