Political News

నిండు అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి ‘కామ’ వ్యాఖ్య‌లు

బిహార్ సీఎం నితీశ్ కుమార్‌. ఈ పేరు విన‌గానే సౌమ్యుడు, విన‌య‌శీలి, రాజ‌కీయంగా ప‌రిణితి ఉన్న వివాద ర‌హిత నాయ‌కుడి గా చెబుతారు. అంతేకాదు..కేంద్రంలోని న‌రేంద్ర మోడీని సైతం ఎదిరించి.. పాల‌న సాగిస్తున్న నేత‌గా కూడా గుర్తింపు తెచ్చుకు న్నారు. అలాంటి నితీశ్ కుమార్ నోట‌.. అన‌కూడ‌ని మాట‌.. బ‌హిరంగ ప్రాంతాల్లో విన‌కూడ‌ని మాట వ‌చ్చింది. అది కూడా ఏ న‌లుగురు మ‌ధ్యో కాదు.. త‌న పార్టీ నేత‌ల మ‌ధ్య అంత‌క‌న్నా కాదు. ప్ర‌జ‌లతో ఎన్నుకోబ‌డిన శాస‌న స‌భ్యులు కొలువు దీరిన బిహార్ నిండు అసెంబ్లీలోనే!! శృంగారం చివ‌ర్లో మ‌హిళ‌లు.. `దానిని బ‌య‌ట‌కు తీసేస్తే..` రాష్ట్రంలో జ‌నాభా నియంత్ర‌ణ జ‌రుగుతుంది అని నితీశ్ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తున్నాయి.

విష‌యంలోకి వెళ్తే.. బిహార్ ముఖ్య‌మంత్రి సాహ‌సోపేత నిర్ణ‌యం తీసుకుని రాష్ట్రంలో కుల‌గ‌ణ‌న చేప‌ట్టారు. ఇది దేశంలోనే తొలిసా రి. దీనిపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. కేసులు సుప్రీంకోర్టు వ‌ర‌కు వెళ్లినా.. ఆయ‌న వెనుదిర‌గ‌కుండా ముందుకే సాగారు.ఇక‌, ఈ కుల గ‌ణ‌న‌కు సంబంధించిన‌తుది రిపోర్టు రావ‌డం.. దానిని స్వ‌యంగా నితీశ్ కుమార్ స‌భ‌లో ప్ర‌వేశ పెట్ట‌డం వెంట‌వెంట‌నే జ‌రిగిపోయాయి. ఈ సంద‌ర్భంగా నితీశ్ ఈ నివేదిక‌లోని గ‌ణాంకాల‌ను అసెంబ్లీలో చ‌దివి వినించారు. రాష్ట్రంలో జ‌నాభా పెరుగుతోంద‌ని.. దీనిని నియంత్రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.

అయితే.. జ‌నాభా నియంత్ర‌ణ విష‌యంలో పురుషుల క‌న్నా మ‌హిళ‌ల‌కే అవ‌గాహ‌న ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెప్పారు. అందునా చ‌దువుకున్న మ‌హిళ‌లైతే మ‌రింత అవ‌గాహ‌న ఉంటుంద‌ని అన్నారు. ఇది కూడా త‌ప్పుకాదు. కానీ.. ఇక్క‌డే నితీశ్ పెద్ద త‌ప్పుడు మాట అనేశారు. జ‌నాభా నియంత్ర‌ణ విష‌యంలో పురుషుల క‌న్నా మ‌హిళ‌ల‌కే ఎక్కువ అవ‌గాహ‌న ఉంటుంది. అది కూడా చ‌దువుకున్న మ‌హిళ‌లైతే మ‌రింత ఉంటుంది. గ‌ర్భం రాకుండా శృంగారం చేయ‌డం ఎలా అనేది ఆమెకు బాగా తెలుస్తుంది. శృంగారం అంతా స‌రిగానే జ‌రిగినా.. చివ‌రి కొద్ది పాటి నిమిషంలో `బ‌య‌ట‌కు తీసేయాలి`. ఈ విష‌యం చ‌దువుకున్న మ‌హిళ‌ల‌కు తెలుస్తుంది. దీంతో రాష్ట్రంలో జ‌నాభా నియంత్ర‌ణ దానంత‌ట అదే జ‌రిగిపోతుంది అని తీవ్ర వివాదాస్ప‌ద వాఖ్య‌లు చేశారు.

ఇక‌,నితీశ్ వ్యాఖ్య‌లు రాజ‌కీయ మంట‌లు పుట్టించాయి. నితీశ్ ను ఓ అస‌భ్య‌క‌ర‌మైన నాయ‌కుడిగా బీజేపీ నేత‌లు అభివ‌ర్ణించా రు. సోష‌ల్ మీడియాలోనూ నిన్న మొన్నటి వ‌రకు నితీశ్ అంటే సానుభూతి క‌న‌బ‌రిచిన వారు కూడా ఇలాంటి మాట‌లు అనేందుకు నోరెలా వ‌చ్చింద‌ని దుయ్య‌బ‌ట్టారు. నితీశ్ వ్యాఖ్య‌లు దేశ‌వ్యాప్తంగా దావాల‌నంలా వ్యాపించాయి. దీంతో కేంద్రంలోని బీజేపీ నేత‌లు సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌హిళా క‌మిష‌న్ కూడా నోటీసులు జారీ చేసింది. అయితే, అసెంబ్లీ ప‌రిధిలో జ‌రిగిన విష‌యం కావ‌డంతో దీనిపై స్పీక‌ర్ వివ‌ర‌ణ ఇవ్వాల్సి ఉంటుంద‌ని అధికార వ‌ర్గాలుతెలిపాయి.

This post was last modified on November 8, 2023 7:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

56 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

4 hours ago