తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాదులో నేడు జరిగిన బీసీల ఆత్మగౌరవ సభకు హాజరైన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఉంటుందని, బిజెపికి తాను పూర్తి మద్దతు ప్రకటిస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ సందర్భంగా బీసీని తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తానని ప్రధాని మోడీ ప్రకటించడాన్ని పవన్ స్వాగతించారు.
అలా ప్రకటన చేయడానికి ధైర్యం కావాలని,, సామాజిక తెలంగాణ, బీసీ తెలంగాణకు తాను పూర్తి మద్దతిస్తున్నానని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ వచ్చినా నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందాయా అని ప్రశ్నించారు. సకలజనులు ఉద్యమిస్తేనే తెలంగాణ వచ్చిందని, జల్, జంగల్, జమీన్ అని కొమురం భీం పోరాడారని గుర్తు చేశారు. ఎన్నికల స్టంట్ కోసం ప్రధాని మోడీ ఏదీ చేయలేదని, అలా అయితే ఆర్టికల్ 370 రద్దు, మహిళా బిల్లు వంటివి వచ్చేవి కాదని చెప్పారు.
మోడీ ప్రధాని అయిన తర్వాత దేశంలో ఉగ్ర దాడులు తగ్గాయని అన్నారు. అంతర్జాతీయంగా భారత్ ను ప్రధాని అగ్రగామిగా నిలిపారని ప్రశంసించారు. ప్రతి భారతీయుడి గుండెల్లో ధైర్యం నింపిన వ్యక్తి మోడీ అని, అలాంటి ప్రధానికి అండగా ఉంటామని చెప్పారు. మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని అవుతారని పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని పవన్ నినదించారు.
This post was last modified on November 8, 2023 6:19 am
70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…
కొత్త సినిమాల సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డార్లింగ్ వర్షంలో తడిసిపోతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దీనికొచ్చిన…
ఒకప్పుడు వేసవి సీజన్ అంటే పెద్ద హీరోల సినిమాలతో కళకళలాడిపోయేది. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితులు మారిపోయాయి. ముందు పెద్ద…
బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నది సల్మాన్ ఖానే. ఆయన నిఖార్సయిన బ్లాక్బస్టర్ కొట్టి దశాబ్దం…
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…