Political News

న‌న్ను తిట్టిన వారు ఏమ‌య్యారో తెలుసుగా: మోడీ

“తెలంగాణ ఎన్నిక‌ల్లో న‌న్ను తిడుతున్నారు. కానీ, న‌న్ను తిట్టిన వారు ఏమ‌య్యారో తెలుసుగా. న‌న్ను తిట్టిన నాయ‌కులు.. ప్ర‌జ‌ల మ‌ధ్య లేరు. ప్ర‌జ‌ల ఓట్లు కూడా వారికి ప‌డ‌వు. క‌నీసం అధికారంలోకి వ‌చ్చేందుకు క‌నీస దూరంలో కూడా లేరు” అని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీఎన్నిక ల‌నేప‌థ్యంలో బీజేపీ అభ్య‌ర్థుల త‌ర‌ఫున ఆయ‌న ఈ రోజు తొలిసారి ప్ర‌చారానికి వ‌చ్చారు. ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అటు కాంగ్రెస్‌, ఇటు బీఆర్ ఎస్‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

తుఫాన్ ఖాయం
ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో బీజేపీ తుఫాన్ వ‌స్తుంద‌ని ప్ర‌ధాని మోడీ జోస్యం చెప్పారు. తెలంగాణ స‌మాజం అభివృద్ధిని కోరుకుంటోంద‌ని.. అది తాము చేస్తున్నామ‌ని గిరిజ‌న యూనివ‌ర్సిటీ స‌హా అనేక ప‌థ‌కాలు ఇక్క‌డ అమ‌లు చేస్తున్నామ‌న్నారు. ర‌హ‌దారుల విస్త‌ర‌ణ కూడా తమ హ‌యాంలోనే జ‌రిగింద‌న్నారు. కుటుంబ పార్టీల‌కు కాంగ్రెస్‌, బీఆర్ ఎస్‌లు కేరాఫ్ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కాంగ్రెస్‌ పార్టీకి బీఆర్‌ఎస్ బీ టీంగా అభివ‌ర్ణించారు. బీఆర్ ఎస్‌, కాంగ్రెస్ ల డీఎన్ ఏ ఒక్కటేన‌న్నారు. అవినీతి, కుటుంబపాలన, బుజ్జగింపు రాజకీయాలు వారి లక్షణాలని విమ‌ర్శించారు.

బీసీల ఆకాంక్షలను పట్టించుకునేది బీజేపీ మాత్రమేన‌ని మోడీ చెప్పారు. బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చామ‌ని తెలిపారు. జనాన్ని దోచుకున్న వారు.. ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాల్సిదేన‌ని, రాష్ట్రాన్ని దోచుకోవాలన్నదే బీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌ లక్ష్యంమ‌ని దుయ్య‌బ‌ట్టారు. “వారి పిల్లలకు దోచిపెట్టడమే వాళ్ల పని. మీ పిల్లల భవిష్యత్‌ వారికి ఏ మాత్రం పట్టదు. ఒక తరం భవిష్యత్‌ను బీఆర్ ఎస్ నాశనం చేసింది. అబ్దుల్‌ కలామ్‌ను వాజ్‌పేయీ రాష్ట్రపతిని చేశారు. పీఏ సంగ్మా, బాలయోగిని స్పీకర్‌ చేసింది బీజేపీనే. రామ్‌నాథ్‌ కోవింద్‌ను రాష్ట్రపతిని చేసింది బీజేపీనే. గిరిజన మహిళ ద్రౌపతి ముర్మును రాష్ట్రపతిని చేసింది బీజేపీనే. ఓబీసీని అయిన నన్ను ప్రధానిని చేసింది బీజేపీనే. మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో బీసీలకు 27శాతం రిజర్వేషన్‌ కల్పించాం.” అని మోడీ వివ‌రించారు.

This post was last modified on November 8, 2023 6:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

9 minutes ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

41 minutes ago

ఇరానీ చాయ్ మీద ఇరాన్ వార్

ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…

47 minutes ago

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాసం.. ఎందుకంటే!

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్‌సభ స్పీకర్‌పై తమకు విశ్వాసం…

58 minutes ago

రెండు విషయాల్లో ఉస్తాదే కరెక్ట్

ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…

2 hours ago

అసెంబ్లీకి వస్తే ఆ జాకీలను పడేయొచ్చుగా జగన్

అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…

4 hours ago