దివంగత సీఎం వైఎస్ రాజశేఖరెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్ సోదరి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షు రాలు వైఎస్ రాజకీయాలు క్యామెడీగా మారాయా? వైఎస్ కుటుంబం నుంచి కీలక నాయకులు వచ్చి.. ప్రజలతో జై కొట్టించుకున్నారు. కానీ, షర్మిల మాత్రం ప్రజాక్షేత్రంలో పోటీకి దూరం అంటూ.. కేసీఆర్ కోసమే తాను పోటీ నుంచి విరమించుకున్నానని చెబుతుండడం.. అదేసమయంలో కాంగ్రెస్ నేత, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై పరోక్ష విమర్శలు చేయడం వంటివి తెలంగాణ సమాజాన్ని నవ్వుకునేలా చేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.
తెలంగాణలోనూ రాజన్న రాజ్యం తెస్తానని, తాను తెలంగాణ గడ్డకు కోడలినని పదే పదే చెప్పుకొని ప్రజల నుంచి సింపతీ గెయిన్ చేయాలని ప్రయత్నించిన షర్మిల పాదయాత్ర కూడా చేశారు. అయితే.. అర్థంతరంగా దీనిని నిలుపుదల చేయడం తెలిసిందే. సమస్యలు ప్రస్తావించాల్సిన చోట రాజకీయాలు ప్రస్తావించి అభాసుపాలయ్యారనే వాదన కూడా ఉంది. ముఖ్యంగా పాలేరు నుంచి తాను పోటీకి సిద్ధమని ప్రకటించి.. భారీ ఎత్తున ప్రచారం చేశారు. ఆమెకు పార్టీలోని కొందరు లక్షల రూపాయలు ఖర్చు చేసి కటౌట్లు ఏర్పాటు చేశారు.
తీరా ఎన్నికల సమయానికి ఆమె కాంగ్రెస్ కు మద్దతిస్తున్నట్టు ప్రకటించి కార్యకర్తలు, నాయకులకు హ్యాం డిచ్చారు. ఇది సరే. ఇక, కాంగ్రెస్కు మద్దతిచ్చినా.. సీఎం సీటు విషయంలో రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా దొంగలు సీఎం కాకూడదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. ఒక పార్టీకి మద్దతిచ్చే ముందే.. అన్నీ ఆలోచించుకోవాలి. మరి ఈ విషయంలో షర్మిల ఏం చేసినట్టు? అనే ప్రశ్న తెరమీదికి వచ్చింది. ఇక, ఏపీ విషయంపైనా షర్మిల సంబంధం లేదని తేల్చేశారు.
వాస్తవానికి సీఎం జగన్ సొంత అన్న. ఆయన కోసం పాదయాత్ర కూడా చేసింది షర్మిల. కానీ, ఆస్తులు, పదవుల విషయంలో తలెత్తిన వివాదంతో తెలంగాణకు వెళ్లారు. ఇక, అక్కడ కూడా చెల్లని రూపాయిగానే మిగిలిపోయారనే వాదన వినిపిస్తోంది. ఆమె చేసుకున్న స్వయం కృత అపరాధాలతో ఇటు ఎన్నికలకు, అటు ప్రజలకు కూడా దూరమయ్యారని అంటున్నారు. వైఎస్ కుటుంబం నుంచి ఆయన భార్య విజయలక్ష్మి, సోదరుడు వివేకానందరెడ్డి, తనయుడు జగన్ రాజకీయాల్లో రాణించారు. గెలుపు గుర్రం ఎక్కారు. కానీ, షర్మిల మాత్రం వైఎస్ ఫొటో పెట్టుకుని రాజకీయాలను క్యామెడీ చేశారని అంటున్నారు వైఎస్ అభిమానులు.
This post was last modified on November 7, 2023 8:50 pm
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ…
ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను…
ఎప్పుడూ ట్విట్టర్ లో, బయట హడావిడి చేసే ఎలన్ మస్క్ ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఆయనకి ఆయనగా…
తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…
ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…
నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని…