తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 3 నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైనప్ప టికీ.. ముహూర్తాలు, సెంటిమెంటు, రోజులు, వారాలు, వర్జ్యాలు చూసుకుని అభ్యర్తులు నామినేషన్లు వేస్తున్నారు. ఇక, ఎప్పటి లాగానే మందీ మార్బలంతో బల నిరూపణలు కూడా చేసుకుంటున్నారు. అయితే.. ఎవరైనా పిలిచారో.. లేక పిలవకుండానే వచ్చారో.. తెలియదు కానీ, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్ పర్వానికి జనం ప్రభంజనంగా పోటెత్తారు.
వందలు వేలు కాదు.. ఏకంగా లక్షల సంఖ్యలో ప్రజలు ఈ నామినేషన్ ఘట్టానికి తరలి రావడం సోషల్ మీడియాను కుదిపేస్తోం ది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రేవంత్రెడ్డి సోమవారం నామినేషన్ వేశారు. తనకు సంప్రదాయంగా వస్తున్న కొడంగల్ నియోజకవర్గం నుంచి ఆయన ఈ సారి కూడా పోటీకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో మాత్రం ఆయన ఇక్కడ ఓడిపోయారు. పైగా అప్పటి ఎన్నికల వేళ.. ఆయన ఇంట్లో పోలీసుల సోదాలు జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఆయన టీడీపీలో ఉన్నారు.
ఇదిలావుంటే, తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న ఆయన కొడంగల్ అబ్యర్థిగా నామినేషన్ వేసేందుకు రాగా.. ఆయనను అనుసరిస్తూ.. భారీ ఎత్తున ప్రజలు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పోటెత్తారు. సుమారు నిమిషం పాటు ఉన్న ఈ వీడియోలో ఎటు చూసిన జనమే కనిపిస్తున్నారు. కాంగ్రెస్ జెండాలతో రోడ్లు, ఫుట్పాత్లు కూడా నిండిపోయారు. మొత్తానికి కొండల్ జనసంద్రంగా మారిపోయింది. ఇదిలావుంటే.. బీఆర్ ఎస్ మంత్రి కేటీఆర్ మాత్రం కొడంగల్లో రేవంత్ను మట్టికరిపిస్తామని వ్యాఖ్యలు చేసిన మరునాడే.. రేవంత్కు మద్దతుగా ఈ రేంజ్లో జనాలు రావడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది.
రేవంత్ ఆస్తులు-అప్పులు ఇవీ..
కొడంగల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రేవంత్ రెడ్డి ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు.
నిన్న విడుదలైన మా ఇంటి బంగారంకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మెయిన్ సెంటర్స్ థియేటర్లు దాదాపుగా హౌస్ ఫుల్స్ నమోదు…
నిన్న విడుదలైన మా ఇంటి బంగారంలో మూడు పాత్రలు మహిళా ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాయి. మొదటి పేరు సమంత అని…
నిన్న విడుదలైన కొత్త సినిమాల్లో అతి తక్కువ నోటీస్ తెచ్చుకున్నది మలయాళం డబ్బింగ్ బాలన్ ది బాయ్. అన్నపూర్ణ సంస్థ…
కాపుల విషయంలో ఏం చేయాలన్న అంశంపై వైసీపీ తర్జన భర్జన పడుతోందా? వారితో కలిసి ముందుకు సాగాలా? లేక.. వారిని…
ఈ ఏడాది ఫిబ్రవరి 28. ప్రపంచం కళ్లు తెరుస్తున్న సమయం. ఊహాతీతంగా.. అన్ని మీడియాల్లోనూ.. అ ప్పటికే.. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్…
వైసీపీ సీనియర్ నాయకుడు, ఫైర్బ్రాండ్ కొడాలి నానిపై 2021లో నమోదైన కేసు విచారణకు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…