తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 3 నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైనప్ప టికీ.. ముహూర్తాలు, సెంటిమెంటు, రోజులు, వారాలు, వర్జ్యాలు చూసుకుని అభ్యర్తులు నామినేషన్లు వేస్తున్నారు. ఇక, ఎప్పటి లాగానే మందీ మార్బలంతో బల నిరూపణలు కూడా చేసుకుంటున్నారు. అయితే.. ఎవరైనా పిలిచారో.. లేక పిలవకుండానే వచ్చారో.. తెలియదు కానీ, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్ పర్వానికి జనం ప్రభంజనంగా పోటెత్తారు.
వందలు వేలు కాదు.. ఏకంగా లక్షల సంఖ్యలో ప్రజలు ఈ నామినేషన్ ఘట్టానికి తరలి రావడం సోషల్ మీడియాను కుదిపేస్తోం ది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రేవంత్రెడ్డి సోమవారం నామినేషన్ వేశారు. తనకు సంప్రదాయంగా వస్తున్న కొడంగల్ నియోజకవర్గం నుంచి ఆయన ఈ సారి కూడా పోటీకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో మాత్రం ఆయన ఇక్కడ ఓడిపోయారు. పైగా అప్పటి ఎన్నికల వేళ.. ఆయన ఇంట్లో పోలీసుల సోదాలు జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఆయన టీడీపీలో ఉన్నారు.
ఇదిలావుంటే, తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న ఆయన కొడంగల్ అబ్యర్థిగా నామినేషన్ వేసేందుకు రాగా.. ఆయనను అనుసరిస్తూ.. భారీ ఎత్తున ప్రజలు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పోటెత్తారు. సుమారు నిమిషం పాటు ఉన్న ఈ వీడియోలో ఎటు చూసిన జనమే కనిపిస్తున్నారు. కాంగ్రెస్ జెండాలతో రోడ్లు, ఫుట్పాత్లు కూడా నిండిపోయారు. మొత్తానికి కొండల్ జనసంద్రంగా మారిపోయింది. ఇదిలావుంటే.. బీఆర్ ఎస్ మంత్రి కేటీఆర్ మాత్రం కొడంగల్లో రేవంత్ను మట్టికరిపిస్తామని వ్యాఖ్యలు చేసిన మరునాడే.. రేవంత్కు మద్దతుగా ఈ రేంజ్లో జనాలు రావడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది.
రేవంత్ ఆస్తులు-అప్పులు ఇవీ..
కొడంగల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రేవంత్ రెడ్డి ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు.
This post was last modified on November 6, 2023 11:09 pm
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ?…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…