తెలంగాణలో వైఎస్ షర్మిల వైఎస్సార్టీపీ పార్టీ పెట్టడంపై గతంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. షర్మిల పార్టీతో తమకు సంబంధం లేదని, పార్టీ వద్దని చెప్పినా షర్మిల వినలేదని గతంలో సజ్జల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ పార్టీకి షర్మిల మద్దతిస్తున్న నేపథ్యంలో మరోసారి షర్మిలపై సజ్జల విమర్శలు గుప్పించారు. దీంతో, తాజాగా సజ్జల వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్ ఇచ్చారు.
సజ్జలకు తెలంగాణ రాజకీయాలతో ఏం పని అని షర్మిల ప్రశ్నించారు. గతంలో వైఎస్సార్టీపీతో సంబంధం లేదన్న సజ్జల ఇప్పుడు ఏం సంబంధం ఉందని విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఏపీ రాజకీయాల గురించి సజ్జల చూసుకోవాలని, తమ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు. మీకేం సంబంధం..మీ పని మీరు చూసుకోండి అంటూ చురకలంటించారు.
ఇక, కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కేసీఆర్ అమాంతం పెంచేశారని షర్మిల ఆరోపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆ ప్రాజెక్టు వ్యయం 38 వేల కోట్ల రూపాయలని, కానీ, కేసీఆర్ దానిని లక్షా 20 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. కేవలం 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు ఇంత వ్యయం పెంచాల్సిన అవసరం ఏముందని షర్మిల ప్రశ్నించారు. ప్రాజెక్టులో అవసరం లేని చోట కూడా మోటర్లు బిగించారని షర్మిల ఆరోపించారు.
This post was last modified on November 6, 2023 4:39 pm
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…
70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…
కొత్త సినిమాల సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డార్లింగ్ వర్షంలో తడిసిపోతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దీనికొచ్చిన…