తెలంగాణలో వైఎస్ షర్మిల వైఎస్సార్టీపీ పార్టీ పెట్టడంపై గతంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. షర్మిల పార్టీతో తమకు సంబంధం లేదని, పార్టీ వద్దని చెప్పినా షర్మిల వినలేదని గతంలో సజ్జల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ పార్టీకి షర్మిల మద్దతిస్తున్న నేపథ్యంలో మరోసారి షర్మిలపై సజ్జల విమర్శలు గుప్పించారు. దీంతో, తాజాగా సజ్జల వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్ ఇచ్చారు.
సజ్జలకు తెలంగాణ రాజకీయాలతో ఏం పని అని షర్మిల ప్రశ్నించారు. గతంలో వైఎస్సార్టీపీతో సంబంధం లేదన్న సజ్జల ఇప్పుడు ఏం సంబంధం ఉందని విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఏపీ రాజకీయాల గురించి సజ్జల చూసుకోవాలని, తమ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు. మీకేం సంబంధం..మీ పని మీరు చూసుకోండి అంటూ చురకలంటించారు.
ఇక, కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కేసీఆర్ అమాంతం పెంచేశారని షర్మిల ఆరోపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆ ప్రాజెక్టు వ్యయం 38 వేల కోట్ల రూపాయలని, కానీ, కేసీఆర్ దానిని లక్షా 20 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. కేవలం 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు ఇంత వ్యయం పెంచాల్సిన అవసరం ఏముందని షర్మిల ప్రశ్నించారు. ప్రాజెక్టులో అవసరం లేని చోట కూడా మోటర్లు బిగించారని షర్మిల ఆరోపించారు.
టాలీవుడ్లో ఎప్పుడూ ఒక పద్ధతి ప్రకారం, డెడ్ లైన్స్ పెట్టుకుని పని చేసే హీరో నేచురల్ స్టార్ నాని. చెప్పిన డేటుకు సినిమాను…
చేతి కళను మాత్రమే కాదు... ఆ చేతుల వెనుక ఉన్న జీవితాలను కూడా స్పృశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.…
సినిమాలను అడ్డుకోవడం లేదా బ్యాన్ చేయడం వల్ల వాటి క్రేజ్ తగ్గడం పక్కన పెడితే నెటిజన్లలో క్యూరియాసిటీ మరింత పెరుగుతుందని…
బాలీవుడ్లో ఒకప్పుడు కంగనా రనౌత్కు తిరుగులేని స్టార్ ఇమేజ్, మార్కెట్ ఉండేది. కానీ వరుస ఫ్లాపులకు తోడు ఆమె వ్యక్తిగత ప్రవర్తన కారణంగా…
రాఘవ లారెన్స్ అంటే మొదట స్టార్ కొరియోగ్రాఫర్. తర్వాత అతను నటుడిగా మారి కొన్ని సినిమాలు చేశాడు. అంత వరకు…
బాలీవుడ్ బిగ్గెస్ట్ విజువల్ గ్రాండియర్ గా ప్రచారంలో ఉన్న రామాయణ పార్ట్ 1 దీపావళి విడుదలకు రెడీ అవుతోంది. ఇంకా…