తెలంగాణలో వైఎస్ షర్మిల వైఎస్సార్టీపీ పార్టీ పెట్టడంపై గతంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. షర్మిల పార్టీతో తమకు సంబంధం లేదని, పార్టీ వద్దని చెప్పినా షర్మిల వినలేదని గతంలో సజ్జల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ పార్టీకి షర్మిల మద్దతిస్తున్న నేపథ్యంలో మరోసారి షర్మిలపై సజ్జల విమర్శలు గుప్పించారు. దీంతో, తాజాగా సజ్జల వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్ ఇచ్చారు.
సజ్జలకు తెలంగాణ రాజకీయాలతో ఏం పని అని షర్మిల ప్రశ్నించారు. గతంలో వైఎస్సార్టీపీతో సంబంధం లేదన్న సజ్జల ఇప్పుడు ఏం సంబంధం ఉందని విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఏపీ రాజకీయాల గురించి సజ్జల చూసుకోవాలని, తమ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు. మీకేం సంబంధం..మీ పని మీరు చూసుకోండి అంటూ చురకలంటించారు.
ఇక, కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కేసీఆర్ అమాంతం పెంచేశారని షర్మిల ఆరోపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆ ప్రాజెక్టు వ్యయం 38 వేల కోట్ల రూపాయలని, కానీ, కేసీఆర్ దానిని లక్షా 20 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. కేవలం 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు ఇంత వ్యయం పెంచాల్సిన అవసరం ఏముందని షర్మిల ప్రశ్నించారు. ప్రాజెక్టులో అవసరం లేని చోట కూడా మోటర్లు బిగించారని షర్మిల ఆరోపించారు.
This post was last modified on November 6, 2023 4:39 pm
ఇవాళ అందరూ బైకర్, రాకాస గురించే మాట్లాడుకుంటున్నారు కానీ వీటితో పాటు కార్మేని సెల్వం అనే డబ్బింగ్ సినిమా రిలీజైన…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని జైలుకు వెళ్లేందుకెు సిద్ధపడిపోయారా? అంటే.. అవుననే సమాధానమే…
అమెరికాలో ఉంటున్న తెలుగు అమ్మాయి, ఇన్ఫ్లుయెన్సర్ (పికు నెమలి) సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పార్టీ పేరు,…
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఇప్పుడు భాషా పరమైన సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఒకప్పటిలా కాకుండా టాలీవుడ్ కు చెందిన అగ్ర నిర్మాణ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వస్తుందంటే సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా ఉండదు. ఏప్రిల్ 8వ తేదీ కోసం…