తెలంగాణలో వైఎస్ షర్మిల వైఎస్సార్టీపీ పార్టీ పెట్టడంపై గతంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. షర్మిల పార్టీతో తమకు సంబంధం లేదని, పార్టీ వద్దని చెప్పినా షర్మిల వినలేదని గతంలో సజ్జల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ పార్టీకి షర్మిల మద్దతిస్తున్న నేపథ్యంలో మరోసారి షర్మిలపై సజ్జల విమర్శలు గుప్పించారు. దీంతో, తాజాగా సజ్జల వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్ ఇచ్చారు.
సజ్జలకు తెలంగాణ రాజకీయాలతో ఏం పని అని షర్మిల ప్రశ్నించారు. గతంలో వైఎస్సార్టీపీతో సంబంధం లేదన్న సజ్జల ఇప్పుడు ఏం సంబంధం ఉందని విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఏపీ రాజకీయాల గురించి సజ్జల చూసుకోవాలని, తమ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు. మీకేం సంబంధం..మీ పని మీరు చూసుకోండి అంటూ చురకలంటించారు.
ఇక, కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కేసీఆర్ అమాంతం పెంచేశారని షర్మిల ఆరోపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆ ప్రాజెక్టు వ్యయం 38 వేల కోట్ల రూపాయలని, కానీ, కేసీఆర్ దానిని లక్షా 20 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. కేవలం 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు ఇంత వ్యయం పెంచాల్సిన అవసరం ఏముందని షర్మిల ప్రశ్నించారు. ప్రాజెక్టులో అవసరం లేని చోట కూడా మోటర్లు బిగించారని షర్మిల ఆరోపించారు.
దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని…
నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…