తెలంగాణ ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రాంతీయ పార్టీ వాదం, తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకోవడం కేసీఆర్ కు అలవాటే.. ఇదీ ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. జాతీయ పార్టీలకు, ఢిల్లీ నేతలకు గులాం కొట్టాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు లేదని, ప్రాంతీయ పార్టీలకే పట్టం కట్టాలని కేసీఆర్ చెబుతూనే ఉంటారు. తాజాగా మరోసారి కేసీఆర్ అదే మాట స్పష్టం చేశారు. ప్రాంతీయ పార్టీలే రక్ష అని.. బీఆర్ఎస్ ను గెలిపించుకోవాలన్నారు. కానీ ఇక్కడ కేసీఆర్ ఓ లాజిక్ మిస్సయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా జాతీయ పార్టీగా మారింది కదా అనే విషయాన్ని కేసీఆర్ మర్చిపోయారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ గా పోటీపడ్డ కేసీఆర్ పార్టీ.. ఇప్పుడు బీఆర్ఎస్ గా బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. గత రెండు ఎన్నికల్లో అంటే టీఆర్ఎస్ కేవలం తెలంగాణకే పరిమితం కాబట్టి ప్రాంతీయ పార్టీ పేరుతో కేసీఆర్ సాగిపోయారు. కానీ ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా మారిన పార్టీ జాతీయ స్థాయిలో ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో వరుసగా రెండు సార్లు అధికారంలోకి రావడంతో ఇక జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఫోకస్ పెట్టినట్లే కనిపించారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ బీజేపీ కూటమి, కాంగ్రెస్ కూటమి కాకుండా మూడో ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేశారు. జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నేతలను కలిశారు. కానీ అవేవీ కలిసి రాకపోవడంతో సైలెంట్ అయిపోయారు.
ఆ తర్వాత తానే సొంతంగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుని టీఆర్ఎస్ ను కాస్తా బీఆర్ఎస్ గా మార్చారు. ఇప్పుడు మహారాష్ట్రలో పార్టీ ఉనికిని విస్తరించేందుకు విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీని జాతీయ పార్టీగా మార్చేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ను మళ్లీ ప్రాంతీయ పార్టీగా కేసీఆర్ పేర్కొనడం ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దిల్లీ కేంద్రంగా సాగే కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు ఏమీ చేయలేవని, ఢిల్లీలో స్విచ్ వేస్తే ఇక్కడ లైట్లు వెలుగుతాయని కేసీఆర్ అన్నారు. అందుకే బీఆర్ఎస్ కు ఓట్లు వేయాలని కోరారు. దీంతో జాతీయ పార్టీగా బీఆర్ఎస్ కథ కంచికేనా? అని విశ్లేషకులు అంటున్నారు. లేదా ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీగా ముద్ర కొనసాగించి.. ఆ తర్వాత మళ్లీ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెడతారా? అన్నది చూడాలి.
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…