Political News

బెజ‌వాడ తూర్పుకు సెగ‌పెడితే.. అవినాష్‌కు పెద్ద డ్యామేజ్‌..!

విజ‌య‌వాడ‌లో టీడీపీ బ‌లం ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం తూర్పు కాన్సిట్యుయెన్సీ. ఈ సెగ్మెంట్ ప‌రిధిలో ప్ర‌జ‌లు టీడీపీకే వ‌రుస‌గా జై కొడుతున్నారు. 2014లో ఇక్క‌డ నుంచి టీడీపీ విజ‌యం ద‌క్కించు కుంది. త‌ర్వాత 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ హ‌వా రాష్ట్ర వ్యాప్తంగా క‌నిపించినా.. ఇక్క‌డ మాత్రం టీడీపీనే తిరిగి సీటు ద‌క్కించుకుంది. గ‌ద్దె రామ్మోహ‌న్ వ‌రుస‌గా ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపు గుర్రం ఎక్కుతున్నా రు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో ఇక్క‌డ పాగావేయాల‌న్న‌ది వైసీపీ వ్యూహం.

ఈ క్ర‌మంలోనే బ‌ల‌మైన నాయ‌కుడిగా పేరున్న దేవినేని అవినాష్‌ను ఇక్క‌డ నుంచి పోటీ చేయించే ఆలోచ‌న‌లో వైసీపీ ఉంది. దీంతో ఆయ‌న‌కు ఎప్ప‌టి నుంచో ఇక్క‌డ ఫ్రీహ్యాండ్ ఇస్తున్నారు. ఆయ‌న కూడా కార్య‌క్ర‌మాల్లో దూకుడుగా ఉన్నారు. నియోజ‌కవ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నారు. వారి స‌మ‌స్య‌ల‌పై త‌క్ష‌ణ‌మే స్పందిస్తున్నారు. సీఎం జ‌గ‌న్‌తోనూ మంచి రేపో మెయింటెన్ చేస్తున్నారు.

ఇలా.. దేవినేని దూకుడు బాగున్న స‌మ‌యంలో అనూహ్యంగా ఇక్క‌డ జ‌రుగుతున్న ప‌రిణామాలు.. పార్టీ లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. తాజాగా రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసిన ముసాయిదా ఓట‌ర్ల జాబితాలో తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలోని ఓట‌ర్ల‌ను సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోకి బ‌దిలీ చేయ‌డం.. అధికార పార్టీ విజ‌యానికి భారీ అడ్డంకిగా మారింద‌నే వాద‌న వినిపిస్తోంది.

తూర్పు ప‌రిధిలోని కృష్ణ‌లంక‌, రాణీగారి తోట‌, ప‌శువుల ఆసుప‌త్రి ప‌రిధిలో ఉన్న దాదాపు 22 వేల మంది ఓట‌ర్ల‌ను సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోకి చేర్చారు. మ‌రి ఇది ఎవ‌రు చేశారు? ఎందుకు చేశారు? అనేది తెలియ‌క‌పోయినా.. దీంతో వైసీపీ విజ‌యావ‌కాశాలు మాత్రం స‌న్న‌గిల్లే ప్ర‌మాదం ఉంద‌నే హెచ్చ‌రిక‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు.. సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. ఇక్క‌డ టీడీపీ నాయ‌కుడు బొండా ఉమా దూకుడుగా ఉన్నారు.

ఈ నేప‌థ్యంలోనే ఇక్క‌డ టీడీపీకి చెక్ పెట్టేందుకు తూర్పు నుంచి ఓట్ల‌ను బ‌దలాయించార‌నే చ‌ర్చ సాగుతోంది. కానీ, ఇలా చేయ‌డం వ‌ల్ల‌..తూర్పులో యువ నాయ‌కుడైన అవినాష్ విజ‌యంపై ప్ర‌భావం చూపుతుంద‌ని చెబుతున్నారు. ఎందుకంటే.. ఇప్పుడు బ‌దిలీ అయిన ఆయా ప్రాంతాల్లో అవినాష్‌కు ప‌ట్టు ఎక్కువ‌గా ఉంది. ఈ నేప‌థ్యంలో బ‌దిలీ అయిన ఓట్ల వ్య‌వ‌హారంలో ఎవ‌రి ప్ర‌మేయం ఉంద‌నే విష‌యంపై ఆయ‌న కూపీలాగుతున్న‌ట్టు స‌మాచారం.

దీనిని స‌రిచేసేందుకు యువ నేత ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఏదేమైనా.. తూర్పులో టీడీపీకి చెక్ పెట్టాల‌నే వ్యూహంతో వైసీపీ త‌న ను తానే దెబ్బ‌తీసుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. చివ‌ర‌కు ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on November 6, 2023 8:45 am

Share

Recent Posts

దండోరా దర్శకుడు భలే షాకిచ్చాడే

ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…

50 minutes ago

సుమంత్ కోరుకున్న ఫలితం దక్కిందా

ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…

2 hours ago

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

3 hours ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

3 hours ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

4 hours ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

5 hours ago