“నాకు తిరుగులేదు.. నేను చెప్పిందే వేదం” అంటూ.. పదే పదే చెప్పుకొనే వైసీపీ నాయకుడు, ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు ఆయన వ్యవహార శైలే ఇప్పుడు పెద్ద కష్టంగా మారింది. మరో ఐదు మాసాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే బొల్లాకు వ్యతిరేకంగా.. సొంత పార్టీ నాయకులే చక్రం తిప్పుతున్నారు. బొల్లా వద్దు.. సుధ ముద్దు! అంటూ.. నాయకులు ప్రచారం చేస్తున్నారు.
2019 ఎన్నికల్లో వినుకొండ నియోజకవర్గం నుంచి స్థానికుడైన బొల్లాకు వైసీపీ అధినేత జగన్ టికెట్ ఇచ్చారు. ఆ సమయంలో అందరినీ కొలుపుకొని పోయిన బొల్లా.. టీడీపీ నేత, అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులపై అతి కష్టం మీద గెలుపు గుర్రం ఎక్కారు. ముఖ్యంగా బొల్లా విజయానికి రెడ్డి సామాజిక వర్గం ఎంతో కష్టపడి పనిచేసింది. అయితే.. బొల్లా ఎమ్మెల్యే అయ్యాక.. ఈ సామాజిక వర్గాన్ని పక్కన పెట్టారనే టాక్ రెడ్డి వర్గం నుంచి బాహాటంగానే వినిపిస్తోంది.
రెడ్డి వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం.. స్థానిక నేతలపై కేసులు పెట్టించడం.. వారిని కనీసం పట్టించుకోకపోవడం వంటివి బొల్లాకు ఇప్పుడు సెగ పెంచేస్తున్నాయి. దీంతో రెడ్డి వర్గం.. ముక్తకంఠంతో బొల్లాకు వ్యతిరేకంగా చక్రం తిప్పుతున్నాయి. “బొల్లా బ్రహ్మనాయుడు.. మాకు అవసరం లేదు. ఆయన వల్ల ఏం జరిగింది? నియోజకవర్గానికి ఆయన ఏం చేశారు? ఆయనను గెలిపించేందుకు ఎంతో కష్టపడిన మాకు ఏం ఒరగబెట్టారు” అని రెడ్డి వర్గం బాహాటంగానే వ్యాఖ్యానిస్తోంది.
ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన నన్నపనేని సుధను తెరమీదికి తెచ్చారు. నన్నపనేని సుధకు టికెట్ ఇవ్వాలని.. ఆమెను గెలిపించుకుంటామని రెడ్డి వర్గం చెబుతోంది. అంతేకాదు.. బొల్లాకు టికెట్ ఇస్తే.. సహకరించేది లేదని కూడా రెడ్డి వర్గం తెగేసి చెబుతోంది. ఇక, సుధ కూడా.. మళ్లీ యాక్టివ్ అయ్యారు.
ఈమె భర్త సతీష్రెడ్డి.. సీఎం జగన్ కు సమీప బంధువు కావడం.. 2014లో పోటీ చేసి ఓడిపోయిన సానుభూతి ఉండడంతో ఈ దఫా ఆమెకే టికెట్ ఇవ్వాలనేది రెడ్డి వర్గం డిమాండుగా ఉంది. ఏదేమైనా బొల్లా ఒంటెత్తు పోకడలు, రెడ్డి వర్గం పై ఆధిపత్యం చలాయించడం.. వారిని కనీసం పట్టించుకోకపోవడం వంటివి ఇప్పుడు ఆయన టికెట్కు ఎసరు పెడుతున్నారనే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం.
This post was last modified on November 5, 2023 2:39 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…